షర్మిల ఖమ్మం టూర్ వాయిదా..! అడ్డుపడిందెవరు?
13-02-202113-02-2021 19:04:26 IST
Updated On 13-02-2021 17:33:08 ISTUpdated On 13-02-20212021-02-13T13:34:26.779Z13-02-2021 2021-02-13T11:58:15.599Z - 2021-02-13T12:03:08.855Z - 13-02-2021

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ప్రస్తుత ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి చెల్లెలు వై.ఎస్. షర్మిల తెలంగాణ రాజకీయాలపై దృష్టిసారించారు. రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టేందుకు ఆమె సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల లోటస్పాండ్లోని తన నివాసంలో ఆమె తెలంగాణలోని పలు ప్రాంతాలకు చెందిన వైఎస్ఆర్ అభిమానులతో భేటీ అయ్యారు. తొలిరోజు నల్గొండ జిల్లాలోని వైఎస్ ఆర్ అభిమానులతో భేటీ అయిన ఆమె.. మరుసటి రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైఎస్ఆర్ అభిమానులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణలో కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుంది..? విధివిధానాలు ఎలా ఉండాలఅనే అంశాలపై చర్చించారు.
ఈ సమావేశంలో భాగంగా ఖమ్మంజిల్లాలో రాజకీయ పరిస్థితులపై ఆమె ఆరాతీశారు. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, తదితర అంశాలపై షర్మిల తెలుసుకున్నారు. ముఖ్యంగా జిల్లాలో గిరిజనులు పోడు భూముల సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్ ఆర్ అభిమానులు షర్మిల దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో ఈనెల 21న ఖమ్మంలో పర్యటించేందుకు ఆమె నిర్ణయించారు. ఈ పర్యటనలో గిరిజన ప్రజలతో సమావేశం అయ్యి వారి ఇబ్బందులు తెలుసుకోవటంతో పాటు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైఎస్ ఆర్ అభిమానులతో ఆమె సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. లోటస్పాండ్ నుంచి ఖమ్మం వరకు భారీ కార్ల ర్యాలీ నిర్వహించేందుకు నిర్ణయించారు.
తాజాగా షర్మిల ఖమ్మం పర్యటన వాయిదాపడింది. దీని వెనుక పలు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా షర్మిల పర్యటనకు ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ అడ్డంకిగా మారిందట. అయినా ఖమ్మంలో ఈనెల 21న పర్యటించేందుకు తమకు అనుమతి ఇవ్వాలని షర్మిల, కొండా రాఘవరెడ్డిలు డీజీపీని కోరారు. వినతిపత్రంసైతం అందించినట్లు తెలుస్తోంది. కానీ డీజీపీ అందుకు ఒప్పుకోలేదని సమాచారం.
ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఉన్న క్రమంలో ఎలాంటి సమావేశాలు నిర్వహించకూడదని, తాము ఎలాంటి అనుమతి ఇవ్వలేమని డీజీపీ తేల్చిచెప్పారట. దీంతో చేసేదేమీ లేక షర్మిల 21న ఖమ్మం పర్యటన వాయిదా వేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటన ఉంటుందని షర్మిల వైఎస్ఆర్ అభిమానులకు తెలిపినట్లు తెలుస్తోంది.
దూకుడు పెంచిన షర్మిల.. 21న భారీ కాన్వాయ్తో ఖమ్మంకు!

రాజకీయాలనుంచి తప్పుకుంటున్నా.. చిన్నమ్మ
an hour ago

నేను వైసీపీలో చేరను-గంటా క్లారిటీ
an hour ago

విశాఖ ఉక్కు అయిపోయింది.. విశాఖ పోర్టు వంతు వచ్చింది
3 hours ago

ఆహా.. ఇది అద్భుతమైన ఓపెనింగ్ ఎంపీ సార్
2 hours ago

విశాఖ వైసీపీలో విభేదాలు మరోసారి కనపడ్డాయిగా..!
15 hours ago

క్రమ శిక్షణ చర్యలు తప్పవంటూ అచ్చెన్నాయుడు వార్నింగ్
16 hours ago

గంటా ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయసాయి
21 hours ago

అధిష్టానంతో అటో ఇటో తేల్చుకుంటాం.. కాంగ్రెస్ అసమ్మతి నేతలు సిద్ధం
a day ago

జగన్ కి పాలన రాదు అనే మాటకి నిదర్శనాలు ఇవేనా
19 hours ago

టీడీపీకి కర్నూలులో మరో పెద్ద నాయకుడు దూరం..!
a day ago
ఇంకా