కేశినేని నానిపై బొండా ఉమా ఆగ్రహం..!
06-03-202106-03-2021 13:12:48 IST
Updated On 06-03-2021 13:12:26 ISTUpdated On 06-03-20212021-03-06T07:42:48.711Z06-03-2021 2021-03-06T07:07:43.708Z - 2021-03-06T07:42:26.632Z - 06-03-2021

విజయవాడ తెలుగుదేశం పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఎంపీ కేశినేని నాని ప్రవర్తన సరిగాలేదని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేస్తోంది తామని, పదవుల కోసం పనిచేస్తోంది కేశినేని నాని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేశినేని కావాలో.. అందరూ కావాలో చంద్రబాబు తేల్చుకోవాలంటూ బొండా ఉమా తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
బోండా ఉమా మీడియాతో మాట్లాడుతూ కేశినేని మాట తీరు సరిగాలేదని.. ప్రజారాజ్యంలో ఇదే తరహాలో వ్యవహరించి బయటకు గెంటించుకున్నారన్నారు. విజయవాడ టీడీపీకి తానే అధిష్ఠానమని కేశినేని మాట్లాడడం సరికాదని.. ఇది ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. తన కూతురుని మేయర్ చేయడం కోసం ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలకు తెరలేపారన్నారు. కులాలమధ్య, పార్టీ నేతల మధ్య చిచ్చు పెడుతున్నారని.. వర్గాలను, విభేదాలను కేశినేని ప్రోత్సహిస్తున్నాడని ఆరోపణలు చేశారు బొండా ఉమా.
బెజవాడ పార్లమెంట్లో కేశినేనికి సత్తా ఉంటే... రాజీనామా చేసి... ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవాలన్నారు. టీడీపీ సింబల్, చంద్రబాబును చూసి నీకు ఓట్లు వేశారని.. నాని ఇండిపెండెంట్గా గెలిచి చూపిస్తే... కట్టుబట్టలతో విజయవాడ వదిలివెళ్లిపోతానని సవాల్ చేశారు. నాని ముఖ్యం అనుకుంటే తాము రేపు జరుగబోయే చంద్రబాబు టూర్కు దూరంగా ఉంటామని హెచ్చరించారు.
ఇటీవలే విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) తన కుమార్తె శ్వేతే పార్టీ తరపున మేయర్ అభ్యర్థిని అని చేసిన ప్రకటనను పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు, నగర పార్టీ అధ్యక్షు డు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మైనార్టీ సీనియర్ నాయకుడు నాగుల్ మీరా తదితరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం మాత్రం కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేతకే టికెట్ ఇవ్వడం తెలుగుదేశం పార్టీలో వివాదానికి దారితీసింది. విజయవాడలోని ముఖ్య నాయకులు రెండు వర్గాలుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కేశినేని శ్రీనివాస్కు గద్దె రామ్మోహన్ వెంట ఉండగా. బొండా, బుద్దా, నాగుల్మీరా, పట్టాభి తదితరులు పూర్తిగా దూరమయ్యారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తాజా పర్యటనలో వివాదాలకు ముగింపు పలుకుతారో లేదో చూడాలి.
విజయవాడ మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేత

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
17 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
13 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
15 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
20 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
a day ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
a day ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా