టీకా తయారీ ఈ స్థాయికి చేరినందుకు గర్విస్తున్నా... ప్రధాని మోదీ
29-11-202029-11-2020 10:35:34 IST
2020-11-29T05:05:34.275Z29-11-2020 2020-11-29T05:04:38.622Z - - 16-01-2021

దేశంలో టీకా తయారీ ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయికి చేరినందుకు గర్విస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. టీకా అభివృద్ధి కార్యక్రమంలో దేశం శాస్త్రీయ సిద్ధాంతాలపై ఆధారపడిందని, టీకా పంపిణీ సమర్థంగా జరిగేందుకు సలహా, సూచనలు ఇవ్వాలని కోరారు. ఆరోగ్యంతోపాటు లోక కల్యాణానికి టీకా కీలకమని భారత్ భావిస్తోందని వ్యాఖ్యానించారు. కరోనాపై పోరులో ఇరుగుపొరుగుతోపాటు ఇతర దేశాలకు సాయం అందించడం మన ధర్మమన్నారు. దేశంలో డ్రగ్ రెగ్యులేటరీ పద్ధతులను మరింత మెరుగుపరిచేందుకు శాస్త్రవేత్తలు స్వేచ్ఛగా, నిష్కర్షగా అభిప్రాయాలు తెలపాలని సూచించారు. కరోనా మహమ్మారిని అరికట్టే వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్న వేళ టీకా పురోగతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా సమీక్షించారు. శనివారం వరసగా మూడు నగరాల్లో టీకా తయారీ కేంద్రాలను సందర్శించారు. అహ్మదాబాద్లోని జైడస్ బయోటెక్ పార్క్, హైదరాబాద్లోని భారత్ బయోటెక్, పుణే లోని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలకు వెళ్లారు. అక్కడ శాస్త్రవేత్తలను కలుసుకొని మాట్లాడారు. వ్యాక్సిన్ ప్రయోగాలు, డోసుల ఉత్పత్తి, టీకా పంపిణీలో సవాళ్లను అధిగమించేలా జరుగుతున్న ఏర్పాట్లపై నేరుగా సమాచారాన్ని తెలుసుకోవడం కోసమే ప్రధాని మోదీ ఈ పర్యటన చేపట్టారని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. భారత్ దేశీయంగా రూపొందిస్తున్న జైకోవ్–డీ, కొవాగ్జిన్ టీకాలపై పరిశోధనలు అత్యంత వేగంగా సాగుతూ ఉండడం దేశానికే గర్వ కారణమని ప్రధాని పేర్కొన్నారు. వ్యాక్సిన్ ప్రజలందరికీ చేరేలా మెరుగ్గా పంపిణీ చేయడానికి పలు సూచనల్ని కూడా శాస్త్రవేత్తలను అడిగి ప్రధాని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కరోనాను ఎదుర్కొనే విషయంలో ఎలా కొత్త మందులు తయారు చేస్తున్నదీ... పాత మందులను కరోనా కట్టడి కోసం ఎలా మారుస్తున్నదీ శాస్త్రవేత్తలు ప్రధానికి వివరించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకాలు సిద్ధం చేస్తున్న కోవిషీల్డ్ టీకాను పుణేలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పెద్ద ఎత్తున తయారు చేస్తున్న విషయం తెలిసిందే. అతిపెద్ద ప్రయోగం భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకాపై ప్రస్తుతం జరుగుతున్న మూడో దశ మానవ ప్రయోగాలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జరుగుతున్న అతిపెద్ద కోవిడ్ టీకా ప్రయోగమని భారత్ బయోటెక్ ఒక ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా సుమారు 25 కేంద్రాల్లో 26,000 మంది వలంటీర్లకు టీకా ఇస్తున్నామని, జినోమ్ వ్యాలీలోని బీఎస్ఎల్–3 స్థాయి కేంద్రంలో వ్యాక్సిన్ తయారవుతోందని కంపెనీ తెలిపింది. ప్రధాని మోదీ తమ ఫ్యాక్టరీని సందర్శించడంపై భారత్ బయోటెక్ హర్షం వ్యక్తం చేసింది. టీకా తయారీలో నిమగ్నమైన శాస్త్రవేత్తలు, ఇతర సిబ్బందికి ప్రధాని పర్యటన స్ఫూర్తినిస్తుందని, ప్రజారోగ్య సమస్యల పరిష్కారంలో తమ నిబద్ధతను మరింత పెంచుతుందని భారత్ బయోటెక్ ఒక ప్రకటనలో తెలిపింది. టీకా అత్యవసర వాడకానికి త్వరలో దరఖాస్తు కరోనా వైరస్ నియంత్రణకు ఆస్ట్రాజెనెకా–ఆక్స్ఫర్డ్ వర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ను ఇండియాలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) నిర్వహిస్తోంది. ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికిగాను రానున్న రెండు వారాల్లో డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేయనున్నట్లు ఎస్ఐఐ సీఈఓ ఆదార్ పూనావాలా శనివారం చెప్పారు. ఎమర్జెన్సీ యూజ్ లైసెన్స్ వచ్చిన తర్వాతే వ్యాక్సిన్ పంపిణీ సాధ్యమవుతుందన్నారు. ఇందుకోసం అవసరమైన డేటాను త్వరలో ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. ఆస్ట్రాజెనెకా–ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ను తొలుత భారత్లో, అనంతరం ఆఫ్రికా దేశాల్లో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

మోదీ వ్యాక్సిన్ వేసుకుంటే చాలు అని అంటున్నారుగా..!
21 minutes ago

భర్తకు విడాకులు.. కొడుకుతో పెళ్లి.. ఇప్పుడు తల్లి
7 hours ago

వైట్ హౌజ్ కాదు.. వాషింగ్టన్ నే వదిలేస్తారట
5 hours ago

ట్రంప్పై బండ పడింది.. అభిశంసనకు ఆమోదం.. సెనేట్ నిర్ణయం ఫైనల్
8 hours ago

భారతదేశంలో మొదలైన వ్యాక్సినేషన్..
9 hours ago

ఎంత గ్యాప్ ఉంటే అంత సమర్థంగా వ్యాక్సిన్ పనితీరు.. సీరమ్ సైంటిస్టు
10 hours ago

తొమ్మిదో రౌండ్ చర్చలు 120 శాతం విఫలం.. రైతుసంఘాల వ్యాఖ్య
11 hours ago

భారత్ చైనా ప్రతిష్టంభన.. సడలింపు.. పాంగాంగ్ సరస్సు ప్రారంభం..
11 hours ago

కాసేపట్లో కరోనా వ్యాక్సిన్ ప్రారంభం.. ప్రపంచంలో మనమే టాప్
12 hours ago

ఏపీలో మద్యం ధరల పెంపు.. దేశంలో పెట్రోల్ ధరల పెంపు ఒక్కటేనా..
15-01-2021
ఇంకా