ఆ నాయకుడు నన్ను మోసం చేసాడు.. చంద్రబాబు
06-03-202106-03-2021 15:37:20 IST
Updated On 06-03-2021 15:43:05 ISTUpdated On 06-03-20212021-03-06T10:07:20.007Z06-03-2021 2021-03-06T10:05:14.067Z - 2021-03-06T10:13:05.047Z - 06-03-2021

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే..! విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఇక్కడ ఒక నాయకుడు కష్టకాలంలో మోసం చేశాడని ఆరోపించారు. తాము ఆ నాయకుడికి 2014, 2019లో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చామని, కానీ ఆ నాయకుడు పార్టీ కష్టంలో ఉన్నప్పుడు ఏంచేశాడో అందరికీ తెలుసని అన్నారు. అలాంటి అవకాశవాదులను ఉపేక్షించవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. తప్పకుండా వచ్చి విశాఖ పాతపట్నం అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. విశాఖ మంచివాళ్లు ఉండే నగరం అని, కానీ ఈ నగరాన్ని నేరస్తుల నగరంగా మార్చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ సౌత్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున వాసుపల్లి గణేశ్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాతి కాలంలో వాసుపల్లి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పాత గాజువాకలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ వైసీపీ కార్పొరేటర్లకు ఓట్లు వేస్తే రౌడీయిజానికి లైసెన్స్ ఇచ్చినట్టేనని అన్నారు. రౌడీలు, గూండాలు, నేరస్తులు పెట్రేగిపోతారని, దాడులకు తెగబడతారని.. అలాంటప్పుడు మిమ్మల్ని కాపాడేవారు ఎవరూ ఉండరని చంద్రబాబు అన్నారు. వైసీపీ అభ్యర్ధులందరూ నేర చరిత్ర కలిగి ఉన్నారని, నేర చరిత్ర లేకపోతే జగన్ వారికి టిక్కెట్లు ఇవ్వరని చంద్రబాబు అన్నారు. వైసీపీకి ఓట్లు వేస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణకు అంగీకరించినట్లు అవుతుందన్నారు. విశాఖపట్టణానికి పట్టిన ఏ2 శనిని వదిలించుకోవాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. ఇక్కడంతా వెనుకబడిన వర్గానికి చెందినవారు ఉన్నారని, ఏ2కు ఇక్కడ ఏంపనని ప్రశ్నించారు. ఇంకా బూతుల మంత్రి ఒకరు, హవాలా మంత్రి ఒకరు, కొబ్బరికాయల మంత్రి ఒకరని విమర్శించారు. మోసాలు చేయడంలో సీఎం జగన్ దిట్టని.. ఈ అరాచక పాలనను అంతమొందించి.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకొనే పోరాటం విశాఖ నుంచే ప్రారంభం కావాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. దోపిడీ రాజ్యం, అరాచకపాలనపై మేధావులు స్పందించి ముందుకు రావాలన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చంద్రబాబు నాయుడు కోరారు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
16 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
12 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
15 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
19 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
a day ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
a day ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా