దేశంలో కరోనా టీకా ప్రారంభం.. ప్రధాని మోదీ ప్రకటన
05-12-202005-12-2020 15:48:09 IST
2020-12-05T10:18:09.240Z05-12-2020 2020-12-05T10:17:58.820Z - - 28-01-2021

మరికొన్ని వారాల్లోనే కరోనా వ్యాక్సిన్ దేశంలో అందుబాటులోకి రావచ్చని ప్రధాని నరేంద్రమోదీ శుభవార్త తెలిపారు. కరోనా టీకా కోసం మరెంతో కాలం ఎదురు చూడాల్సిన అవసరం లేదని, శాస్త్రవేత్తల నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రధాని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్లో వైద్య సిబ్బంది, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, తీవ్రమైన వ్యాధులతో బాధపడ్తున్న వృద్ధులు.. మొదలైన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, వైసీపీ, జేడీయూ, బీజేడీ, శివసేన, టీఆర్ఎస్, బీఎస్పీ, ఎస్పీ, అన్నాడీఎంకే, బీజేపీ.. మొదలైన పార్టీల పార్లమెంటరీ నేతలతో శుక్రవారం వర్చువల్గా జరిగిన అఖిలపక్ష భేటీని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. కరోనా మహమ్మారితో దేశంలో నెలకొన్న పరిస్థితులు, టీకా సంసిద్ధత, పంపిణీ, టీకా ధర తదితర అంశాలను ఈ భేటీలో చర్చించారు. వ్యాక్సినేషన్లో రాష్ట్రాలను సంపూర్ణంగా భాగస్వాములను చేస్తామన్నారు. వ్యాక్సినేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు వీలుగా ‘కోవిన్’ అనే సాఫ్ట్వేర్ను భారత్ సిద్ధం చేసిందని వెల్లడించారు. ప్రధానంగా 8 టీకాలు వివిధ ప్రయోగ దశల్లో ఉన్నాయని, భారత్లో వాటి ఉత్పత్తికి హామీ లభించిందని ప్రధాని తెలిపారు. భారత్లోనూ మూడు టీకా ప్రయోగాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. టీకా ధరపై అనేక ప్రశ్నలు వస్తున్నాయని, అది సహజమేనని, అయితే, ప్రజారోగ్యానికే తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. ఇటీవల పుణే, హైదరాబాద్, అహ్మదాబాద్ల్లోని టీకా ప్రయోగశాలలను సందర్శించిన విషయాన్ని ప్రధాని ప్రస్తావిస్తూ.. తమ ప్రయోగాలు కచ్చితంగా విజయవంతమవుతాయని అక్కడి శాస్త్రవేత్తలు గట్టి నమ్మకంతో ఉన్నారని వివరించారు. చౌక ధరకు టీకా కోసం ప్రపంచం నిరీక్షణ.. ప్రపంచవ్యాప్తంగా పలు టీకాలు ప్రయోగదశల్లో ఉన్నప్పటికీ.. చవకగా, సమర్ధవంతంగా పనిచేసే టీకా కోసమే అంతా ఎదురు చూస్తున్నారని ప్రధాని చెప్పారు. ప్రపంచమంతా ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది. తక్కువ ధరలో మంచి టీకా అందించవచ్చని మన నిపుణులు చెబుతున్నారు. అభివృద్ధి చెందిన చాలా దేశాల కన్నా భారత్ కరోనా మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కొందని ప్రధాని పునరుద్ఘాటించారు. పలు దేశాల్లో మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతోందని, అందువల్ల భారత్లోనూ జాగ్రత్తలు తీసుకోవడం కొనసాగించాలని కోరారు. వ్యాక్సిన్ సిద్ధమవుతున్న దశలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, ముప్పును కొనితెచ్చుకోవద్దని హెచ్చరించారు. కరోనా వ్యాక్సినేషన్కు సంబంధించి అఖిలపక్ష భేటీలో ఒక సమగ్ర ప్రజెంటేషన్ను కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చింది. మొదట టీకాను దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లోని సుమారు కోటి మంది వైద్య సిబ్బందికి ఇస్తామని వెల్లడించింది. ఆ తరువాత, కరోనాపై ముందుండి పోరాడుతున్న పోలీసులు, సాయుధ దళాలు, మున్సిపల్ సిబ్బంది తదితర రెండు కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేస్తామని పేర్కొంది. దేశంలోని 27 కోట్ల మంది వృద్ధులకూ టీకా ఇస్తామని హామీ ఇచ్చింది. దేశంలో ఇప్పటికే ఉన్న 29 వేల శీతలీకరణ కేంద్రాల్లో ప్రాధాన్య గ్రూపులకు ఇవ్వవలసిన 6 కోట్ల టీకాలను సురక్షితంగా నిల్వ చేయవచ్చని ఆరోగ్య శాఖ తెలిపింది.

నమ్మించి వంచించారు.. ఎవ్వరినీ వదలం.. ఢిల్లీ పోలీసు చీఫ్
2 hours ago

పెట్రోల్ రేట్.. కనీవినీ ఎరుగని అద్భుతం
3 hours ago

నేపాల్లో వ్యాక్సినేషన్ ప్రారంభం.. మోదీకి ప్రధాని ఓలి కృతజ్ఞతలు
4 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 11,666 మందికి కరోనా
5 hours ago

ప్రపంచ అగ్రశ్రేణి ఐటీ కంపెనీల్లో 'TCS'కు మూడోస్థానం
5 hours ago

ఫిబ్రవరి 1న పార్లమెంటుకు రైతుల ర్యాలీ నిలిపివేత
7 hours ago

అమెరికా 71వ విదేశాంగ మంత్రిగా అంటోనీ బ్లింకెన్ నియామకం
8 hours ago

ఇంకేంటి.. సినిమా థియేటర్లు ఫుల్ కెపాసిటీతో..!
19 hours ago

డబుల్ డిజిట్ వృద్ధి భారత్కే సాధ్యం.. ఐఎమ్ఎఫ్ అంచనా
27-01-2021

భారత్లో టీకా అమ్మకాలకు ఫైజర్ తీవ్ర యత్నాలు
27-01-2021
ఇంకా