శనివారం నిర్వహించాల్సిన ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష వాయిదా
27-11-202027-11-2020 17:40:26 IST
2020-11-27T12:10:26.645Z27-11-2020 2020-11-27T12:10:23.466Z - - 21-01-2021

నివర్ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షం కురుస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో శనివారం నాడు(నవంబర్ 27) నిర్వహించాల్సిన ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్షను వాయిదా వేశారు. పలు జిల్లాల్లో పరీక్ష నిర్వహించడం కష్టమవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాయిదాపడిన ఈ పరీక్షను డిసెంబరు 5న నిర్వహిస్తామని ఆర్జీయూకేటీ కన్వీనర్ డి.హరినారాయణ వెల్లడించారు. ఇప్పటికే జారీ అయిన హాల్ టికెట్లు, పరీక్ష కేంద్రాల విషయంలో ఎలాంటి మార్పులు లేవని, ఆ హాల్ టికెట్లపైనే, అవే పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందని స్పష్టం చేశారు. ట్రిపుల్ ఐటీ ఎంట్రన్స్ టెస్టుకు హాజరయ్యేవారు ఏదైనా గుర్తింపు కార్డుతో 2 గంటలు ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కన్వీనర్ స్పష్టం చేశారు.
నివర్ తుపాను కారణంగా చిత్తూరు జిల్లాలో భారీ వర్షం కురుస్తూ ఉంది. ప్రస్తుతం తిరుపతి సమీపంలో వాయుగుండం కొనసాగుతోంది. తిరుపతికి ఉత్తరంగా 35 కిలోమీటర్లు, నెల్లూరుకు నైరుతిగా 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇంకొన్ని గంటల్లో మరింతగా బలహీనపడి అల్పపీడనంగా మారనుందని వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు. వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. శుక్రవారం తెల్లవారుజామున తమిళనాడులోని మామళ్లపురం-కరెైకల్ మధ్య తీరం దాటిన నివర్ తుపాను ఏపీపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వాతావరణం చల్లగా మారిపోయింది. గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుతో, కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత కూడా బాగా పెరిగింది.

పిడకలు అమ్మడం, రేటు కాదు.. దాని రివ్యూ ఇంట్రస్టింగ్
31 minutes ago

మందు బాబులు.. వ్యాక్సిన్ తీసుకునే ముందు ఇది గమనించుండ్రి..!
20-01-2021

అత్తకు గుడి కట్టిన కోడళ్ళు.. ప్రతి నెలా భజనలు, కీర్తనలు
20-01-2021

కరోనా నుండి కోలుకున్న ప్రతి ఎనిమిది మందిలో ఒకరు చనిపోతున్నారట..!
18-01-2021

అవినీతి కేసులో సీబీఐ అధికారుల సస్పెండ్..
17-01-2021

ఇండోనేషియాలో బారీ భూకంపం.. 42 మంది మృతి
17-01-2021

టీకా వికటిస్తే మాదే బాధ్యత.. పైసా పైసా కట్టేస్తాం
17-01-2021

ఢిల్లీలో 13 ఏళ్ల బాలుడికి హిజ్రాగా శస్త్రచికిత్స..
16-01-2021

తొలి వ్యాక్సిన్ పండగ.. మంత్రి ఈటెలకు నేడే
16-01-2021

ఆన్ లైనా.. ఆఫ్ లైనా.. ఏది బెటర్
15-01-2021
ఇంకా