స్కూళ్ల ప్లానే వేరు.. ఎంతన్నా విద్యావంతులు కదా
కప్పు ముఖ్యం బిగిలూ అనే ఫేమస్ డైలాగ్ ఉంది కదా. తమిళ్ విజయ్ విజిల్ సినిమాలో ఫేమస్ డైలాగ్. అందులో తండ్రి పాత్ర కొడుకు పాత్రతో అంటుంది. కప్పు ముఖ్యం బిగిలూ అని. అలాగే.. తెలంగాణలో స్కూల్స్ యాజమాన్యాలు కూడా మేనేజ్ మెంట్ కి అదే చెబుతోందంట. అయితే.. ఇక్కడ ఫీజు ముఖ్యం సార్లూ అంటున్నారట. వాళ్లేమో.. పిల్లల పేరేంట్స్ కి అదే డైలాగ్ ని కాస్త మార్చి చెబుతున్నారు. ఫీజు ముఖ్యం పేరెంట్సూ అంటున్నారు.
మరి ఆ మాత్రం తెలివి తేటలు లేనిదే వాళ్లు విద్యావంతులు అయ్యారా.. స్కూల్స్ ఓపెన్ చేశారా. చిల్లర కొట్టుకంటే దారుణంగా బిజినెస్ లు చేస్తున్నారా అనే డైలాగ్ రానే వస్తుంది కదా జనం నుంచి. ఇప్పుడు ఆ డైలాగ్ కి కూడా తగ్గట్లే చేస్తున్నాయట విద్యాసంస్థల యాజమాన్యాలు. అవన్నీ కాదు. ముందు ఫీజు కడతారా కట్టరా అంటున్నారట. మా పిల్లలు ఇంట్లనే ఉన్నారు కదా.. స్కూల్ కి రాలేదు కదా అంటే.. ఫీజు కడతారా కట్టరా అంటున్నారట. ఎగ్జామ్స్ రద్దు చేశారు కదా అంటే కూడా.. ఫీజు కడతారా లేదా అంటున్నారట.
టెన్త్ ఎగ్జామ్స్ రద్దు చేశారు కదా అని స్కూల్స్ అంటే.. మీరు ఫీజు కట్టాల్సిందే. లేదంటే.. ఇంటర్నల్ మార్కుల్ని బేస్ చేసుకునే కదా టెన్త్ పాస్ చేసేది. మేం మీ పిల్లల ఇంటర్నల్ మార్క్స్ పైకి పంపం. మీ పిల్లలు పాస్ కారు. మీ పిల్లలు టెన్త్ క్లాస్ లో పాస్ కావాలి అంటే.. ఫీజు కట్టాల్సిందే అంటున్నారట.
ఇక పోతే.. టెన్త్ తో పాటు మిగతా తరగతుల విద్యార్థుల్ని కూడా ఫీజు అడుగుతున్నారట. అట్టా ఎట్టా అంటే.. రద్దు చేసింది.. టెన్త్ ఎగ్జామ్స్ మాత్రమే కదా. మిగతా తరగతులకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తం. ఎగ్జామ్స్ నడిస్తేనే మీ పిల్లలు పాస్ అయ్యి.. నెక్స్ట్ క్లాసులకి ప్రమోట్ అవుతారు. లేదంటే ఈ కరోనా ఎన్నేళ్లు ఉంటుందో తెలీదు. అప్పటి దాకా.. మీ పిల్లలు ఉన్న క్లాసులోనే ఉంటారు అని బెదిరిస్తున్నారట. ఏది ఏమైనా సరే.. ముందు ఫీజు కట్టండి తర్వాతనే డీటెయిల్స్ అడగండి అని దబాయిస్తున్నారట. ఇప్పుడు ప్రతి ఊళ్లోనూ ఇదే ఎవ్వారం హాట్ టాపిక్ అయింది.
రామ మందిర విరాళాలు..కోట్లకి కోట్లు స్వాహా
స్వాహా అంటే ఎవరూ తినలేదు లెండి. రామ్ మందిర్ నిర్మాణం కోసం వచ్చిన డబ్బులు మాయం అయ్యాయి అంతే. మాయం అయ్యాయి అనడం కంటే కూడా.. వచ్చే డబ్బులు రాకుండా పోయాయి. వచ్చాయిలే అని లెక్కలేసుకున్న డబ్బులు లెక్కలోకి రాని పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు తిరిగి అడలేని పరిస్థితి ఎదురైంది.
ఎందుకంటే.. రామ్ మందిర్ నిర్మాణం కోసం.. విరాళాల సేకరణ గురించి తెలిసిందే కదా. ఊరూ వాడా వసూళ్లు చేశారు. భక్తితో ఇచ్చినంతా తీసుకున్నారు. పది రూపాయిల దగ్గర్నుంచి.. ఎవరికి నచ్చినంతా.. ఎవరికి చేతనైనంతా.. ఎవరికి కుదిరినంతా వాళ్లిచ్చారు. ఉడతా భక్తి కొందరిది.. కొండంత భక్తి కొందరిది. ఇచ్చిన డబ్బుతో భక్తిని కొలమానం చేయడం కరెక్ట్ కాదు కానీ.. ఎవరికి తోచినంతా వాళ్లిచ్చారు అనుకోవచ్చు. అలా ఇచ్చిన వారిలో కొంతమంది పెద్ద అమౌంట్ లు ఇచ్చారు. మరి పెద్ద అమౌంట్ లు ఇచ్చే టైంలో.. చెక్ లు ఇవ్వడం ఆనవాయితీ కదా. పైగా అలా చెక్కు రూపంలో ఇస్తే.. వాటికి ట్యాక్స్ మినహాయింపులు గట్రా ఉంటయ్ కావచ్చు.
