భారత ఆటగాళ్లకు అమ్మాయిలు పుట్టడంపై అమితాబ్ ట్వీట్..!
ఇటీవలే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులకు అమ్మాయి పుట్టింది. పలువురు ప్రముఖులు ఈ దంపతులకు శుభాకాంక్షలు చెప్పుకొచ్చారు. భారత క్రికెటర్లకు అమ్మాయిలు పుడుతూ ఉండడంపై బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ ఓ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మన క్రికెట్ టీమ్ అంతా కలిసి భవిష్యత్తులో మహిళల క్రికెట్ టీమ్ను తయారు చేస్తోందంటూ బిగ్ బీ నవ్వు తెప్పించే ట్వీట్ చేశారు. ఇందులో క్రికెటర్లందరికీ కూతుళ్లే పుట్టారంటూ వరుసగా ఒక్కొక్కరి పేరు రాసుకుంటూ వెళ్లారు. ఆ లిస్ట్లో వరుసగా రైనా, గంభీర్, రోహిత్, షమి, రహానే, జడేజా, పుజారా, సాహా, భజ్జీ, నటరాజన్, ఉమేష్ యాదవ్ల పేర్లు ప్రస్తావించారు. తాజాగా కోహ్లీకి కూడా కూతురే పుట్టిందంటూ.. వీళ్లంతా భవిష్యత్తు మహిళల క్రికెట్ టీమ్ను తయారు చేస్తున్నారని అన్నారు. ధోనీ కూతురు ఈ టీమ్కు కెప్టెన్గా ఉంటుందేమో అని కామెంట్ చేశారు.
తమకంటూ కొంత ప్రైవసీ కావాలంటూ విరాట్, అనుష్కలు కోరుతున్నారు. తమ ఫొటోలు ఫర్వాలేదు కానీ.. పాపవి మాత్రం వద్దంటూ కోరారు. బుధవారం ముంబైలోని ఫొటో జర్నలిస్టులకు అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ఓ నోట్ పంపారు. ఇన్నేళ్లు మాపై మీరు చూపించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. పాప పుట్టిన ఆనందాన్ని మీ అందరితో పంచుకోవడం మరింత ఆనందంగా ఉందని తెలిపారు. బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా మేం ఫోటో జర్నలిస్టులను కోరేది ఒక్కటేనని.. తమ బిడ్డ ప్రైవసీని కాపాడాలని అనుకుంటూ ఉన్నామని అన్నారు. ఈ విషయంలో మీ మద్దతు, మీ సాయం మాకు కావాలని.. దయచేసి మా బిడ్డకు సంబంధించి ఏ ఫొటోనూ ప్రచురించొద్దని కోరారు. కావాలంటే మాకు సంబంధించిన వార్తలు, ఫొటోలు వేసుకోండి కానీ తమ కుమార్తె ఫోటోలను తీయకండని కోరారు. మేం ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నామో అర్థం చేసుకుంటారని.. మా విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటారని ఆశిస్తున్నామని ఫొటో జర్నలిస్టులను కోరింది ఈ జంట..!
ధోనీ ఫామ్ హౌస్లో హైదరాబాద్ కోళ్లు.. బర్డ్ ప్లూతో ఆర్టర్ క్యాన్సిల్
క్రికెట్ లోని మూడు ఫార్మాట్లనుంచి వైదొలిగిన మహేంద్ర సింగ్ ధోనీ క్షణం కూడా వృధా చేయకుండా ప్రైవేట్ బిజినెస్ వైపు మళ్లిన విషయం తెలిసిందే. సొంత ఫామ్ హౌస్లో కోళ్ల వ్యాపారం మొదలెట్టిన ధోనీ మంచి లాభాలు ఆర్జిస్తున్న సమయంలోనే బర్డ్ ఫ్లూ పులిమీద పుట్రలా వచ్చి పడింది. దీంతో మేలుజాతి కోళ్ల ఆర్డర్ను కూడా దోనీ రద్దు చేసుకోవలసి వచ్చింది.
క్రికెట్కు వీడ్కోలు పలికి, రాంచీలోని తన 43 ఎకరాల ఫాం హౌజ్లో ఆర్గానిక్ పౌల్ట్రీ పరిశ్రమను నెలకొల్సిన ధోని.. అత్యధిక పోషక విలువలు కలిగిన నల్ల (కడక్నాథ్) కోళ్ల పెంపకం చేపట్టారు. అలాగే హైదరాబాద్ ప్రాంతంలో లభ్యమయ్యే గ్రామప్రియ కోళ్ల పెంపకంపై కూడా ధోనీ దృష్టి సారించాడు
ఈ రకం కోళ్ల మాంసం ఆరోగ్య సంరక్షణలోనూ, సంతానోత్పత్తిని పెంపొందించడంలోనూ సత్ఫలితాల్నిస్తోందని సమాచారం.. కడక్నాథ్ చికెన్ ధర కేజీకి రూ. 900 నుంచి రూ. 1,200 వరకు ఉండగా, గ్రామప్రియ చికెన్ కూడా ఇంచుమించు అంతే ధర పలుకుతుంది. టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని ప్రారంభించిన కడక్నాథ్ కోళ్ల వ్యాపారానికి బర్డ్ఫ్లూ సెగ తగిలింది.
దేశంలో బర్డ్ఫ్లూ వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో ధోని ఆర్డర్ చేసిన రెండు వేల కడక్నాథ్ కోళ్లను, అంతే సంఖ్యలోని గ్రామప్రియ కోళ్ల ఆర్డర్ను రద్దు చేసుకున్నట్లు ధోని ఫాం హౌజ్ ప్రతినిధి పేర్కొన్నారు. ధోని ఆర్డర్ చేసిన కోళ్లు రవాణాకు సిద్దమైన తరుణంలో బర్డ్ఫ్లూ బారిన పడ్డాయని కోళ్ల పంపకందారుడు డాక్టర్ విశ్వరాజన్ దృవీకరించారు.
హైదరాబాద్ కోళ్లంటే దోనీకి మక్కువ..
మన దేశంలో కడక్నాథ్ చికెన్ పేరుతో పిలువబడే నల్లకోళ్ళను మధ్యప్రదేశ్లోని ఝబువా ప్రాంతం నుంచి గ్రామప్రియ కోళ్లను హైదరాబాద్ ప్రాంతం నుంచి దిగుమతి చేసుకుంటారు. అందుకే పేరు మోసిన కడక్ నాథ్ కోళ్లతోపాటు హైదరాబాద్ గ్రామప్రియ కోళ్లను కూడా ధోనీ ఆర్డర్ చేసి మరీ తెప్పించుకుంటున్నాడు.
మధ్యప్రదేశ్లో ఇప్పటికే బర్డ్ ఫ్లూ ప్రభావంతో 2,500 కడక్నాథ్ కోళ్లను చంపేశారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ నుంచి కడక్ నాథ్ కోళ్లు, హైదరాబాద్ నుంచి గ్రామప్రియ కోళ్లను కొనాలని ధోనీ కోసం చేసిన ఆర్డర్ని విధిలేక రద్దు చేసుకున్నట్లు ధోనీ ఫౌల్ట్రీ ఫామ్ డైరెక్టర్ వినోద్ మెహతా చెప్పారు. వ్యవసాయ క్షేత్రంలో మొత్త 2,850 కోళ్లను పెంచాలని ధోనీ నిర్ణయించుకున్నప్పటికీ బర్డ్ ఫ్లూ వల్ల ఇప్పుడు ఫామో హౌస్లో 150 కోళ్లు మాత్రమే ఉన్నాయని మెహతా చెప్పారు.
కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతున్న తరుణంలో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా(బర్డ్ఫ్లూ) అనే వైరస్.. దేశంలో శరవేగంగా వ్యాపిస్తూ వేలసంఖ్యలో పక్షి జాతుల మనుగడను ప్రశ్నార్ధకంగా మారుస్తోంది. లక్షలాది పక్షుల ప్రాణాలను హరిస్తున్న ఈ వైరస్ దేశంలోని పది రాష్ట్రాలకు వ్యాపించింది. ముఖ్యంగా దీని ప్రభావం మధ్యప్రదేశ్, కేరళ, రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.
క్రికెట్ను చంపేశాడు.. కేంద్రమంత్రి వ్యాఖ్యలకు విహారి క్లాస్
అసాధ్యాన్ని సుసాధ్యం చేసి దుర్బేధ్యమైన ఆసీస్ బౌలింగ్ త్రయాన్ని ఎదిరించి గాయాలను కూడా లెక్క చేయకుండా సిడ్నీ టెస్టులో జట్టు ప్రయోజనాల కోసం హనుమ విహారి చూపిన పట్టుదల, మొక్కవోని స్థైర్యానికి యావద్దేశం నీరాజనాలు అర్పిస్తుండగా కేంద్రమంత్రి విహారిపై తీవ్ర వ్యాఖ్యలు చేసి నెటిజన్ల చేతిలో పడ్డారు.
భారత్, ఆసీస్ మధ్య సిడ్నీలో జరిగిన మూడో టెస్టులో ఒకవైపు కండరాలు పట్టేసినప్పటికీ పంటిబిగువన నొప్పిని భరిస్తూ 161 బంతులను అడ్డుకున్న హనుమ విహారిపై యావత్ క్రికెట్ ప్రపంచం ప్రశంసల వర్షం కురిపించింది. కానీ కేంద్ర పర్యావరణశాఖ మంత్రి, మాజీ గాయకుడు బాబుల్ సుప్రియో మాత్రం భారత జట్టుకు విజయావకాశాలు దక్కనీయకుండా విహారి నేరం చేశాడని ఆరోపిస్తూ తీవ్ర వ్యాఖ్య చేశాడు.
109 బంతులాడి చేసింది 7 పరుగులు. ఇంతకంటే దారుణం ఉండదు. హనుమ బిహారి (తప్పుగా) భారత్ చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకోవడాన్ని మాత్రమే నాశనం చేయలేదు.. క్రికెట్ను కూడా ఖూనీ చేశాడు అంటూ మంత్రి ట్వీట్ చేశాడు. దీనిపైనే ట్విట్టర్లో తీవ్రమైన విమర్శలు వచ్చాయి. సుప్రియో అజ్ఞానాన్ని నెటిజన్లు తిట్టిపోశారు. అయితే విహారి దీనికి ఒకే ఒక పదంతో సమాధానం ఇచ్చాడు. ఇది బుధవారం సోషల్ మీడియాలో హోరెత్తిపోయింది.
కేంద్ర మంత్రి తన పేరును హనుమ బిహారి అని తప్పుగా రాయడాన్ని విహారి చూపిస్తూ తన పేరు హనుమ విహారి అని స్వయంగా ట్వీట్ చేశాడు. దీనికి సుమారుగా 64 వేల లైక్లు వచ్చాయి.
మరోవైపున విహారితోపాటు మూడో టెస్టు డ్రా కావడంలో కీలక పాత్ర పోషించిన భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం మంత్రి వ్యాఖ్యకు పడిపడి నవ్వుతున్నట్లు ట్వీట్ చేసాఢు. దీనికి కూడా 80 వేల లైకులు రావడం విశేషం.
ఇక టీమిండియా మాజీ డ్యాషింగ్ బ్యాట్స్మన్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా విహారి ఏకవాక్య స్పందనను మెచ్చుకున్నాడు. ఒక్క విహారి అందరి లెక్క సరి చేశాడు అంటూ సెహ్వాగ్ చేసిన వ్యాఖ్య కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది.
తనకు క్రికెట్పై ఎలాంటి అవగాహన లేదంటూనే.. ఆ మ్యాచ్లో విహారి దారుణంగా ఆడాడంటూ మంత్రి బాబుల్ చేసిన విమర్శనాత్మక ట్వీట్పై నెటిజన్లు ఆడేసుకుంటున్నారు.
