5జీ స్పీడ్ మామూలుగా లేదు.. సెకనకు 700 ఎంబీల డౌన్ లోడ్
04-01-202104-01-2021 13:21:15 IST
2021-01-04T07:51:15.330Z04-01-2021 2021-01-04T07:51:08.236Z - - 20-01-2021

ప్రపంచంలో చాలా దేశాలు ఇంకా 5జి ఇంటర్నెట్ మౌలిక సదుపాయాల కల్పనలోనే కొట్టుమిట్టాడుతుండగా గత సంవత్సరమే 5జీని ప్రవేశపెట్టిన దక్షిణ కొరియా వేగవంతమైన ఇంటర్నెట్ కల్పన విషయం తనకెవరూ పోటీ లేనివిధంగా ముందుకు దూసుకెళుతోంది. కరోనా కారణంగా కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ వీలైనంత త్వరగా 5జీ ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మన దేశంలో కంపెనీలు వేగంగా అడుగులు వేస్తున్నాయి. అయితే ఇప్పటికే 5జీ ఇంటర్ నెట్ దక్షిణ కొరియాలో అందుబాటులో ఉంది. తాజా నివేదికల ప్రకారం దక్షిణ కొరియా రాజధాని సియోల్లో 5జీ వినియోగం రోజు రోజుకి పెరుగుతున్నట్లు తెలుస్తుంది. 2020 రెండో అర్ధ భాగంలో ఎస్కె టెలికాం, కెటి కార్ప్, ఎల్జి అప్లస్ కార్ప్ నెట్వర్క్ యొక్క 5జీ హై-స్పీడ్ ఇంటర్నెట్ డౌన్లోడ్ వేగం 690.47 ఎంబిపిఎస్గా ఉంది. అదే తొలి ఆరు నెలల కాలంలో డౌన్లోడ్ వేగం 33.91 ఎంబీపీఎస్గా నమోదవగా.. ఆ వేగం ఇప్పుడు ఇరవై రెట్లకు పైగా పెరిగింది. దీనికి సంబంధించి దక్షిణ కొరియా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్, ఐసీటీ గణాంకాలు వెల్లడించాయి. ఆ దేశంలోని మూడు ప్రధాన మొబైల్ నెట్ వర్క్ లైన ఎస్కె టెలికాం 5జీ ఇంటర్ నెట్ డౌన్లోడ్ వేగం 795.57 ఎమ్బిపిఎస్, కెటి 667.48 ఎమ్బిపిఎస్, ఎల్జి అప్లస్ 608.49 ఎమ్బిపిఎస్ వద్ద ఉన్నాయి. అలాగే ఆ దేశంలో 4జీ ఎల్టిఇ డౌన్లోడ్ వేగం 153.1 ఎమ్బిపిఎస్గా ఉంది. 4జీ ఎల్టిఇ వేగం కంటే 5జీ ఇంటర్ నెట్ స్పీడ్ నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు అక్కడి యోన్హాప్ వార్తా సంస్థ నివేదించింది. గత ఏడాది ఏప్రిల్లోనే 5జీని మొట్టమొదటి సారిగా కమర్షయలైజ్ చేసిన దేశం దక్షిణ కొరియానే. అలాగే అక్టోబర్ చివరి నాటికి దాదాపు 10 మిలియన్ల 5జీ యూజర్ నెట్ వర్క్ ను త్వరగా నిర్మించింది. దక్షిణ కొరియా దేశంలోని మొత్తం 70 మిలియన్ల మొబైల్ చందాదారుల వాటాలో 14 శాతం 5జీ చందాదారులే. కానీ 5జి అమలులోకి వచ్చిన మొదట్లో సాంకేతిక లోపం, లిమిటెడ్ కవరేజ్, క్వాలిటీ సమస్యలు, ఇంటర్ నెట్ స్పీడ్ 4జీ కంటే తక్కువగా ఉండటంతో మొదట్లో వినియోగదారులు ఎవరు ఆసక్తి చూపలేదు. అయితే ఈ సమస్యలన్నింటిని అక్కడి ప్రభుత్వ సహాయంతో టెలికాం నెట్ వర్క్ లు పరిష్కారించాయి. దీంతో అక్కడి 5జీ వినియోగదారుల సంఖ్య క్రమంగా పెరుగుతూ పోయింది. 2022 నాటికల్లా దేశవ్యాప్తంగా 5జీ కవరేజీని అందించాలని లక్ష్యంగా దక్షిణ కొరియా పెట్టుకుంది. దీనికోసం అక్కడి ప్రముఖ టెలీకాం సంస్థలు 5జీ నెట్వర్క్ కోసం 25.7ట్రిలియన్ అంటే 24 బిలియన్ డాలర్లను ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. భారత్లో కూడా ఈ ఏడాది రెండో అర్ధభాగంలో 5జీ నెట్వర్క్ను తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు రిలయన్స్ జియో ప్రకటించింది. ఆ తర్వాత తమ స్మార్ట్ పోన్లన్నిటినీ 5జీ ప్రాతిపదికనే నిర్మిస్తామని సంస్థ పేర్కొంది. భారత్ లో లాంఛ్ అయిన అమెజాన్ బేసిక్స్ ఫైర్ టీవీ

వాట్సప్ కు భారత్ వార్నింగ్
6 hours ago

ఫ్లిప్ కార్ట్ సూపర్ కాయిన్స్ ను ఇకపై అలా కూడా వాడుకోవచ్చట..!
18-01-2021

ఫేస్బుక్, ట్విట్టర్కు పార్లమెంటరీ ప్యానెల్ పిలుపు
18-01-2021

వాట్సాప్ యూటర్న్.. మే 15 వరకు కొత్త ప్రైవసీ విధానం లేదు
17-01-2021

వాట్సాప్.. వెనకడుగు వేయకతప్పలేదు
17-01-2021

వాట్సాప్ గోప్యత మార్పుతో సిగ్నల్, టెలిగ్రాం పంట పండినట్లే
15-01-2021

ఎయిర్ పోడ్స్ ఛార్జింగ్ కోసం సరికొత్త మొబైల్ కేస్ ను తీసుకుని రానున్న యాపిల్
14-01-2021

వాట్సాప్కు ప్రత్యామ్నాయంగా 21 బెస్ట్ యాప్లు
13-01-2021

యూట్యూబ్ నుంచి కూడా ట్రంప్ ఔట్
13-01-2021

ప్రాణం పోవడానికి కారణం అయిన గూగుల్ మ్యాప్స్..?
13-01-2021
ఇంకా