ఉద్వేగానికి లోనైన రవి శాస్త్రి.. అద్భుత విజయంపై రహానే ఏమన్నాడంటే
19-01-202119-01-2021 22:53:12 IST
Updated On 20-01-2021 10:32:29 ISTUpdated On 20-01-20212021-01-19T17:23:12.639Z19-01-2021 2021-01-19T17:23:06.323Z - 2021-01-20T05:02:29.433Z - 20-01-2021

ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ అంటే చాలు ఎంత ఒత్తిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పింక్బాల్ టెస్టులో ఘోర ఓటమి తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లి పితృత్వ సెలవుపై భారత్కు తిరిగి వచ్చేశాడు. అతడి గైర్హాజరీలో రహానే కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. పలువురు ఆటగాళ్లు గాయాల బారిన పడినప్పటికీ ఒత్తిడిని జయిస్తూ, యువ ఆటగాళ్లపై నమ్మకం ఉంచి జట్టును ముందుండి నడిపించాడు. ఆతిథ్య జట్టు నిర్థేశించిన 328 పరుగుల విజయ లక్ష్యాన్ని అనూహ్య రీతిలో భారత్ ఛేదించింది. రిషభ్ పంత్ దూకుడైన ఆటకు.. పుజారా డిఫెన్స్ తోడవడంతో ఆసీస్ గడ్డపై విజయాన్ని సాధించింది. నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను భారత్ 2-1తో కైవసం చేసుకుని గబ్బా మైదానంలో కంగరూలను ఓడించింది. ఈ విజయంపై కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ రహానేలు స్పందించారు. టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఉద్వేగానికి లోనయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టులో భారత జట్టు అద్భుత ప్రదర్శనపై ప్రశంసలు కురిపించాడు. ఓవైపు కోవిడ్-19 భయాలు, మరోవైపు వరుసగా ఆటగాళ్లు గాయాల బారిన పడటం.. 36 పరుగులకే ఆలౌట్ కావడం వంటి అనూహ్య పరిణామాలని చెప్పుకొచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో జట్టు పట్టుదలతో ముందుకు సాగిందని.. అద్భుత ప్రదర్శన కనబరిచిందని చెప్పుకొచ్చాడు. నిజానికి నేను సాధారణంగా ఎమోషనల్ కాను. కానీ ఇప్పుడు నిజంగానే నా కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయని అన్నాడు రవిశాస్త్రి. జట్టు చరిత్రలోనే ఈ సిరీస్ ఒక మరుపురాని జ్ఞాపకంగా మిగిలిపోతుందని అన్నాడు. కెప్టెన్ అజింక్య రహానే మాట్లాడుతూ.. అసలేం జరిగిందో నాకు అర్థం కావడం లేదు. ఈ సిరీస్ విజయాన్ని అభివర్ణించేందుకు మాటలు రావడం లేదని అన్నాడు. చాలా ఎమోషనల్ అయిపోయానని.. అడిలైడ్ టెస్టు పరాజయం తర్వాత ప్రతీ ఒక్క ఆటగాడు పట్టుదలతో ఆడామని తెలిపాడు. ఈ గెలుపులో ప్రతీ ఆటగాడికి భాగస్వామ్యం ఉందని.. ముఖ్యంగా రిషభ్, నట్టు(నటరాజన్), శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ బంతితో, బ్యాట్తో మ్యాజిక్ చేశారని అన్నాడు రహానే.

ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో భారత్ విన్
16 hours ago

మరో సారి ధోని వారసుడు అంటూ.. పంత్ పై ప్రముఖుల ట్వీట్ల వర్షం
18 hours ago

5 బంతుల్లో ఆఖరి మూడు వికెట్లు కోల్పోయిన భారత్.. సుందర్ సెంచరీ మిస్
21 hours ago

సెహ్వాగ్ వీర విహారం.. ఇండియా లెజెండ్స్ ఘన విజయం..!
21 hours ago

పంత్ సూపర్ సెంచరీ.. లీడ్ లో భారత్..!
05-03-2021

205 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లాండ్
04-03-2021

హ్యాట్రిక్ తీసిన బౌలర్ కు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన పోలార్డ్
04-03-2021

మరికొద్ది గంటల్లో ఇంగ్లాండ్-భారత్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్.. పిచ్ గురించే చర్చ..!
03-03-2021

నాలుగో టెస్టుకైనా కాస్త న్యాయమైన పిచ్ని ఆశించవచ్చా.. అక్తర్ వ్యాఖ్య
03-03-2021

అక్కడ సెంచరీ కొట్టేసి.. చరిత్ర సృష్టించిన కోహ్లీ
02-03-2021
ఇంకా