మా బిడ్డకు ప్రైవసీ ఇవ్వండి.. అర్థం చేసుకోండి అంటున్న విరాట్-అనుష్క
భారతదేశంలో సెలెబ్రిటీలను కెమెరా కన్నులు ఎంతగా వెంటాడుతూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా క్రికెటర్లు, సినిమా స్టార్స్ ను వెంటపడుతూ.. వెంటపడుతూ.. ఫోటోలు తీస్తూ ఉంటారు. ఇంటి నుండి బయటకు వచ్చినా, ఎయిర్ పోర్టులో కనిపించినా.. ఎక్కడికైనా కార్ లో వెల్తూ ఉన్నా.. ఇలా పలువురు ప్రముఖులను ఫోటోలు తీయడమే కొందరి పని. ఇలా ప్రతి ఒక్కటీ కెమెరాలో బంధిస్తూ ఉంటే.. ఏ సెలెబ్రిటీకి అయినా కోపం వస్తుంది. కొందరు వద్దని వారిస్తూ ఉంటారు. ఇంకొందరు మాత్రం ఏదీ పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు.
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, హీరోయిన్ అనుష్క శర్మ దంపతులకు ఇటీవలి కాలంలో ప్రైవసీ అన్నది లేకుండా పోయింది. ఎక్కడో కూర్చొని ఉన్నా కూడా కెమెరాలలో ఈ జంటను బంధించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అనుష్క గర్భవతిగా ఉన్న సమయంలో కూడా చాలా మంది ఫోటో జర్నలిస్టులు వారి అనుమతి లేకుండా ఫోటోలను తీశారు.
సోమవారం అనుష్క శర్మ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు పుత్రికోత్సాహంలో ఉన్నారు. తమకంటూ కొంత ప్రైవసీ కావాలంటూ విరాట్, అనుష్కలు కోరుతున్నారు. తమ ఫొటోలు ఫర్వాలేదు కానీ.. పాపవి మాత్రం వద్దంటూ కోరారు. బుధవారం ముంబైలోని ఫొటో జర్నలిస్టులకు అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ఓ నోట్ పంపారు. ఇన్నేళ్లు మాపై మీరు చూపించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. పాప పుట్టిన ఆనందాన్ని మీ అందరితో పంచుకోవడం మరింత ఆనందంగా ఉందని తెలిపారు. బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా మేం ఫోటో జర్నలిస్టులను కోరేది ఒక్కటేనని.. తమ బిడ్డ ప్రైవసీని కాపాడాలని అనుకుంటూ ఉన్నామని అన్నారు.
ఈ విషయంలో మీ మద్దతు, మీ సాయం మాకు కావాలని.. దయచేసి మా బిడ్డకు సంబంధించి ఏ ఫొటోనూ ప్రచురించొద్దని కోరారు. కావాలంటే మాకు సంబంధించిన వార్తలు, ఫొటోలు వేసుకోండి కానీ తమ కుమార్తె ఫోటోలను తీయకండని కోరారు. మేం ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నామో అర్థం చేసుకుంటారని.. మా విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటారని ఆశిస్తున్నామని ఫొటో జర్నలిస్టులను కోరింది ఈ జంట..! వీరి విజ్ఞప్తిని మీడియా మన్నిస్తుందో లేక ఎప్పటి లాగే కెమెరాలు వారిని చుట్టుముడతాయో కాలమే నిర్ణయిస్తుంది. విరాట్-అనుష్క దంపతుల బిడ్డ ఎలా ఉందో అనే కుతూహలం చాలా మందిని వెంటాడుతూ ఉంది.
అశ్విన్పై వ్యాఖ్యలతో సిగ్గుపడుతున్నా.. అసీస్ కెప్టెన్ పశ్చాత్తాపం
సిడ్నీ టెస్టులో టీమిండియాతో జరిగిన చివరి రోజు ఆటలో టీమిండియా స్నిన్నర్ రవిచంద్రన్ అశ్విన్పై తాను చేసిన వ్యాఖ్యలకు నిజంగానే సిగ్గుపడు తున్నానని ఆసీస్ క్రికెట్ జట్టు కెప్టెన్ టిమ్ పైన్ విచారం వ్యక్తపరిచాడు. ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ భారత్ బౌలర్ అశ్విన్పై చేసిన వ్యాఖ్యలపై క్రికెట్లో అన్నివైపుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో తన ప్రవర్తన పట్ల టిమ్ పైన్ క్షమాపణ చెప్పుకున్నాడు. భారత స్పిన్నర్ అశ్విన్పై తాను చేసిన వ్యాఖ్యల పట్ల సిగ్గుపడుతున్నట్లు పేర్కొన్నాడు.
మైదానంలో స్టంప్మైక్ ఉంటుందన్న విషయం తెలిసి కూడా దురదృష్టవశాత్తూ నా మాటలతో తప్పుడు సంకేతాలిచ్చాను. అది తెలిసి చాలా బాధపడ్డాను. ఆటలో జాగ్రత్తగా ఉండాలని నిన్న జరిగిన చర్యతో తెలుసుకున్నాడు. భవిష్యత్తులో ఇలా జరగకుండా మంచి పేరు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తాను.. అశ్విన్తో అలా ప్రవర్తించి ఉండకూడదు.. నా చర్యకు సిగ్గుపడుతున్నానని పైన్ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.
సిడ్నీ టెస్టు ముగిసిన వెంటనే రవిచంద్రన్ అశ్విన్తో తాను మాట్లాడానని, జరిగింది మర్చిపోయి ఇద్దరమూ హాయిగా నవ్వుకున్నామని పైన్ చెప్పాడు. నీతో గొడవ పెట్టుకుని మూర్ఖుడిలా వ్యవహరించాను అని అశ్విన్తో చెప్పానన్నాడు. టీమ్ను నేను నడిపిన తీరు ఎలా ఉన్నా సరే..మూడోటెస్టు చివరి రోజు నా ప్రవర్తనను నిజంగానే సమర్థించుకోలేనని పైన్ చెప్పాడు.
నా నాయకత్వ పటిమ సరిపోలేదు. మూడో టెస్టులో ఆట కలిగించిన ఒత్తిడి నాపై ప్రభావం చూపింది. నా మూడ్నే అది ప్రభావం కలిగించింది. అది నా ఆటతీరును దెబ్బతీసింది. నాయకుడిగా పేలవమైన ఆట ప్రదర్సించానని టీమ్ ప్లెయర్లతో కూడా చెప్పాను. నా టీమ్ను నేను సిగ్గుపడేలా చేశాను అని పైన్ చెప్పాడు.
సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ ఓటమి నుంచి గట్టెక్కిన విషయం తెలిసిందే. హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ నిలకడైన బ్యాటింగ్తో మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. అయితే ఈ ఇద్దరి బ్యాటింగ్కు విసిగిపోయిన పైన్.. స్లెడ్జింగ్కు పాల్పడ్డాడు.
కాగా ఆటలో భాగంగా మూడోరోజు కూడా పైన్ పుజారా ఔట్ విషయంలోనూ ఫీల్డ్ అంపైర్ విల్సన్పై మండిపడిన విషయం తెలిసిందే. అంపైర్పై ఆగ్రహం వ్యక్తం చేసినందుకు పైన్పై ఐసీసీ నిబంధన 2.8 ప్రకారం మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించడంతో పాటు ఒక డీ మెరిట్ పాయింట్ కేటాయించారు.
ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానన్న వీరూ..!
భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా టూర్ లో అడుగుపెట్టినప్పటి నుండి గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది ఆటగాళ్లు టోర్నమెంట్ నుండి వైదొలిగారు. మూడో టెస్ట్ తర్వాత ఏకంగా నలుగురు భారత ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు. దీంతో ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో భారతజట్టుకు 11 మంది కూడా లేని పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఆస్ట్రేలియా సిరీస్ కు తాను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు వీరేందర్ సెహ్వాగ్ సరదాగా చెప్పుకొచ్చాడు.
'టీమిండియా గాయాలతో సతమతమవడం నేను చూడలేకపోతున్నా. షమీ, ఉమేశ్, రాహుల్, జడేజా, విహారి, బుమ్రా ఇలా ఒకరి తర్వాత ఒకరు గాయపడడంతో సగం జట్టు ఖాళీ అయింది. ఒకవేళ 11 మందిలో ఇంకా ఎవరు ఫిట్గా లేకున్నా వారి స్థానంలో నేను ఆడేందుకు సిద్ధంగా ఉన్నా..ఇప్పుడే ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కేందుకు నేను సిద్దం.. కానీ బీసీసీఐ నిబంధనల ప్రకారం క్వారంటైన్లో ఉండాల్సి వస్తుందేమో' అని వీరూ ట్వీట్ చేశాడు.
వీరూ ట్వీట్ చేయడానికి కారణం కూడా పెద్దదే.. ఎందుకంటే వరుసగా ఆటగాళ్లు గాయాల బారిన పడుతూనే ఉన్నారు. ప్రధాన బౌలర్ బుమ్రా, మయాంక్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో ఆడడం అనుమానమే. హనుమ విహారి కూడా గాయపడ్డాడు. చెత్త ఫామ్ లో ఉన్న పృథ్వీషాకు తర్వాతి మ్యాచ్ లో భారత్ మరో అవకాశం ఇవ్వనుంది. ఇక కుల్ దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ ను టెస్ట్ మ్యాచ్ ఆడించాల్సి వచ్చింది. రెండు టెస్ట్ మ్యాచ్ ల అనుభవం మాత్రమే ఉన్న సిరాజ్ పేస్ బౌలింగ్ కు సారథ్యం వహించాల్సి వస్తోంది. ఒకే మ్యాచ్ అనుభవమున్న సైనీ అతడికి తోడుగా ఉండనున్నాడు. మూడో పేస్ బౌలర్ కావాలంటే నటరాజన్ కు తప్పకుండా అవకాశం దక్కనుంది.
ఈ సిరీస్ ఎంతో అద్భుతంగా సాగుతోంది. ఇప్పటికే వన్డే సిరీస్ ను ఆసీస్ జట్టు, టీ-20 సిరీస్ ను ఇండియా గెలుచుకున్నాయి. అత్యంత కీలకమైన టెస్ట్ సిరీస్ లో మూడు మ్యాచ్ లు ముగియగా, చెరో మ్యాచ్ ని రెండు జట్లూ గెలుచుకుని, ఒక మ్యాచ్ ని డ్రాగా ముగించాయి. దీంతో 1-1 తో ప్రస్తుతానికి సిరీస్ సమంగా ఉంది. ఇక నాలుగో మ్యాచ్ 15వ తేదీన బ్రిస్బేన్ లో జరుగనుంది. భారత్ ఆడించే 11 మంది ఆటగాళ్ల విషయంలో ఎంతో ఆసక్తి నెలకొంది.
నేను తప్పు చేయలేదు అంటున్న స్టీవ్ స్మిత్
మూడో టెస్టులో చివరి రోజు రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో టీమ్ఇండియా విజయం సాధించేలా కనిపించింది. దీంతో మరో ఓటమి తప్పదని బావించిన ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ క్రీజ్ దగ్గర బ్యాటింగ్ గార్డ్ మార్క్ను మారుస్తూ కనబడ్డాడు అంటూ.. పలువురు స్టీవ్ స్మిత్ మీద ఆరోపణలు గుప్పించారు. మూడో టెస్టులో రిషబ్ పంత్ బ్యాటింగ్ చేసే సమయంలో గార్డ్ మార్క్లను స్టీవ్ స్మిత్ పలుమార్లు మార్చేశాడు. డ్రింక్స్ బ్రేక్లో పంత్ గార్డ్ను కావాలని చెరిపేస్తూ.. స్టంప్స్ కెమెరాకు అడ్డంగా దొరికిపోయాడు. తన గార్డ్ చెరిపేయడంతో పంత్ మరోసారి మార్క్ చేసుకోవాల్సి వచ్చింది.
ఛీటింగ్ చేశావంటూ తనపై వస్తున్న విమర్శలపై స్టీవ్ స్మిత్ స్పందించాడు. ఇందులో ఎలాంటి వివాదమే లేదని.. నేను బౌలర్ల కోసం ఇలా చేస్తూనే ఉంటానని స్టీవ్ స్మిత్ వెల్లడించాడు. ఈ ఆరోపణలతో నిర్ఘాంతపోయానని అన్నాడు స్టీవ్ స్మిత్. చాలా నిరాశ చెందానని వెల్లడించాడు. పిచ్ వద్దకు వెళ్లి మా బౌలర్లు ఎక్కడ బంతులు వేస్తున్నారు. ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ఎలా ఆడుతున్నారు అనేది అక్కడ నిలబడి ఒక దృశ్యాన్ని నా మదిలో ఊహించుకుంటానని.. మిడిల్ స్టంప్కు అనుగుణంగా ఒక మార్కింగ్ కూడా చేసుకోవడం తనకు అలవాటని చెప్పుకొచ్చాడు స్మిత్. తాను కావాలని చేయలేదని.. భారత జట్టు అద్భుత ప్రదర్శన కాకుండా ఇలాంటి విషయాలకు ఎక్కువగా చర్చించడం సిగ్గు పడాల్సిన అంశమని స్మిత్ తెలిపాడు.
మరో వైపు ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ కూడా భారత ఆటగాళ్లకు క్షమాపణ చెప్పాడు. తన నోటికి పని చెప్పిన పైన్.. ఫీల్డ్ లో చాలా ఓవరాక్షన్ చేశాడు. అందుకే క్షమాపణలు చెప్పుకొచ్చాడు పైన్. నేనో మనిషిని, నేను చేసిన తప్పులకు క్షమాపణ చెప్పాలని అనుకుంటున్నా.. ఆస్ట్రేలియా టీమ్ను లీడ్ చేయడాన్ని నేను ఎప్పుడూ గర్వంగా ఫీలవుతాను.. కానీ సిడ్నీ టెస్ట్ చివరి రోజు మాత్రం అలా జరగలేదని అన్నాడు. టీమ్ను సరిగా లీడ్ చేయలేకపోయానని.. మ్యాచ్ తాలూకు ఒత్తిడిని అధిగమించలేపోయానని అన్నాడు. అది నా ఆటపై ప్రభావం చూపిందని.. లీడర్గా ఇది నాకు దారుణమైన మ్యాచ్ అని నా టీమ్ మేట్స్తో చెప్పానని పైన్ వెల్లడించాడు. ఐదో రోజు ఆట ముగిసిన తర్వాత కూడా అశ్విన్తో తాను మాట్లాడినట్లు తెలిపాడు. నేనో ఫూల్గా వ్యవహరించాను కదా అని అశ్విన్తో తాను చెప్పానని పైన్ వెల్లడించాడు.
వెంటాడుతున్న గాయాలు.. మరో ఇద్దరు ఆటగాళ్లు సిరీస్ నుండి అవుట్
భారత క్రికెట్ జట్టును గాయాలు వెంటాడుతూ ఉన్నాయి. ఆస్ట్రేలియా సిరీస్ లో ఇప్పటికే పలువురు స్టార్స్ గాయాల బారిన పడి సిరీస్ కు దూరమవ్వగా.. మరో ఇద్దరు ఆటగాళ్లు మూడో టెస్ట్ తర్వాత భారతజట్టును వీడనున్నారు. చేతి వేలికి గాయం కారణంగా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా నాలుగో టెస్టుకు దూరమవ్వగా.. నాలుగో టెస్టులో హనుమ విహారి కూడా ఆడడం లేదు. తొడ కండరాల గాయంతో ఆస్ట్రేలియాతో ఈనెల 15 నుంచి బ్రిస్బేన్లో జరిగే ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో హనుమ విహారి ఆడడం కష్టమే. సిడ్నీలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ చివరి రోజు ఆటలో హనుమ విహారి, అశ్విన్ పూర్తిగా డిఫెన్స్ ఆడి మ్యాచ్ ను డ్రాగా ముగిసేలా చేయడం చాలా స్పెషల్. ఆ సమయంలోనే అతనికి గాయమైంది. టెస్టు ముగిశాక హనుమ విహారికి స్కానింగ్ చేసి, విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఇంగ్లండ్తో త్వరలో జరిగే సిరీస్కూ అతను దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
హనుమ విహారి మూడో టెస్ట్ మ్యాచ్ లో ఆడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఎంతో మంది విహారిని ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు. 407 పరుగుల ఛేదనలో టీమిండియా 250/4తో నిలిచిన దశలో క్రీజులోకి వచ్చిన హనుమ విహారి (23 నాటౌట్: 161 బంతుల్లో 4x4) చివరి వరకూ సహనంతో బ్యాటింగ్ చేశాడు. తొడ కండరాల గాయం వేధించినా, ఆస్ట్రేలియా ఫీల్డర్లు పదే పదే స్లెడ్జింగ్ కూడా చేశారు. అశ్విన్ (39 నాటౌట్: 128 బంతుల్లో 7x4)తో కలిసి దాదాపు మూడు గంటలకిపైగా క్రీజులో నిలిచిన హనుమ విహారి గొప్ప పోరాటాన్ని చేశాడు.
తొలి ఇన్నింగ్స్లో 38 బంతులాడిన హనుమ విహారి లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ 4 పరుగుల వద్ద రనౌటయ్యాడు. రెండో ఇన్నింగ్స్లో మాత్రం అతడు అద్భుతమైన డిఫెన్స్ చూపించాడు. ఒకవేళ హనుమ విహారి కాస్త దూకుడుగా ఆడి ఔటై ఉండింటే..? ఆ తర్వాత మిగిలిన నాలుగు వికెట్లని తీయడం ఆస్ట్రేలియా బౌలర్లకి పెద్ద కష్టం కాకపోవచ్చని పలువురు నమ్మారు. జడేజా బొటనవేలికి గాయం కావడంతో అతన్ని ఆసీస్ బౌలర్లు అవుట్ చేయొచ్చు అని భావించారు. ఆ తర్వాత బుమ్రా, సిరాజ్, సైనీలను ఆసీస్ పేస్ అటాక్ వీలైనంత తొందరగా అవుట్ చేసేస్తుంది. కాబట్టి విహారి, అశ్విన్ ఆడిన ఆట టెస్ట్ మ్యాచ్ లలో ఉన్న మజాను మనకు చూపిస్తుంది. విహారి ఇన్నింగ్స్ సెంచరీకి ఏ మాత్రం తక్కువ కాదని పలువురు క్రికెట్ లెజెండ్స్ అభిప్రాయపడ్డారు.
అశ్విన్.. అంత నొప్పిని భరిస్తూ ఎలా ఉండగలిగావయ్యా..!
భారత క్రికెట్ జట్టు చేసుకున్న అద్భుతమైన డ్రాలలో సిడ్నీ టెస్ట్ మ్యాచ్ కూడా ఒకటి. ఎందుకంటే భారతజట్టులోని ఆటగాళ్లు గాయాల బాధలో ఉన్నా కూడా టెస్ట్ మ్యాచ్ ను డ్రా చేస్తూ అనుకున్నది సాధించారు. ముఖ్యంగా పంత్ ఆడుతున్న సేపు భారత్ విజయానికి దగ్గరగా వెళుతోంది అని అనిపించింది. పుజారా అవుట్ అయ్యాక మ్యాచ్ ఆసీస్ చేతుల్లోకి వెళ్ళింది. కానీ భారత్ ఈ మ్యాచ్ ను డ్రా చేయడానికి సర్వ శక్తులను సన్నద్ధం చేసుకుంది. అశ్విన్-హనుమ విహారి జోడీ అద్భుతంగా ఆడారు. తమకు ఏమైనా పర్వాలేదు. మ్యాచ్ ను డ్రా చేయాలి అని అనుకున్నారు. వీరిద్దరిలో ఎవరైనా అవుట్ అయితే.. రవీంద్ర జడేజా బ్యాటింగ్ కు రావాల్సిన తరుణం.. జడ్డూ వేలుకి ఫ్రాక్చర్ అవ్వడంతో అందరిలోనూ ఒకటే టెన్షన్. కానీ అశ్విన్-హనుమ విహారి జోడీ ఆసీస్ పేస్ అటాక్ నుండి కఠినమైన పరీక్షను ఎదుర్కొన్నారు. బాడీ మీదకు బంతులు వస్తున్నా వాటిని కూడా తగిలించుకున్నారు. సెషన్ మొత్తం ఆడాలి.. ఒక్క వికెట్ కూడా పడనివ్వకూడదు. అలానే ఆడారు.. అనుకున్నది సాధించారు. ఆసీస్ ఫీల్డర్లు కవ్విస్తున్నా పట్టించుకోలేదు.. బంతులు శరీరం మీదకు కావాలనే విసురుతున్నా పట్టించుకోవట్లేదు.. అలా ఆడుతూ సాగిపోయింది ఈ జోడీ..! అశ్విన్ 128 బంతులాడి 39 పరుగులు చేశాడు. తెలుగు తేజం హనుమ విహారి (161 బంతుల్లో 23 పరుగులు)తో కలిసి అజేయ భాగస్వామ్యంతో డ్రాగా ముగించారు.
ఇక అశ్విన్ మరీ కంప్లీట్ బ్యాట్స్మెన్ కాకపోయినా ఆసీస్ బౌలర్లను ఎదుర్కొన్న తీరు ప్రశంసనీయం. స్పిన్నర్ లయన్ ను అద్భుతంగా కట్టడి చేశాడు అశ్విన్. అతడి బౌలింగ్ లో అశ్విన్ డిఫెన్స్ సూపర్ అనే చెప్పొచ్చు. ఇక అశ్విన్ గురించి ఆయన భార్య ప్రీతి ఆసక్తికర అంశం వెల్లడించింది. రెండో ఇన్నింగ్స్ ముందు అశ్విన్ తీవ్ర వెన్నునొప్పితో బాధపడ్డాడని, ఇవాళ ఉదయం నిటారుగా నిలబడలేకపోయాడని తెలిపింది. కనీసం కిందకు వంగి షూ లేసులు కూడా కట్టుకోలేకపోయాడని, అలాంటివాడు సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ ను డ్రా దిశగా మళ్లించాడంటే నమ్మశక్యం కావడం లేదని తెలిపింది. ఈ విషయం తెలిసి అభిమానులు కూడా షాక్ అవుతూ ఉన్నారు. 256 బంతులు ఎదుర్కొని 62 పరుగులు చేసి భారత్ ను గట్టెక్కించిన విహారి, అశ్విన్ జోడీపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
అడ్డుగోడలా అశ్విన్, విహారి.. మూడో టెస్టులో చారిత్రాత్మక డ్రా
భారత్, ఆస్ట్రేలియా మధ్య సిడ్నీలో జరిగిన మూడో టెస్టు చారిత్రాత్మక డ్రాగా ముగిసింది. ఎనిమిది వికెట్లు మిగిలి 97 ఓవర్లు పూర్తి ఆటకు సిద్ధమైన భారత్ జట్టు ఛేదనలో తనపై ఉన్న అన్ని రకాల అపప్రథలను తోసిరాజంటూ నిలబడి ఓటమి తప్పదనుకున్న చోటే నిలబడి గెలిచింది. గెలుపు అంటే విజయం కాదు. కానీ దుర్భేద్యమైన ఆసీస్ బౌలింగ్ను ఒక రోజు పొడవునా నిలవరించి అడ్డుకోవడం ఏ రకంగా చూసినా విజయంతో సమానమే. పైగా చివర్లో అశ్విన్, విహారి నిజమైన అడ్డుగోడల్లాగా నిలిచి భారత్కు చారిత్రాత్మక డ్రాను అందించండంలో చిరస్మరణీయమైన పాత్ర పోషించారు.
