కేటీఆర్ కు రెండుచోట్ల ఓట్లా.. చట్టం.. చుట్టమైందా?!
01-12-202001-12-2020 16:16:12 IST
Updated On 01-12-2020 16:23:05 ISTUpdated On 01-12-20202020-12-01T10:46:12.705Z01-12-2020 2020-12-01T10:46:06.472Z - 2020-12-01T10:53:05.651Z - 01-12-2020

గ్రేటర్ హైదరాబాద్ లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే కేటీఆర్ ఓటు హక్కు వినియోగించుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఓటు వేసినందుకు విమర్శిస్తారా అంటే.. గత ఎన్నికల్లో ఒక చోట.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరో చోట ఓటు హక్కును వినియోగించుకోవడమే ఈ విమర్శలకు కారణమైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా మంత్రి కేటీఆర్ నందీనగర్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంత్రి కేటీఆర్ క్యూలైన్ లో నిల్చొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. నందినగర్ లోని 8 వ నెంబర్ పోలింగ్ బూత్ లో మంత్రి ఓటు వేశారు. ఓటు వేసే వారికి మాత్రమే ప్రశ్నించే హక్కు ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. దయచేసి అందరూ ఓటేయాలని కోరారు. ఆలోచించి ఓటు వేయాలని, ఓటువేసి హైదరాబాద్ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. అయితే ఆయనకు సొంత నియోజకవర్గం సిరిసిల్లలో కూడా ఓటు హక్కు ఉందని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు. అధికారం మనదైతే…చట్టం కూడా చుట్టమేనా ? మంత్రి గారికీ,ఆయన సతీమణికి అటు సిరిసిల్లలో.. ఇటు గ్రేటర్ లో రెండు చోట్ల ఓటు హక్కు అంటూ విమర్శలు గుప్పించారు. దీనిపై టీఆర్ఎస్ వర్గాలు ఏమని సమాధానం చెప్తాయో చూడాలి.

వ్యాక్సిన్ తీసుకుంటానని చెప్పిన ఈటల.. కానీ కుదరలేదు ఎందుకంటే..!
an hour ago

కొత్త విగ్రహాల తయారీకి ఆయన డబ్బు ఇస్తే తీసుకోని ప్రభుత్వం
2 hours ago

కేసుతో సంబంధమే లేదంటున్న అఖిలప్రియ..?
2 hours ago

మమతకు మహిళా ఎంపీ షాక్.. భవిష్యత్తు నిర్ణయంపై సంచలన పోస్టు
7 hours ago

వరస్ట్ సీఎంలలో కేసీఆర్ ది నాలుగో ప్లేస్.. సి ఓటర్ సర్వే
8 hours ago

అబద్దాలు ఎప్పట్నుంచి మొదలెట్టావు రాహుల్... తోమర్ ఎద్దేవా
10 hours ago

మైహోంపై దాడుల వెనుక ఒత్తిడి తెచ్చిన నేత ఎవరు?
10 hours ago

దాడులలో టీడీపీ-బీజేపీ నేతలు.. డీజీపీ పక్కా పొలిటికల్ స్టేట్మెంట్
11 hours ago

ముద్రగడ ఇంటికి సోము.. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు?
12 hours ago

క్రిస్టియానిటీ అంశం తెరమీదకి తెచ్చి జగన్ కు మంచే చేశారా?
12 hours ago
ఇంకా