వాళ్లు ఏ ఉద్దేశంతో ఇచ్చారు అనేది వదిలేస్తే.. వేలకి వేల చెక్కులు కూడా వచ్చాయి. వాటిలో 15 వేల చెక్ లు బౌన్స్ అయ్యాయట. 15 వేల చెక్కులు బౌన్స్ అయితే.. అందులో ఉన్న అమౌంట్ మొత్తం లెక్కలేస్తే.. 22 కోట్లు దాకా ఉన్నాయట. ఈ విషయం అయితే అఫీషియల్ గా బయటికి రాలేదు కానీ.. టాక్ అయితే ఉంది. మరి ఆ చెక్ లు ఇచ్చిన వారిని మళ్లీ అడగలేరు కావచ్చు. వాళ్ల ఇంటిదాకా వెళ్లి.. చెక్ బౌన్స్ అయింది. ఇంకో చెక్ రాయండి.. లేదంటే క్యాష్ ఇవ్వండి.. లేదంటే ట్రాన్స్ ఫర్ చేయండి అనలేరు కావచ్చు. అలాగే చెక్ బౌన్స్ అయింది అని.. కేస్ లు కూడా పెట్టలేరు కదా. ఏదో దేవుడి మీద భక్తితో ఇచ్చిన చెక్ బౌన్స్ అయినంత మాత్రాన.. కేసులేస్తారా అంటారు. మరి ఈ డబ్బు పరిస్థితి ఏంటి.. వదిలేస్తారా.. మళ్లీ తెప్పిస్తారా అన్నది ఇంట్రస్టింగ్ గా మారింది.
ఎండలు చల్లార్చే వానా.. బతుకులు తెల్లార్చే వానా
ఈ వాన తగలబడ. టైం కి పడమంటే పడదు. కానీ.. వద్దురు వరుణ దేవా నీకు దండం పెడతం రా బాబూ.. నాల్రోజులు ఆ పైననే ఎక్కడో ఒక చోట తగలబడు అంటే.. తుర్రు తుర్రున కిందికొస్తడు. అంటూ.. తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు రైతులు. ఓ పక్కనేమో వరికోతలు స్టార్ట్ అయ్యాయి. కల్లాల మీద వరి కుప్పలు ఉన్నాయి. అవి తడిస్తే.. బతుకు ఎండిపోయినట్లే. ఏం చేస్తరు చెప్పండి. కోసే వాళ్లేమో.. నీళ్లలో రాలి పోతయ్ అని భయపడుతున్నారు. కోసినోళ్లేమో.. కల్లాల్లో మొక్కలెత్తుతయ్ అని టెన్షన్ పడుతున్నారు.
ఇటు మిర్చి రైతులు కూడా అంతే. కోయకుండ ఆపలేరు. కోస్తే కాపాడుకోలేరు. మంచి ఎండల టైంలో.. కాస్త ఎండితే.. మిర్చికి మంచి రేటు వస్తుంది. కానీ.. తడిస్తే.. నల్లబడి తాలు కాయలు పెరిగి.. రైతు నిండా మునిగిపోతాడు. మిర్చి పెట్టుబడుల గురించి తెలిసిందే కదా. బతుకులు తెల్లారి పోతయ్.
ఇక మరో కోణం ఉంది కదా. హమ్మయ్యా.. మబ్బులు పట్టింది. హమ్మయ్యా వానలు వస్తున్నయ్. హమ్మయ్యా ఇంకాస్త గట్టిగా పడితే వారం దాకా చల్లబడి ఉంటుంది. పొగలుగక్కుతున్న భూమి కాస్త చల్లబడుతుంది. అయినా.. ఈ ఎండలో కాసేపు రెండు జల్లులు వాన వస్తే ఎంత బాగుంటుందో కదా అంటూ.. వానొచ్చే టైంలో డాబా మీదికి వెళ్లి.. ఫోన్ లు ఇంట్లో పడేసి.. మనసారా తడిసి కూని రాగాలు తీస్తూ.. చిన్న చిన్న స్టెప్పులేస్తూ.. వేడి వేడి పకోడీలు తింటూ రొమాంటిక్ గా ఉంటుంది అని.. ఐస్ క్రీమ్ లు తినే వాళ్లూ ఉన్నారు.
ఎవరికి మంచిది ఎవరికి చెడుది అనేది వదిలేస్తే.. మరో రెండు రోజులు మాత్రం వానలు పడుతూనే ఉంటయ్ అంటున్నారు వాతావరణ శాఖ వాళ్లు. రెండు రోజులుగా ఏపీ తెలంగాణలో మంచి వానలు పడుతున్నయ్. అయితే ఇంకో రెండు రోజులు వానలు బానే ఉంటయ్. ఈ వీకెండ్ మొత్తం చల్లని పిల్ల గాలులతో పాటు ఈదురు గాలులు కూడా తోలుతుంటయ్ అంటున్నారు. ఏడ్చేవాళ్లు ఏడ్వాలి.. ఎంజాయ్ చేసేవాళ్లు ఎంజాయ్ చేయాలి. తప్పదు.. తప్పదేముంది చెప్పండి. వానలు మాత్రం గట్టిగనే పడుతున్నయ్ కదా.
విశాఖ జిల్లాలో దారుణ ఘటనలు..!
విశాఖ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి, ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన పెందుర్తి మండలం జుత్తాడలో ఈ తెల్లవారుజామున చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఇంట్లో నిద్రపోతున్న వారిపై ఓ వ్యక్తి పదునైన ఆయుధంతో దాడి చేసి, ఒక్కొక్కరినీ హతమార్చినట్టుగా తెలుస్తోంది.
పెందుర్తి మండలం జుత్తాడలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఇద్దరు చంటి పిల్లలు కూడా ఉన్నారు. పాతకక్షల నేపథ్యంలో బత్తిన అప్పలరాజు అనే వ్యక్తి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. నిందితుడు అప్పలరాజు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతులను రమణ(63), ఉషారాణి(35), రమాదేవి (53).. అరుణ(37), ఉదయ్(2), ఇషిత(ఆరు నెలలు)గా గుర్తించారు. ఇక నగర పోలీస్ పోలీస్ కమిషనర్ మనీష్కుమార్ సిన్హాతో పాటు పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు సైతం ఘటనాస్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు.
తాజాగా అందిన సమాచారం ప్రకారం ఆరుగురిని దారుణంగా హత మార్చిన తరువాత నిందితుడు అప్పలరాజు నేరుగా పెందుర్తి పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పెందుర్తి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు లొంగిపోయిన విషయాన్ని పోలీసులు దృవీకరించలేదు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్యకు గురికావడంతో ఆ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమగ్ర దర్యాప్తు జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
విశాఖపట్నంలోని మధురవాడలో ఓ ఎన్ఆర్ఐ కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మధురవాడలోని ఆదిత్య ఫార్చున్ టవర్లోని ఫ్లాట్ నెంబర్ 505లో అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పాటు పొగ వెలువడడంతో స్థానికులు భయాందోళనకు గురైయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులకు సమాచారం అందించారు.
అయితే.. వారు అక్కడకు చేరుకునే లోపే ఇంట్లోని నలుగురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. మృతులను బంగారునాయుడు (50), డాక్టర్ నిర్మల (44), దీపక్ (22), కశ్యప్ (19)గా పోలీసులు గుర్తించారు. విజయనగరం జిల్లా గుంట్యాడకు చెందిన బంగారు నాయుడు కుటుంబం బెహరాన్లో స్థిరపడింది. నాలుగేళ్ల క్రితం విశాఖ జిల్లాకు వచ్చారు. 8 నెలల క్రితమే ఆదిత్య టవర్స్లోని ప్లాట్లో అద్దెకు దిగారు. ఇంట్లోని ఏసీ, సామాగ్రి పూర్తిగా దగ్థమై ఉన్నాయి. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తు పట్టడానికి వీల్లేకుండా ఉన్నాయి.
37 రోజుల్లో ఒకే అమ్మాయితో 3 విడాకులు..4 పెళ్లిళ్లు, 5వ పెళ్లికి ట్విస్ట్
ఏందిరా అయ్యా.. ఇదేమన్నా ఇదా. 37 రోజుల్లో 4 పెళ్లిళ్లు చేసుకోవడం అంటే మామూలు విషయమా చెప్పండి. పైగా మూడు విడాకులు. నాలుగోసారి కూడా విడాకులు తీసుకోవాలని.. ఐదో పెళ్లికి రెడీ అవుతుంటే అంతా అడ్డం తిరిగిందా. ఇదేం కతరా బాబూ అనుకుంటాం. అట్టెట్టా విడాకులిస్తారు అనే డౌట్ కూడా వస్తుంది. బట్ ఇట్స్ నాట్ అబౌట్ ఇండియన్ లా. ఇట్స్ అబౌట్ తైవాన్ లా.. సో.. ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు.
ఇందులో కూడా ఓ విడ్డూరం ఉంది. మూడు సార్లు విడాకులు తీసుకుని.. నాలుగు సార్లు పెళ్లి చేసుకుంది కూడా ఒకే అమ్మాయి. పెళ్లి చేసుకున్న అమ్మాయికి 8 రోజుల్లో విడాకులు ఇచ్చి.. మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఎనిమిది రోజుల గ్యాప్ లో మళ్లీ విడాకులిచ్చి.. మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. వెంటనే 8 రోజుల తర్వాత మళ్లీ విడాకులిచ్చాడు. వెంటనే పెళ్లి చేసుకున్నాడు. ఇలా మూడు సార్లు విడాకులిచ్చి.. నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నాడు. అదే అమ్మాయికి మళ్లీ విడాకులిచ్చి.. ఐదోసారి పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. ముందే ప్రిపేర్ అయ్యాడు. కానీ.. ఇక్కడో ట్విస్ట్ ఎదురైంది.
ఓ మొగుడు..ఇద్దరు ప్రియులు..బావిలో శవం
తైవాన్ చట్టం ప్రకారం. పెళ్లి చేసుకున్న వారు ఇద్దరూ ఒప్పుకుంటే విడాకులు వెంటనే ఇస్తారు. అలాగే.. పెళ్లి చేసుకున్న వారికి 8 రోజులు పెయిడ్ లీవ్స్ ఇవ్వాలి. అంటే.. 8 రోజులు సెలవులు ఇచ్చి.. శాలరీ కూడా ఇవ్వాలి అన్నమాట. అతనికి అదే పాయింట్ నచ్చింది. పెళ్లి చేసుకుని 8 రోజులు ఎంజాయ్ చేశాడు. జాలీగా తిరిగొచ్చారు. వెంటనే సెలవులు అయిపోయాయి. ఇంకేం చేయాలో అర్దం కాక.. వెంటనే విడాకులు తీసుకుని.. మళ్లీ పెళ్లి చేసుకుని 8 రోజులు సెలవులకి అప్లై చేశాడు. మళ్లీ సెలవులు ఇచ్చారు. ఇలా మూడు సార్లు విడాకులు తీసుకుని.. నాలుగు సార్లు అదే అమ్మాయిని పెళ్లి చేసుకుని.. జాలీగా హనీమూన్ ఎంజాయ్ చేశారు. తను పెళ్లి పని చేస్తున్న బ్యాంకు వారికి కోపం రావడం స్టార్ట్ అయింది.
ఇక నాలుగోసారి విడాకులు తీసుకుని.. ఐదో సారి పెళ్లి చేసుకోవాలని బ్యాంకుకి సెలవుల కోసం అప్లై చేశాడు. బ్యాంకుకి కోపం పెరిగింది. మేం సెలవులు ఇవ్వం పో అన్నారు. వెంటనే ఈ నిత్య పెళ్లికొడుకు లేబర్ బ్యూరోని ఆశ్రయించాడు. అదేంటయ్యా.. అతను రూల్స్ ప్రకారం విడాకులిచ్చి పెళ్లి చేసుకుంటే ప్రాబ్లమ్ ఏంటి సెలవులు ఇవ్వాల్సిందే అనేసింది లేబర్ బ్యూరో. సెలవుల టైంలో శాలరీ కూడా ఇవ్వాలి అని చెప్పింది. దీంతో బ్యాంకుకి ఇంకా కోపం పెరిగింది. కోర్టుకెళ్లారు బ్యాంకు వాళ్లు. బ్యాంకు కూడా అదే చెప్పింది. సెలవులు ఇవ్వాల్సిందే.. శాలరీ ఇవ్వాల్సిందే అని డిసైడ్ చేసింది కోర్టు.
ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం
హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ కంటైనర్ వాహనం, మరో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్ మంటల్లోనే సజీవదహనం అయ్యాడు. అతడితో పాటూ మరో వ్యక్తి కూడా సజీవ దహనం అయ్యాడు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై చోటు చేసుకుంది. ఏపీ నుంచి రొయ్యల లోడుతో వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో ఔటర్ పై పెద్దఎత్తున్న వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ నుండి రొయ్యల కంటైనర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాదులోని అప్పా జంక్షన్ సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో భారీ కంటైనర్ లో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో కంటైనర్ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. మంటల్లో సూరజ్ అనే డ్రైవర్ కాలిపోయాడు, మూర్తునుజన్ అనే క్లీనర్ కూడా మరణించారు.
ఏసి కంటెనర్ లో ఆంధ్రప్రదేశ్ నర్సాపూర్ నుండి రోయ్యల లోడుతో వస్తున్న భారీ కంటైనర్ ఓ లారీని ఢీకొట్టింది. మృతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారని చెబుతున్నారు. రాజేంద్రనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ లతో మంటలను అదుపు చెసే లోపే రెండు ప్రాంణాలతో పాటు కంటైనర్ అగ్నికి అహుతి అయింది. ప్రమాదంలో మొదట క్యాబిన్ తుక్కుతుక్కు అయ్యింది. ఆ తర్వాత వెంటనే వాహనం నిప్పుల్లో చిక్కుకుంది. ఆ కంటైనర్ నుండి బయట పడాలని అనుకున్నప్పటికీ వీలు పడలేదు.. స్థానికులు కూడా కాపాడాలని ప్రయత్నించగా.. అప్పటికే వారు సజీవదహనం అయ్యారు. రొయ్యలు రోడ్డు మీద పడిపోవడంతో పాటూ ఈ ప్రమాదం కారణంగా ఔటర్ రింగ్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
గోదావరిలో మనుషుల్ని తినే చేపలు
రోజూ ఇన్ని కోట్ల చేపల్ని తింటే ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ.. ఒక్క చేపకానీ.. మనుషుల్ని తింటే సినిమాలు తీసేస్తారు జనాలు. ఇది మనం సినిమాల్లో వినే డైలాగ్. నిజమే.. మనుషుల్ని చేపలు తింటే సినిమాలు తీయడం కామనే. వాటిపై ఆల్రెడీ మూవీస్ వచ్చాయి కూడా. కానీ.. అది మనం ఊహగా మాత్రమే అనుకున్నాం. లేదంటే.. ఎక్కడో వేరే దేశాల్లో ఉండేవి కావచ్చు అనుకున్నాం. కానీ.. ఇప్పుడు మన దాకా వచ్చాయి. మన గోదావరికి వచ్చాయి. మన తూర్పుగోదావరి జిల్లాలోకి కూడా వచ్చాయి.
ఇంతకు ముందు ఈ చేపలు.. అమేజాన్ అడవుల్లోని నదుల్లో ఉండేవి. తర్వాత కొన్ని సముద్రాల్లో కలిశాయి. మన దేశంలోని గంగా నదిలో కనిపించాయి ఈ కిల్లర్ ఫిష్ లు. తర్వాత గంగానదిలో కలిసే మహానదిలో.. కనిపించాయి. వారణాసి ఏరియాలో కల్లోలం సృష్టించాయి. జనాలు భయపడ్డారు. చెరువుల్లో కలిస్తే చంపేశారు. నదుల్లో కూడా చంపేశారు. కానీ.. ఎటు నుంచి వచ్చాయో తెలీదు ఈ సక్కర్ మౌత్ క్యాట్ ఫిష్ లు. ఇప్పుడు మన గోదావరిలో ఈదుతున్నాయి. మనం కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే అని హెచ్చరిస్తున్నాయి.
యాక్చువల్ గా చేపలన్నీటిలో ఈ సక్కర్ మౌత్ క్యాట్ ఫిష్ లు కాస్త వైల్డ్ గా ఉంటాయట. మనుషుల్లో ఉండే క్రిమినల్స్ ఎలాగో.. చేపల్లో ఇవి అలాంటివి. వీటికి మాంసం కావాలి. అంతే. అది ఏ మాంసం అయినా ఓకే. చేప, మొసలి, పిల్లి, బల్లి అనేదేం ఉండదు. వాటికి ఏవి దొరికితే అవి తినేస్తాయి. అయితే.. తోటి చేపల్ని తినడంలో బాగా స్పీడ్ ఉంటాయంట. అవి బతికే ఏరియాలో వేరే చేపలు బతకవట. ఇక అన్నీ ఆ చేపలే ఉన్న ఏరియాలో మనుషులు నడిచినా వెంట పడతాయట. వాటిని అవి తినలేవు కదా. అవతల చేపలు కూడా అంతే బలంగా ఉంటాయి కాబట్టి.. వాటిని అవి గెలవలేవు. ఆ టైంలో గానీ.. మనుషులు ఈదడం.. ఆ ఏరియాలో నడవడం చేస్తే అంతే దొరికిన కాడికి కండ లాగేస్తాయట. గుంపులో పడితే మాత్రం గోవిందా.
కాటి కాపరికి 9 మంది భార్యలు.. ఆస్తి కోసం కాపరిపై హత్యాయత్నం
ఏంది.. కాటి కాపరికి తొమ్మిది మంది భార్యలా. ఈ రోజుల్లో ఉద్యోగాలు.. ఎకరాలకి ఎకరాలు ఉన్న వారికి కూడా పెళ్లిళ్లు కాక.. పిల్లలు దొరక్క.. 40 ఏళ్లు దాకా వెయిట్ చేసి.. ఎవరో ఒకరు లే అని చేసుకుంటూ.. ముదురు బెండకాయలుగా మారిపోతున్న వాళ్లు ఎంతో మంది. కొన్ని సామాజిక వర్గాల్లో అయితే.. మరీ దారుణంగా ఉంది పరిస్థితి. కన్యాశుల్కం ఇచ్చి మరీ చేసుకుంటున్నారు. ఇలాంటి టైంలో ఇలాంటి వార్త వింటే ఎంత విడ్డూరంగా ఉంటుందో తెలిసిందే కదా. పైగా కాటి కాపరి ఆస్తికోసం.. కాటి కాపరిపైనే హత్యాయత్నం చేశారు అంటే నమ్మేలా ఉందా ఎవ్వారం. నమ్మాలి మరి. ఎందుకంటే ఆయనకి తొమ్మిది మంది భార్యలే కాదు. 14 మంది పిల్లలు కూడా ఉన్నారు మరి.