అసాధ్యమనుకున్న 407 పరుగుల ఛేదనను ఆదివారం నాలుగోరోజు సాయంత్రం ధీటుగానే ఎదుర్కొన్న భారత్ సోమవారం నిజంగానే విశ్వరూపం చూపింది. రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేయడమే ఒక గొప్పకాగా ఆసీస్ ఎలా ఆటను తన్నుకుని పోతుందో చూద్దామన్న కసితో టీమిండియా మొత్తంగా బాధ్యతగా ఆడింది. ఆదివారం రిషభ్ పంత్ 97 పరుగులతో ఆసీస్ బౌలింగ్ను ఆడుకోగా రెండో వాల్గా పేరొందిన చటేశ్వర్ పుజారా 77 పరుగులు, రోహిత్ శర్మ 52 పరుగులు, అశ్విన్ 39 పరుగులు, విహారి 23 పరుగులు సాధించి ఆటను నిలబెట్టారు. ఓటమి తప్పదనుకున్న చోట కలకాలం గుర్తుంచుకునేలా మూడోటెస్టును డ్రాగా ముగించి విజయనాదం చేశారు.
దీంతో తొలి ఇన్నింగ్స్లో 338 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసి ఆటను డిక్లేర్ చేసిన ఆసీస్ జట్టు ఒకటిన్నర రోజు ఆట మిగిలివుంది కాబట్టి విజయం నల్లేరు బండిపై నడకే అనుకుంది. కాని అయిదోరోజు ఉదయం చటేశ్వర్ పుజారా, రిషభ్ పంత్ సెంచరీ పరుగుల స్టాండ్తో భారత్ను గెలుపుతీరాలను చేరువగా తీసుకొచ్చారు కానీ, సోమవారం ఆట మొత్తంలో రవిచంద్రన్ అశ్విన్, హనమ విహారిలను ఎంత ప్రశంసించినా తక్కువే అవుతుంది. ఇంకా 40 ఓవర్ల పైబడిన ఆట మిగిలి వున్న తరుణంలో, ఆసీస్ బౌలర్లు రెండో కొత్త బాల్ తీసుకున్న ప్రమాదకర క్షణాల్లో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటూనే, ఆసీస్ బౌలర్ల బంతి గాయాలను తట్టుకుంటూనే చివరివరకూ నిలిచి భారత్ను ఓటమినుంచి తప్పించారు.
చివరి రెండు సెషన్లలో ఆసీస్ బౌలర్లు ఎంతగా తేలిపోయారంటే 40 ఓవర్లపైగా బౌలింగ్ చేసి కూడా ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. స్పిన్నర్ నాథన్ లియోన్ 46 ఓవర్లు నిరవధికంగా బౌల్ చేశాడు. పాట్ కమ్మిన్స్ రోజంతా పిచ్పై ఆడుకున్నాడు. జోష్ హజిల్ వుడ్ రివర్స్ స్వింగ్తో భయపెట్టాడు. కానీ ఈ ముప్పేట దాడికి ఎదురొడ్డి నిలిచిన అశ్విన్, విహారి జంట అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. గాయంతో పరుగెత్తలేకపోయిన విహారి మూడుగంటలపైగా బ్యాటింగ్ చేసి 161 బంతుల్లో 23 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక అశ్విన్ తన అనుభవాన్నంతటినీ రంగరించిపోసి 128 బంతుల్లో 39 పరుగులు చేసి ఆటను నిలబెట్టాడు. ఆసీస్ కెప్టెన్ జారవిడిచిన మూడు క్యాచ్లతో సహా చివరి రోజు నాలుగు క్యాచ్లను ఆసీస్ జట్టు మిస్ చేసినందుకు ఫలితం అనుభవించింది.
ఈ క్రమంలో నాలుగో ఇన్నింగ్స్లో మూడో అతిపెద్ద ఆరవ వికెట్కు స్టాండ్కు గాను రికార్డు సృష్టించింది. కాగా 1979 తర్వాత నాలుగో ఇన్నింగ్స్లో 132 ఓవర్లు చేసి ఔట్ కాకుండా నిలబడటం భారత జట్టు ఇదే మొదటిసారి,.
అంతకుముందు పుజారా తోడుగా దాడి మొదలెట్టిన రిషభ్ పంత్ ఆసీస్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. వీరిద్దరి మధ్య 148 పరుగుల భాగస్వామ్యం ఆటను ఒక్కసారిగా భారత్ వైపు తీసుకొచ్చింది. అజింక్యా రహానే స్వల్ప పరుగులకే నాథన్ బౌలింగులో ఔట్ కావడంతో దాడే ఫరిష్కారం అనేలా భారత జట్టు రిషభ్ను అయిదో స్థానంలో దింపిదంది. సరిగ్గా తన లక్ష్యాని నాథన్పై గురిపెట్టడం ద్వారా ప్రారంభించిన రిషభ్ మర్చిపోలేని ఆటను ప్రదర్సించాడు. దీంతో ఆసీస్ బౌలర్లను మార్చి మార్చి ఆడినా సరే చివరి 40 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా చేజిక్కించుకోలేకపోయింది. 3 వికెట్ల నష్టానికి 102 పరుగుల వద్ద మైదానంలోకి వచ్చిన పంత్ తొలి 33 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేసి నెమ్మదైన ఆటను ప్రదర్సించాడు. అప్పటికే మోచేతికి గాయమైన పంత్ అయిదో రోజు ఆటలోనూ కమ్మిన్స్ బౌలింగ్లో పలుసార్లు బంతి శరీరానికి తగిలి ఇబ్బందిపడ్డాడు. జట్టును నిలబెట్టి డ్రాగా ముగించడంలో రిషభ్ పంత్కి కీలకపాత్ర.
