ఎన్టీఆర్ జోలికి వచ్చారు.. కన్నెర్రజేసిన ఎంపీ రామ్మోహన నాయుడు
14-01-202114-01-2021 14:58:49 IST
2021-01-14T09:28:49.933Z14-01-2021 2021-01-14T04:05:33.551Z - - 24-01-2021

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉన్న విగ్రహం.. దుండగుల దాడిలో ముక్కు విరిగిపోయింది. గడ్డం, భుజం, నుదుటిపైనా దాడి చేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఘటనపై స్థానిక టీడీపీ నాయకులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ గోవింద ఘటనా స్థలానికి చేరుకుని విగ్రహాన్ని పరిశీలించారు. దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.
సంతబొమ్మాళిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు డిమాండ్ చేశారు. ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించిన రామ్మోహన్నాయుడు అనంతరం మాట్లాడుతూ.. విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులపై సత్వరమే చర్యలు తీసుకోవాలని, లేకుంటే లక్షలాదిమంది కార్యకర్తలతో ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. రాష్ట్రాన్ని ఎంతోమంది పాలించారని, కానీ ఇలాంటి దుస్థితిని ఎన్నడూ చూడలేదని రామ్మోహన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేదిక కూల్చివేతతో పాలన ప్రారంభమైందన్నారు. ఇప్పుడు దేవుళ్లు, రాజకీయ నాయకుల విగ్రహాలపై పడి రాష్ట్రాన్ని అల్లకల్లోలంగా మారుస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్లో తీవ్రంగా ఖండించారు. ‘దేవతా విగ్రహాలను ధ్వంసం చేస్తున్న వైసీపీ దుష్టులే ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. నిలబెట్టడం చేతకాని జగన్రెడ్డి గొప్ప వ్యక్తుల విగ్రహాలు కూల్చి వికృతానందం పొందుతున్నారు. సంతబొమ్మాళిలో ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి’ అని డిమాండ్ చేశారు.
ఏపీలో చోటు చేసుకున్న ఆలయాల్లో విగ్రహాల విధ్వసం వెనుక రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఉన్నాయని టీడీపీ నేత డాక్టర్ ఎన్బీ సుధాకర్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ప్రశాంత్ వ్యూహంతో జగన్ ఇచ్చిన ఆదేశాలకు ఆయన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వం వహించడం వల్లే ఈ ఘటనలు చోటు చేసుకున్నాయని సుధాకర్రెడ్డి ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మిళిలో ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు విగ్రహాల ముఖాలు చెక్కేయడం వెనుక అధికార పార్టీ హస్తం ఉందని సుధాకర్రెడ్డి ఆరోపించారు. త్వరలో వైఎస్సార్ విగ్రహాలు ధ్వంసం చేసి ఆ నేరాన్ని తెలుగుదేశం పార్టీపై నెట్టేందుకు కట్ర పన్నుతున్నారని చెప్పారు.

నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ కాదు.. రాజకీయ నాయకుడే..
2 hours ago

నిమ్మగడ్డ మీటింగ్.. అలా షాక్ ఇచ్చిన అధికారులు..!
7 hours ago

తెలంగాణ పాలిటిక్స్ లోకి దర్శకుడు రాఘవేంద్ర రావు
8 hours ago

అంబటి రాంబాబు కొత్త రాగం.. సెంటిమెంట్ తో ఆయింట్ మెంట్
6 hours ago

ఎన్నికలకు వెళ్లకుంటే.. ఏపీ సర్కార్ కి సీరియస్ ప్రాబ్లమే.. ఎలాగో తెలుసా..?
9 hours ago

అన్నా రాంబాబుపై జనసేనాని ఆగ్రహం.. అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వమంటూ హెచ్చరిక
4 hours ago

వైసీపీ పతనానికి పంచాయతీ ఎన్నికలే నాంది అంటున్న చంద్రబాబు
3 hours ago

లాలూ ప్రసాద్కు సిటీ స్కాన్.. ఆసుపత్రికి రబ్రీ, తేజస్వి రాక
10 hours ago

ఇక నేను ఫైట్ చేస్తా- అన్నా హజారే
10 hours ago

ఆ ఒక్క సీటు చాలా ఇంపార్టెంట్.. రంగంలోకి రెడీ
8 hours ago
ఇంకా