చిత్తూరు జిల్లా మదన పల్లెలో కుందాన భాస్కర్ అనే ఫేమస్ పర్సన్ ఉన్నాడు. లోకల్ గా తను ఫేమస్. ఎవరు చచ్చినా.. ఆయన అక్కడ ఉండాల్సిందే. ఆయనే చనిపోయిన వారిని దహనం చేస్తుంటాడు. వాళ్లిచ్చిన డబ్బులతోనే బతుకుతుంటాడు. బతకలేని రోజు.. ఏదో ఒక పని చేసుకుంటాడు. అదే తన పని. ఇంకా ముఖ్యమైన పని ఏందయ్యా అంటే పెళ్లిళ్లు చేసుకోవడం. పెళ్లి చేసుకోవడం కొన్నాళ్లకి వదిలేయడం ఇలా అతను బాగా ఫేమస్ అయ్యాడు. తర్వాత తర్వాత 8వ భార్యని హత్య చేసి జైలుకి కూడా వెళ్లొచ్చాడు. అప్పుడు కూడా ఓ పెళ్లి చేసుకున్నాడు. మొత్తం తొమ్మిది మంది పెళ్లాలు. ప్రస్తుతం తొమ్మిదో భార్య దగ్గర ఉంటున్నాడు.
ముగ్గురి లవ్వూ ఒకే అమ్మాయి.. గ్రౌండ్ లో తేల్చుకున్నారు
అయితే.. ఆయనకు 8 సెంట్ల ఆస్తి ఉందంట. మరి పిల్లలు 14 మంది ఉన్నారు కదా. సో.. వాటా కోసం రెండో భార్య కొడుకు డిమాండ్ చేశాడట. అయితే ఆయన పట్టించుకోలేదట. లెక్క చేయలేదట. అదే ఆయన ప్రాణం మీదికి తెచ్చింది. అయితే ఇదే విషయంపై మాట్లాడేందుకు మదనపల్లె వెళ్లాడట తండ్రి. తన పాత ఇంట్లో ఉన్న తండ్రి విషయం తెలిసిన 2వ భార్య కుమారుడు నిలదీయడానికి వెళ్లాడు. గొడవ అయింది. అంతే.. కత్తితో గొంతు కోశాడు. తండ్రి చనిపోయాడు అని కొడుకు.. కొడుకు ఫ్రెండ్స్ పారిపోయారు. కానీ.. ఆ దగ్గరి ఏరియాలోనే ఉన్న మరో భార్య కొడుకు వచ్చి.. కాపాడాడు. హత్య చేయబోయిన రెండో భార్య కొడుకు మాత్రం పరారీలో ఉన్నాడు.
తెలంగాణకు వర్ష సూచన.. తడిసిన హైదరాబాద్
తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది. రంగారెడ్డి, మెదక్, యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట, సంగారెడ్డి, నల్గొండ, జనగామ, ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని... వడగండ్ల వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది. కూకట్పల్లి, మాదాపూర్, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, కుత్బుల్లాపూర్, బోరబండ, రహ్మాత్నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురంలో ఉరుములతో కూడిన వర్షం పడింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు, మున్సిపల్, డీఆర్ఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేశారు.
హైదరాబాద్ వాతావరణం గత రాత్రి ఒక్కసారిగా మారిపోయింది. అర్ధరాత్రి దాటిన తర్వాత పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచాయి. ఆ తర్వాత నెమ్మదిగా మొదలైన వర్షం రాత్రి నుంచి కురుస్తూనే ఉంది. ఈదురుగాలుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇన్ని రోజులూ హాట్ సిటీగా ఉన్నది కాస్తా కూల్ సిటీగా మారిపోయింది. తెల్లవారుజాము నుండే ప్రారంభమైన వర్షం నెమ్మదిగా నగరంలో పలుచోట్ల వ్యాపించింది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షం పడింది. దీంతో ఉదయమే వాతావరణం చల్లబడింది. ఎండలతో సతమతమైన ప్రజలు వాతావరణం చల్లబడటంతో భానుడి భగభగలు, ఉక్కపోత నుంచి ఉపశమనం పొందనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, జనగామ, సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలపడంతో ఆయా జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశ మున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
నాలుగు రోజుల పాటు వర్షాలు
అసలే కోతల టైం. ఓ పక్క వరి పంటలు కోతల మీద ఉన్నయ్. జనాలు మబ్బు పడితే ఉరుకులు పరుగులు పెట్టే పరిస్థితి ఉంది. మొన్నా మధ్యనే ఓ పది రోజుల కింద ఉరుకులు పెట్టించింది జనాల్ని. అప్పుడే కోతలు వస్తున్న టైంలో.. జనాలు పరుగులు పెట్టారు. ఇప్పుడు ఇంకా ఫుల్ గా నడుస్తున్నయ్ కోతలు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. వర్షం వస్తుందేమో అనే టెన్షన్ తప్పడం లేదు.
కోతల టైం కావడంతో పాటు.. ఓ పక్క మిర్చి కూడా ఉంది. ఇంకా మిర్చి కోతలు పూర్తవలేదు. ఇప్పుడిప్పుడే మొగ్గుతున్నయ్. పైగా కల్లాల మీదే ఇంకో 20 రోజుల వరకూ ఉంటయ్. ఓ పక్క వరి కోతలు కల్లాలు.. మరో పక్క మిరప కోతలు కల్లాలు. దీంతో.. వర్షం అంటే రైతులు భయపడే పరిస్థితి వచ్చింది.
