పౌరుల గోప్యత అంటే అంత చిన్నచూపా.. వాట్సాప్పై సుప్రీంకోర్టు ధ్వజం
17-02-202117-02-2021 13:56:40 IST
2021-02-17T08:26:40.573Z17-02-2021 2021-02-17T08:26:36.428Z - - 04-03-2021

ఇతర దేశాల ప్రజలతో పోలిస్తే భారత పౌరుల గోప్యత పట్ల చిన్నచూపు చూస్తున్నారని పిటిషన్లు వస్తున్నాయి. మీ సమాధానమేంటి అంటూ సుప్రీంకోర్టు సామాజిక మాధ్యమమైన వాట్సాప్, దాని మాతృసంస్థ పేస్బుక్లను సుప్రీంకోర్టు నిలదీసింది. ఏ దేశంలోనైనా ప్రజలు లక్షల కోట్ల డబ్బుకంటే తమ వ్యక్తిగత గోప్యతకే ప్రాధాన్యమిస్తారని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇటీవల వాట్సాప్ ప్రకటించిన నూతన గోప్యతా విధానం దేశ ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కును హరించి వేస్తోందని తక్షణం దానిపై స్టే విధంచాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. ఈ సందర్బంగా వాట్సాప్పై, దాని మాతృసంస్థ ఫేస్బుక్పై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
మీది 2–3 ట్రిలియన్ డాలర్ల కంపెనీ అయితే అయ్యుండొచ్చు. కానీ ప్రజలు డబ్బుకన్నా వారి సమాచార గోప్యతకే అధిక ప్రాధాన్యతనిస్తారని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. పైగా ప్రజల ప్రైవసీని పరిరక్షించే బాధ్యత న్యాయస్థానాలపై ఉందని స్పష్టం చేసింది. అంతేకాకుండా పౌరుల వ్యక్తిగత డేటా గోప్యతపై సమాధానమివ్వాల్సిందిగా కేంద్రం, వాట్సాప్, ఫేస్బుక్లకు సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ ఏడాది జనవరిలో వాట్సాప్ కొత్త పాలసీని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం.. వాట్సాప్ తన యూజర్ల బిజినెస్ సంభాషణలను ఫేస్బుక్తో షేర్ చేసుకుంటుంది. ఈ కొత్త పాలసీని అంగీకరించకపోతే ఫిబ్రవరి 8 నుంచి వారి మొబైల్స్లో వాట్సాప్ పని చేయదని వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై యూజర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కొత్త ప్రైవసీ పాలసీ వల్ల తమ వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుంతుదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కర్మన్య సింగ్ సరీన్, మరికొందరు కొత్త ప్రైవసీ పాలసీపై స్టే విధించాల్సిందిగా కోరతూ సుప్రీం కోర్టును కోరారు.
ఈ అభ్యర్థన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బోబ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. మీ కొత్త ప్రైవసీ పాలసీ వల్ల తమ గోప్యతకు భంగం వాటిల్లుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాము ఎవరో ఒకరికి పంపిన సందేశాలను వాట్సాప్, ఫేస్బుక్తో పంచుకోవడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రైవసీని కాపాడటం కోసం మేం తప్పక జోక్యం చేసుకుంటామని చీఫ్ జస్టిస్ ఎస్ఎ బాబ్డే తెలిపారు. ఈ సందర్భంగానే సోషల్ మీడియా దిగ్గజాలు వాట్సాప్, ఫేస్బుక్లకు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. మీది బిలియన్, ట్రిలియన్ డాలర్ల విలువ చేసే కంపెనీ కావొచ్చు. కానీ ప్రజల వ్యక్తిగత గోప్యత అంతకన్నా విలువైనది. దానిని కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది అని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఇతరులతో తమ సంభాషణలని, తమ డేటాని, వాట్సాప్ కంపెనీ ఎవరితోనైనా షేర్ చేస్తే తమ వ్యక్తిగత గోప్యతకు నష్టం వాటిల్లుతుందేమోనని భారత పౌరులు భయపడుతున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయాన్ని పరిశీలించాలని కోర్టు స్పష్టం చేసింది. నూతన గోప్యతా విధానాన్ని అమలుచేస్తే, ప్రజల ప్రైవసీని పరిరక్షించేందుకు తాము జోక్యం చేసుకోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వీ సుబ్రమణియన్ల ధర్మాసనం వాట్సాప్, ఫేస్బుక్లకు నోటీసులు జారీచేసింది. కేంద్ర ప్రభుత్వానికీ నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై స్పందించేందుకు 4 వారాల సమయాన్ని కోర్టు మంజూరు చేసింది.
వాట్సాప్ గోప్యతా విధానంపై పౌరులకు సందేహాలు ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా..ఇది దేశానికి సంబంధించిన సమస్య అని, వినియోగదారుల సమాచారాన్ని షేర్ చేసేందుకు ససేమిరా ఒప్పుకునే ప్రసక్తే లేదు అని కోర్టుకి చెప్పారు. వాట్సాప్ భారత చట్టాలను అనుసరించలేదని మెహతా ఆరోపించారు.
వాట్సాప్ పేమెంట్స్ .. ఆ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్న వాట్సాప్

స్పెక్ట్రమ్ వేలంలో భారీ బిడ్లు.. టాప్ బయ్యర్గా రిలయెన్స్
03-03-2021

ఐదేళ్ల తర్వాత టెలికాం స్పెక్ట్రమ్ వేలం.. జియో దూకుడు..!
03-03-2021

గూగుల్ మెసేజీలకు షెడ్యూల్ పెట్టుకునే అవకాశం కూడా..!
02-03-2021

పీఎస్ఎల్వీ సీ51.. భారత్ ఖ్యాతిని మరింత పెంచుతూ..!
28-02-2021

రెండేళ్లు ఫ్రీ కాల్స్, ఇంటర్నెట్.. జియో సంచలన ఆఫర్
27-02-2021

ఓటీటీల విషయంలో క్లారిటీ ఇచ్చిన కేంద్రం..!
26-02-2021

ఒకే ఒక్క ట్వీట్ లక్ష కోట్లు ఆవిరయ్యేలా చేసింది..!
23-02-2021

చంద్రయాన్-3 వాయిదా
22-02-2021

వాట్సాప్ కు పోటీగా సందేశ్.. క్లిక్ అయ్యేనా..?
19-02-2021

మార్స్ గ్రహంపై నాసా రోవర్.. ఆపరేషన్ లీడ్గా స్వాతి మోహన్
19-02-2021
ఇంకా