షర్మిల నోట జై తెలంగాణ నినాదం.. టార్గెట్ తెరాస!
20-02-202120-02-2021 14:47:47 IST
Updated On 20-02-2021 13:38:20 ISTUpdated On 20-02-20212021-02-20T09:17:47.812Z20-02-2021 2021-02-20T07:42:19.515Z - 2021-02-20T08:08:20.373Z - 20-02-2021

దివంగత సీఎం వై.ఎస్. రాజశేఖరరెడ్డి కుమార్తె, ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి చెల్లెలు వై.ఎస్. షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తెలంగాణలో పార్టీ పెట్టేందుకు సిద్ధమైన షర్మిల.. రాష్ట్రంలోని వైఎస్ఆర్ అభిమానులతో జిల్లాల వారిగా భేటీ అవుతూ వస్తుంది. గత వారం రోజుల క్రితం ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల వైఎస్ఆర్ అభిమానులతో భేటీ అయిన షర్మిల.. తాజాగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన వైఎస్ఆర్ అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ప్రారంభంలో షర్మిల జై తెలంగాణ అంటూ నినాదాలు చేయటం ఆసక్తికరంగా మారింది. మరో అడుగు ముందుకేసి తెలంగాణ ప్రభుత్వం తీరుపైనా ఆమె మండిపడినట్లు సమాచారం. తెలంగాణలో వైఎస్ఆర్ పాలన కనిపించడం లేదని, ప్రజలు, రైతులు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికే షర్మిల కామెంట్లు చేసింది. అందుకే తాను పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నానని, వైఎస్ఆర్ పాలన తేవడమే తన లక్ష్యం అంటూ పేర్కొన్నారు. అయితే షర్మిల పార్టీతో తమకు సంబంధం లేదని ఇప్పటికే వైసీపీ స్పష్టం చేసింది. దీంతో తెలంగాణలోని వైఎస్ ఆర్ అభిమానుల్లో గందరగోళం నెలకొంది. అయితే రాజకీ య విశ్లేషకులు మాత్రం షర్మిల పార్టీకి జగన్ మద్దతు లోపాయికారికంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇదిలాఉంటే తెలంగాణలో పెట్టబోయే పార్టీకి మద్దతు లభించాలంటే అధికార తెరాసను టార్గెట్ చేస్తేనే సాధ్యమవుతుందని వైఎస్ షర్మిల భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు బలహీనమయ్యాక అధికమంది వైఎస్ ఆర్ అభిమానులు, వైఎస్ అండదండలతో ఎదిగిన నేతలు తెరాసలో చేరారు. పలువురు అధికార పార్టీలో కీలక పదవుల్లో ఉండగా.. మరికొందరు ఆదరణలేక అసంతృప్తితోనే తెరాసలో కొనసాగుతున్నారు. ఈ సమయంలో తెరాసను టార్గెట్ చేయడం ద్వారా ఆ పార్టీలోని అసంతృప్తిగా ఉన్న వైఎస్ ఆర్ అభిమానించే నేతలను తమవైపుకు తిప్పుకోవచ్చనేది షర్మిల వ్యూహాంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే షర్మిల ఆదినుంచి తెలంగాణలో వైఎస్ ఆర్ పాలన కనిపించడం లేదని, రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పదేపదే పేర్కొంటూ వస్తున్నారు. తాజాగా శనివారం లోటస్పాండ్లోని తన నివాసంలో ఉమ్మడి నల్గొండ, హైదరాబాద్ జిల్లాల నేతలతో వై.ఎస్. షర్మిల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో జై తెలంగాణ అంటూ షర్మిల తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దీనికితోడు తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు చేయాల్సినవి చేస్తుందా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చిందా? అని షర్మిల నిలదీశారు. తెలంగాణలో ఉన్న సమస్యలపై మాట్లాడదామని అభిమానులతో షర్మిల తెలిపారు. 11 ప్రశ్నలతో ఫీడ్బ్యాక్ ఫామ్ నింపాలని అభిమానులను షర్మిల కోరినట్లు తెలుస్తుంది.

నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్
6 hours ago

కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!
8 hours ago

కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు
9 hours ago

వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం
9 hours ago

ఇదేం అన్యాయం.. హర్ట్ అయిన విడదల రజనీ ఫ్యాన్స్
9 hours ago

రాంజీ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నాయకుల దిగ్భ్రాంతి
10 hours ago

హైదరాబాద్ పేరును మార్చేస్తామని అంటున్న బీజేపీ నేత
10 hours ago

పవన్ కి విశాఖలో అడుగు పెట్టే ధైర్యం లేదా
21 minutes ago

ఎంపీ గోరంట్ల మాధవ్ కు మహిళ నుండి ఊహించని ప్రశ్న
8 hours ago

డాక్టర్ చిరంజీవి కొల్లూరి కన్నుమూత..!
11 hours ago
ఇంకా