ఈ టైంలో వాతావరణ శాఖ జనాల్ని ఇంకా భయపెడుతోంది. శనివారం వరకూ వర్షాలు పడొచ్చు అంటోంది వెదర్ రిపోర్ట్. ఇవ్వాళ సాయంత్రం పూట చల్లగా వర్షం పడొచ్చు అంటోంది వెదర్ రిపోర్ట్. రేపటి నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తూ.. అప్పుడప్పుడూ మోస్తరు వర్షాలు పడతాయట. తెలంగాణపై ఈ వర్షపు ఎఫెక్ట్ ఎక్కువగా ఉండొచ్చు అంటున్నారు. తుఫాన్ లో భారీ వర్షాలు అనేంత స్థాయిలో ఉండకపోయినా.. ఇవ్వాళ్టి నుంచి శనివారం కంప్లీట్ అయ్యేదాకా.. వెదర్ కాస్త డిస్టర్బింగ్ గానే ఉంటుందంట. గాలులు వీస్తూ.. అప్పుడప్పుడూ వర్షాలు పడుతూ ఉంటాయట. సో.. రైతులు కాస్త కేర్ ఫుల్ గా ఉండాల్సిన టైం వచ్చింది.
ప్లవ నామ సంవత్సరం.. మీ రాశి బలం
మేషం
ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3
పదిమందికి సపోర్ట్ గా ఉంటారు. గత వైభవం వస్తుంది. విద్యార్థులకు చదువుల విషయంలో మంచి జరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారంతో అన్ని సమస్యల్ని పరిష్కరించుకుని ఆరోగ్యంగా ఉంటారు.
వృషభం
ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3
గ్రహ బలం తక్కువగా ఉంది. శ్రమ కాస్త ఎక్కువగా ఉంటుంది. అడుగడుగునా సమస్యలు ఎదురవుతాయి. కాస్త ఆచి తూచి ముందుకెళ్తే మంచిది.
మిథునం
ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6
ఆర్థికంగా అంతా మంచిగానే ఉంది. గృహ, భూ, వాహన లాభాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసి వస్తుంది.
కర్కాటకం
ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6
ఇష్ట కార్య సిద్ధి ఉంటుంది. చదువుల్లో మంచి ఉపయోగం ఉంది. ఉద్యోగ విషయాల్లో కాస్త కేరింగ్ అవసరం. అడుగడుగునా సమస్యలు అయితే ఉంటాయి. ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లకుంటే ఆ సమస్యలకి పరిష్కారం దొరకడం కష్టం.
సింహం
ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2
వచ్చిన ప్రతి అవకాశాన్నీ విజయం మార్చుకుంటే మంచిది. శ్రమ ఫలిస్తుంది. మనసులో కోరుకున్న పనులు జరుగుతుంటాయి. సమిష్టి నిర్ణయాలతో విజయం దక్కుతుంది.
కన్య
ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2
పట్టుదల ఉంటేనే పనులు అవుతాయి. ఉద్యోగం చేసే వారికి శ్రమకి తగ్గ ఫలితం ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోకుంటే కష్టం. సొంత నిర్ణయాలతో శక్తి పెరుగుతుంది.
తుల
ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5
తులారాశి వారికి ఈ ఏడాది కలిసి వస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. జీవితాశయం నెరవేరుతుంది. విద్యార్థులకు మంచిగా ఉంది.
వృశ్చికం
ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5
అద్బుతమైన కార్య సిద్ధి ఉంది. పద్దతి ప్రకారం.. చట్టం ప్రకారం ధర్మం ప్రకారం పని చేస్తేనే విజయం దక్కుతుంది. అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి.
ధనుస్సు
ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5
ఉద్యోగంలో ఉన్న శిఖరాలు దక్కుతాయి. సమస్యను అర్దం చేసుకుంటూ తగిన పరిష్కారం వెతకాలి. జెట్ స్పీడ్ తో తీసుకునే నిర్ణయాలకి కాస్త దూరంగా ఉంటే మంచిది. కొన్ని విషయాల్లో కాలం మిమ్మల్ని పరీక్షిస్తుంది.
మకరం
ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1
అదృష్ట వంతులు అవుతారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. గతం కంటే కూడా కాస్త మంచి కాలం నడుస్తుంది.
కుంభం
ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1
ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. సమస్యలు ఎక్కువే.. కూల్ గా మాట్లాడి పరిష్కరించుకునే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త పడాలి.
మీనం
ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4
శుభయోగాలు ఉన్నాయి. అనుకున్న పనులు జరుగుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ధన దాన్య యోగాలు ఉన్నాయి.
భార్యని ప్రగ్నెంట్ చేసినందుకు భర్తకి జైలు శిక్ష
ఏందేందీ.. భార్య ప్రగ్నెంటా.
అవును. భార్య ప్రగ్నెంట్.
భర్తకి జైలు శిక్ష పడిందా
ఎస్ ఎగ్జాక్ట్ లీ. భర్తకి శిక్ష పడింది.
వేరే వాడి భార్యని ప్రగ్నెంట్ చేశాడు.. జైలుకి పంపారు అంటే.. ఓ అర్దం ఉంది.. సొంత భార్యను ప్రగ్నెంట్ చేస్తే.. లడ్డూలు స్వీట్లు తినిపించాలి. ఆడు మగాడ్రా బుజ్జీ అని కాస్త వల్గర్ డైలాగ్ ని స్టైలిష్ గా పలకాలి. భార్య సిగ్గు పడాలి. భర్త గర్వపడాలి. ఇద్దరూ కలిసి ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ ఆనంద పడాలి. అంతే కానీ.. భార్యని గర్భవతిని చేసిందుకు భర్తని జైలుకి పంపడం ఏంటి సామే అంటారా.
