భారతదేశం మీద చైనా-పాకిస్థాన్ లు డ్రోన్లతో చెక్ పెట్టబోతున్నాయా..?
26-12-202026-12-2020 17:29:12 IST
Updated On 26-12-2020 17:40:33 ISTUpdated On 26-12-20202020-12-26T11:59:12.462Z26-12-2020 2020-12-26T11:53:19.410Z - 2020-12-26T12:10:33.664Z - 26-12-2020

భారతదేశానికి పక్కనే ఉన్న చైనా-పాకిస్థాన్ లు చేస్తున్న దుశ్చర్యలు అన్నీ-ఇన్నీ కావు. భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని ఓ వైపు చైనా తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉండగా.. భారత్ లోకి తీవ్ర వాదులను పంపి ప్రశాంతత లేకుండా చేయాలనేది పాకిస్థాన్ పన్నాగం. ఇక భారత్ కు వ్యతిరేక చర్యల్లో చైనా-పాకిస్థాన్ లు ఎప్పుడూ పాల్గొంటూ ఉంటాయి. ఎలాగైనా భారత్ ను దెబ్బ కొట్టాలన్నది పాకిస్థాన్ ప్లాన్..! అందుకు చైనా సపోర్ట్ ఎలాగూ ఉంది. తాజాగా పాకిస్థాన్ కు డ్రోన్ల విషయంలో చైనా అండగా నిలిచింది.. ఇక అందుకు తగ్గట్టుగా చైనా మీడియా కూడా ఆహా.. ఓహో గొప్ప డీల్ అంటూ చంకలు గుద్దుకుంటూ ఉంది.
ఇంతకూ పాక్ కు చైనాకు మధ్య జరిగిన డీల్ ఏమిటంటే.. పాకిస్థాన్ కు 50 సాయుధ డ్రోన్ లను అందించడానికి చైనా సిద్ధమవుతోంది. ఈ డ్రోన్లన్నీ పూర్తిగా ఆయుధాలను తమతో మోసుకెళ్లగలవని, వీటిని త్వరలో పాక్కు అందించేస్తున్నారట. చైనా అభివృద్ధి చేసిన వింగ్ లూంగ్-2 డ్రోన్లు పూర్తి సాయుధ టెక్నాలజీతో పనిచేస్తాయని.. పూర్తి స్థాయిలో ఆయుధాలను మోసుకెళ్లి నిర్దిష్ట ప్రాంతంలో జారవిడిచే కెపాసిటీ వీటికి ఉంది. ఈ డీల్ ద్వారా పాక్ భారత్ ను తీవ్ర ఇబ్బందులు పెట్టొచ్చని చైనా మీడియా సంచలన ప్రకటన చేసింది. భారత మిలటరీ ఈ డ్రోన్లను ఎదుర్కోలేదని.. లిబియా, సిరియా, అజర్బైజాన్ ఘర్షణల్లో సాంప్రదాయ యుద్ధాన్ని నమ్ముకున్న ప్రత్యర్థులను ఈ డ్రోన్లు తీవ్రంగా దెబ్బతీశాయని గుర్తు చేశారు. ఇలాంటి డ్రోన్లు చైనా, టర్కీ వద్ద మాత్రమే ఉన్నాయని, ఇప్పుడు పాక్ కూడా ఆ లిస్టు లోకి చేరబోతోందని చెప్పుకొచ్చింది చైనా మీడియా.
చైనా మీడియా వ్యాఖ్యలకు భారత్ అదిరిపోయే కౌంటర్ ను ఇచ్చింది. డ్రోన్లు తయారు చేసింది చైనా కదా.. అవి పని చేస్తాయో లేదో చూసుకోవాలని సూచించింది. చైనా డ్రోన్లు పనిచేస్తాయో లేదో ఒకసారి పరీక్షించుకోవాలని భారత్ కౌంటర్ ఇచ్చింది. తమకు పట్టున్న ప్రాతంలో మాత్రమే డ్రోన్లతో దాడి చేయవచ్చని.. ఎక్కడికైనా వెళ్లి దాడి చేయడం సాధ్యం కాదని భారత్ వివరించి చెప్పింది. ఆఫ్ఘన్ గగనతలంపై పట్టు ఉండడం వల్లే అమెరికా ఉగ్రవాదులపై, వారి స్థావరాలపై దాడులు చేయగలుగుతుందని.. సరిహద్దుల వద్ద భారత్ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి దాడులకు చైనా లేదా పాకిస్థాన్కు అంత సీన్ లేదని చెప్పింది. పాకిస్థాన్, చైనా సరిహద్దులోని భారత రాడార్లు, యుద్ధ విమానాల అనుక్షణం నిఘా ఉంటాయని, వాటిని దాటుకుని లోనికి రావడం చైనా యుద్ధవిమానాలకు కూడా సాధ్యం కాదని వివరించింది.

రెండేళ్లు ఫ్రీ కాల్స్, ఇంటర్నెట్.. జియో సంచలన ఆఫర్
an hour ago

ఓటీటీల విషయంలో క్లారిటీ ఇచ్చిన కేంద్రం..!
13 hours ago

ఒకే ఒక్క ట్వీట్ లక్ష కోట్లు ఆవిరయ్యేలా చేసింది..!
23-02-2021

చంద్రయాన్-3 వాయిదా
22-02-2021

వాట్సాప్ కు పోటీగా సందేశ్.. క్లిక్ అయ్యేనా..?
19-02-2021

మార్స్ గ్రహంపై నాసా రోవర్.. ఆపరేషన్ లీడ్గా స్వాతి మోహన్
19-02-2021

వార్తలు షేర్ చేయకుండా ఫేస్ బుక్ సంచలన నిర్ణయం
18-02-2021

సంచలన ఆఫర్ ను తీసుకుని వచ్చిన వీఐ
18-02-2021

పౌరుల గోప్యత అంటే అంత చిన్నచూపా.. వాట్సాప్పై సుప్రీంకోర్టు ధ్వజం
17-02-2021

వాట్సాప్ ను వెంటాడుతూ ఉన్న ప్రైవసీ వివాదాలు
16-02-2021
ఇంకా