ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం.. ఇంకాస్త టెన్షన్..!
01-12-202001-12-2020 13:17:46 IST
Updated On 01-12-2020 13:42:01 ISTUpdated On 01-12-20202020-12-01T07:47:46.550Z01-12-2020 2020-12-01T07:47:29.338Z - 2020-12-01T08:12:01.869Z - 01-12-2020

ఎన్నికలు పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ చేసే సందడి అంతా ఇంతా కాదు. ప్రజలు కూడా ఎగ్జిట్ పోల్స్ విషయాన్ని కాస్త సీరియస్ గానే చూస్తూ ఉంటారు. ఇంకొన్ని పార్టీలు అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను నిజమైన ఫలితాలలా భావించి స్వీట్లు కూడా పంచుకుంటూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఈ ఎగ్జిట్ పోల్స్ నిజమైతే.. మరికొన్ని సార్లు తేడా కొడుతూ ఉంటాయి. ఇక జీహెచ్ఎంసీ ఫలితాల ఎగ్జిట్ పోల్స్ విషయంలో కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఈసీ నిషేధం విధించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. అయితే.. నేడు ఎగ్జిట్ పోల్స్ను వెల్లడించకూదని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఓల్డ్ మలక్ పేట డివిజన్ లోని 69 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిలిచిపోయింది. కంకి కొడవలి గుర్తుకు బదులుగా సుత్తి కొడవలి గుర్తు బ్యాలెట్ పేపర్ పై ముద్రితమైంది. సీపీఐ తరఫున ఈ డివిజన్ నుంచి పోటీ పడుతున్న ఫాతిమా, తన పేరు పక్కన సీపీఎం గుర్తును చూసి విషయాన్ని రిటర్నింగ్ అధికారులకు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈసీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఈరోజు విడుదల చేయకూడదని చెప్పుకొచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓల్డ్ మలక్ పేట డివిజన్ లోని 69 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిలిచిపోయింది. కంకి కొడవలి గుర్తుకు బదులుగా సుత్తి కొడవలి గుర్తు బ్యాలెట్ పేపర్ పై ముద్రించారు. సీపీఐ తరఫున ఈ డివిజన్ నుంచి పోటీ పడుతున్న ఫాతిమా, తన పేరు పక్కన సీపీఎం గుర్తు తప్పుగా ఉందని భావించి.. విషయాన్ని రిటర్నింగ్ అధికారులకు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికలు జరపాల్సిందేనని ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీల నేతలు డిమాండ్ చేశారు. కానీ ఎన్నికల సంఘం మాత్రం జరిగిన తప్పుపై స్పందిస్తూ, డివిజన్ మొత్తం పోలింగ్ ను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. రేపే ఇక్కడ రీపోలింగ్ ను జరిపిస్తామని స్పష్టం చేశారు. ఈసీ నుంచి ఆదేశాలు రాగానే, పోలింగ్ కేంద్రాల్లో ఉన్న సిబ్బంది తమ సరంజామాను తీసుకుని వెళ్లిపోయారు.

పంచాయితీ కోసం టీడీపీ పంచసూత్రాలు
11 minutes ago

రామ తీర్థానికి కొత్త కళ
27 minutes ago

బరిలోకి దిగిన జనసేన.. పవన్ వర్సెస్ జగన్ ఫైట్
37 minutes ago

ఏకగ్రీవాల్లోనూ.. ఎవరి దారి వారిదేనా..
2 hours ago

కర్నాటకలోని మరాఠీ ప్రాంతాలు మావే.. ఉద్ధవ్ వ్యాఖ్యతో వివాదం
4 hours ago

జాతీయ జెండాను అవమానిస్తే సహించం.. కాంగ్రెస్పై బీజేపీ ఆరోపణ
7 hours ago

ఏకగ్రీవాలపై పేపర్ ప్రకటన.. ఎవరిని అడిగి ఇచ్చారని సంజాయషి ఇవ్వాల్సిందే..
7 hours ago

రైతుల ఉద్యమంలో విధ్వంసకారులు.. 200 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
8 hours ago

వైసీపీలో గ్రూపుల కొట్లాట.. ఏకగ్రీవం కోసం ఫైటింగ్ లు
6 hours ago

ఏకగ్రీవం తొలి బోణీ కొట్టిన వైసీపీ..
8 hours ago
ఇంకా