అయితే ఇది వినండి... ఎందుకంటే.. దయచేసి వినండి.. దయచేసి వినండీ అంటారు వింటారా. వినరు. మైనర్ బాలికలకి పెళ్లిళ్లు చేయొద్దు అంటారు. గొంతెత్తి మొత్తుకుంటున్నారు. ఏళ్లకేళ్ల నుంచి చెబుతున్నారు. అయినా సరే.. వింటున్నారా అంటే ఎవ్వరూ వినడం లేదు. మారు మూల గ్రామాల్లో అయితే ఇంకా దారుణం. వయసు వచ్చీ రాగానే ఆడ పిల్లలకి పెళ్లిళ్లు చేసేస్తున్నారు. లోకల్ గా ఉన్న ఆఫీసర్లకి అదో ఇదో సర్దిచెప్పుకుని కానిచ్చేస్తున్నారు..మేనేజ్ చేస్తూనే ఉన్నారు.
కానీ.. మైనర్ బాలికకి పెళ్లి అయిన తర్వాత భర్తకి దూరంగా ఉంచరు కదా. మరి ఉంచకుంటే ప్రగ్నెంట్ అవుతుంది కదా. ప్రగ్నెంట్ అయితే పోలీసులు ఊరుకుంటారా మరి. పెళ్లి కాకుండా మైనర్ బాలికకి ప్రగ్నెన్సీ ఎలా వచ్చింది. వస్తే ఆ ప్రగ్నెన్సీకి రీజన్ ఏంటి. ఇష్టపూర్తిగా మైనర్ బాలికతో కలిసినా కూడా కేసే కదా. సో.. ఆ అమ్మాయి మా ఆయనే అని చెప్పే ఛాన్స్ లేదు. మా బావే అని చెప్పినా సరే.. మైనర్ బాలికతో శృంగారం చేయడమే తప్పు.. ఆమెను గర్భవతిని చేయడం ఇంకా పెద్ద తప్పు అంటారు. తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోని చిన్నె గౌండూరులో ఇలాగే జరిగింది. పల్లెటూరు కావడంతో సీక్రెట్ గా మ్యారేజ్ చేశారు. పదమూడు ఏళ్లకే పాతికేళ్ల అబ్బాయితో పెళ్లి చేశారు. పల్లెటూరు కావడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. ఏడాది కాగానే ఆమెకి ఆరోగ్యం బాలేదు. జిల్లా హాస్పిటల్ కి తీసుకెళ్తే.. ప్రగ్నెంట్ అని తేలింది. మరీ పదమూడేళ్లకే ప్రగ్నెంట్ అంటే.. డాక్టర్లు మాత్రం ఊరుకుంటారా చెప్పండి. విషయం పోలీసులకి చెప్పారు. పోలీసులకి కూడా ఆ అమ్మాయిని చూసి కోపం వచ్చింది. పసిపాపకి పెళ్లి చేసి.. ఆమెను ప్రగ్నెంట్ చేస్తే ఆమె లైఫ్ ఏం కావాలి అని సీరియస్ అయ్యారు. భర్తపై పోక్సో యాక్ట్ కింద కేసు పెట్టి జైలుకి పంపారు. పోక్సో యాక్ట్ ప్రకారం.. పదేళ్ల దాకా శిక్ష పడే ఛాన్స్ ఉంది. ఐదారేళ్లు పడ్డా.. ఆ అమ్మాయి మైనార్టీ తీరే దాకా అబ్బాయి జైల్లో ఉంటాడేమో అంటూ.. ఇప్పుడు లబో దిబో అని ఏడుస్తున్నారు పేరెంట్స్.

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ల్యాప్టాప్స్, స్మార్ట్ ఫోన్స్ ఫ్రీ
06-07-2020

రహస్యంగా కాజల్ ఎంగేజ్ మెంట్? ఎవరితోనో తెలుసా?
24-08-2020

ఏపీ గవర్నర్ మార్పు తథ్యమా? బిబి హరిచందన్ స్థానంలో కిరణ్ బేడీ?
10-08-2020

భారత్ ని వేడుకొంటున్న చైనా.. వెనక్కు పోయాం.. నమ్మండి ప్లీజ్
09-08-2020

హైదరాబాద్లో బాంబు పేలుడు.. కార్లు, బస్సుల అద్దాలు ధ్వంసం
21-08-2020

నారా లోకేశ్ కి విడదల రజనీ షాక్
28-10-2020

ఏంటి రజనీ మేడమ్.. అసలు కథ అదేనా
30-10-2020

అప్పుడలా.. ఇప్పుడిలా..! విడదల రజినీ ఇంతలా మారిపోయారా..?
04-07-2020

విజయసాయి రెడ్డికి ఇష్టం లేని పని జరగబోతోందా?
24-07-2020