అక్కడ సెంచరీ కొట్టేసి.. చరిత్ర సృష్టించిన కోహ్లీ
02-03-202102-03-2021 13:05:19 IST
2021-03-02T07:35:19.457Z02-03-2021 2021-03-02T07:35:10.657Z - - 11-04-2021

విరాట్ కోహ్లీ గ్రౌండ్ లో సెంచరీ కొట్టి చాలా రోజులే అయింది.. కానీ ఇంస్టాగ్రామ్ లో మాత్రం సెంచరీ కొట్టేశాడు. సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీకి ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్.. ఇలా సామాజిక మాధ్యమాల్లో కోహ్లీని ఫాలో అయ్యే వాళ్లు చాలా మందే ఉన్నారు. ఇక కోహ్లీ ఇంస్టాగ్రామ్ లో 100 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించాడు.
సోషల్ మీడియాలోనూ తనకి తిరుగులేదని నిరూపించాడు. ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్ల సంఖ్య 100 మిలియన్కి చేరింది. భారత్ తరఫున ఇన్స్టాగ్రామ్లో ఈ ఘనత సాధించిన తొలి సెలెబ్రిటీ విరాట్ కోహ్లీనే కావడం విశేషం. సోమవారం నాటికి ఇన్స్టాలో విరాట్ కోహ్లీ ఫాలోవర్ల సంఖ్య సరిగ్గా వంద మిలియన్లు చేరుకుంది. భారత సెలెబ్రిటీలలో ప్రియాంక చోప్రా ఫాలోయర్ల సంఖ్య 60 మిలియన్కాగా.. దీపికా పదుకొణెని 53.3 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇన్స్టాగ్రామ్లో 51.2 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు.వీరందరికంటే ముందు వరుసలో కోహ్లీ ఉన్నాడు.
100 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న మొదటి క్రికెటర్ గా కోహ్లీ చరిత్ర లిఖించగా.. ఫుట్ బాల్ స్టార్స్ క్రిస్టియానో రొనాల్డో (266 మిలియన్), లియోనెల్ మెస్సీ (184 మిలియన్), నేమార్ (147 మిలియన్) తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న క్రీడా సెలెబ్రిటీ విరాట్ కోహ్లీనే కావడం విశేషం. 100 మిలియన్ ఫాలోవర్లను కలిగి ఉన్న తొలి ఆసియా వ్యక్తిగా విరాట్ కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు. కోహ్లీ సాధించిన ఈ రికార్డు పట్ల అభిమానులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఐసీసీ కూడా కోహ్లీకి కంగ్రాట్స్ చెప్పింది.
మరో వైపు కోహ్లీ మైదానంలో ఎన్నో రికార్డులను బద్దలుకొడుతున్న సంగతి తెలిసిందే. కేవలం రెండు రోజుల్లో అహ్మదాబాద్లో జరిగిన టెస్టులో విజయం సాధించడంతో విరాట్ మాజీ వెటరన్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును బ్రేక్ చేశాడు . ఈ రికార్డు కెప్టెన్గా సొంతగడ్డపై అత్యధిక టెస్ట్ విజయం కావడం విశేషం. ధోనీ స్వదేశంలో 30 టెస్ట్ లకు సారథ్యం వహించి 21 మ్యాచ్ లు గెలిపించగా.. కోహ్లీ 29 మ్యాచ్ ల్లో 22 విజయాలను అందుకున్నాడు. అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన కెప్టెన్ల జాబితాలో మొదటి స్థానంలోకి వెళ్లడానికి కోహ్లి.. కేవలం ఒక్క సెంచరీ దూరంలో ఉన్నాడు. కానీ కోహ్లీ మైదానంలో సెంచరీ కొట్టి చాలా రోజులే అవుతోంది.

దటీజ్ డివీలియర్స్.. లారా.. హేడెన్ల ప్రశంసల జల్లు
16 hours ago

కోహ్లీ జాగ్రత్త..!
17 hours ago

మొదటి మ్యాచ్ ఆర్సీబీదే..!
a day ago

IPL 2021: ముంబై ఇండియన్స్.. అతి విశ్వాసం ప్రమాదకరం.. ప్రజ్ఞాన్ ఓజా
09-04-2021

IPL 2021 : ఐపీఎల్ టైం ఆగాయా
09-04-2021

వాంఖడేలో మ్యాచ్ లు అవసరం లేదంటున్న స్థానికులు..!
08-04-2021

ఐపీఎల్ కోసం ఎంతో వెయిటింగ్.. మరో స్టార్ కు కరోనా పాజిటివ్..!
08-04-2021

ముంబై ఇండియన్స్ శిబిరంలో కరోనా కలకలం
07-04-2021

ఫృధ్వీలో ఉండే అతి చెడ్డ గుణం అదే.. రికీ పాంటింగ్ వ్యాఖ్య
06-04-2021

ఐపీఎల్లో ఆడితే టెస్టు క్రికెట్ని దెబ్బతీస్తుందనుకున్నా... పుజారా
05-04-2021
ఇంకా