ఇకపోతే టెస్టుల్లో 27వ అర్ధ సెంచరీని సాధించి పుజారా ఇంతవరకు టెస్టు ఫార్మాట్లో 6 వేల పరుగులు పూర్తి చేసి రికార్డు సృష్టించారు. కొత్త బంతి తీసుకున్న తర్వాత కూడా పాట్ కమ్మిన్స్ బౌలింగులో పంత్ లాగే వరుసగా మూడు ఫోర్లు బాదిన పుజారా జట్టు అవసరాలకు అనుగుణంగా నూటికి నూరుపాళ్లు ఉత్తమ ఆట ప్రదర్శించాడు.
శుభవార్త చెప్పిన విరుష్క జంట..!
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తండ్రయ్యాడు. తన భార్య పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిందని సామాజిక మాధ్యమాల్లో కోహ్లీ తెలిపాడు. తమకు కుమార్తె పుట్టిందని కోహ్లీ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ‘ఈ వార్తను మీతో పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ రోజు మధ్యాహ్నం మాకు కుమార్తె జన్మించింది. మీ అందరి ప్రేమ, ప్రార్థనలు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు. తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ఇక మా జీవితంలో నూతన అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ఈ సమయంలో మా ప్రైవసీకి భంగం కలిగించరని ఆశిస్తూ ప్రేమతో మీ కోహ్లీ’ అంటూ ట్వీట్ చేశాడు.
విరాట్ కోహ్లీ ఆసీస్ తో సిరీస్ నుండి పెటర్నిటీ సెలవులపై స్వదేశానికి వచ్చిన సంగతి తెలిసిందే. తన భార్య ప్రసవించే సమయంలో తన దగ్గరే ఉండాలని వన్డే, టీ20 సిరీస్ తర్వాత, మొదటి టెస్ట్ మ్యాచ్ అనంతరం తిరిగి భారత్ కు వచ్చేశాడు. విరుష్క జంటకు కుమార్తె పుట్టింది అని తెలియగానే పలువురు శుభాకాంక్షలు చెబుతూ ఉన్నారు.
బ్రిస్బేన్లో టెస్టు ఆడతాం కానీ.. బీసీసీఐ మెలిక
భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు వేదిక విషయంలో గత మూడు రోజులుగా సాగుతూ వచ్చిన సందిగ్ధత వీడింది. బ్రిస్బేన్లో ఈ మ్యాచ్ ఆడేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు బీసీసీఐ సమాచారం అందించింది. అయితే మ్యాచ్ ముగిశాక ఒక్క రోజు కూడా తాము అక్కడ ఉండబోమని, వెంటనే భారత్కు వెళ్లిపోయే ఏర్పాట్లు చేయాలని కోరింది.
చివరి టెస్టు ముగిసిన వెంటనే భారత్కు తిరిగి వెళ్లే ఏర్పాట్లు చేయమని వారిని కోరాం. అందుబాటులో ఉన్న మొదటి ఫ్లయిట్లోనే పంపిస్తే మంచిది. వీలుంటే మ్యాచ్ ముగిసిన రాత్రి కూడా అక్కడ ఆగకుండా బయల్దేరాలని భావిస్తున్నాం అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.
మరోవైపు స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగే సిరీస్లో ప్రేక్షకులను అనుమతించడం లేదని భారతక్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. కఠిన బయో బబుల్ వాతావరణంలో క్రికెటర్లు ఉండబోతున్నారని, ఇలాంటి స్థితిలో తాము రిస్క్ తీసుకోలేం కాబట్టి అభిమానులను ఒక్క మ్యాచ్కూ అనుమతించమని వెల్లడించింది.
కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో బ్రిస్బేన్లో నాలుగో టెస్టు ముగిసిన వెంటనే అఘమేఘాలమీద బారత జట్టును స్వదేశం పంపే ఏర్పాటుకు హామీ ఇవ్వాలని బీసీసీఐ క్రికెట్ ఆస్ట్రేలియాను కోరింది. ఆట ముగిసిన మరుక్షణమే భారత ఆటగాళ్లు స్వదేశానికి బయలు దేరుతారు. వీలయితే రాత్రిపూట కూడా అక్కడ ఉండకుండా మావాళ్లు బయలుదేరతారు అని బీసీసీఐ స్పష్టం చేసింది.
బ్రిస్బేన్లో నాలుగో టెస్టు ఆడటానికి కానీ, అక్కడ కరోనా నేపథ్యంలో ఆరోగ్యపరమైన ప్రోటోకాల్ పాటించడాన్ని కానీ మేము ఎన్నడూ అభ్యంతరపెట్టలేదు. నాలుగో టెస్టు కచ్చితంగా జరుగుతుంది క్రికెట్ ఆస్ట్రేలియా స్థానిక ప్రభుత్వంతో విధివిధానాల గురించి చర్చిస్తోంది. క్వీన్స్లాండ్లో మూడురోజుల పాటు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఆట సాధ్యాసాధ్యాల గురించి వారే ఒక నిర్ణయం తీసుకుంటారని బీసీసీఐ అభిప్రాయం వ్యక్తం చేసింది.

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ల్యాప్టాప్స్, స్మార్ట్ ఫోన్స్ ఫ్రీ
06-07-2020

రహస్యంగా కాజల్ ఎంగేజ్ మెంట్? ఎవరితోనో తెలుసా?
24-08-2020

ఏపీ గవర్నర్ మార్పు తథ్యమా? బిబి హరిచందన్ స్థానంలో కిరణ్ బేడీ?
10-08-2020

భారత్ ని వేడుకొంటున్న చైనా.. వెనక్కు పోయాం.. నమ్మండి ప్లీజ్
09-08-2020

హైదరాబాద్లో బాంబు పేలుడు.. కార్లు, బస్సుల అద్దాలు ధ్వంసం
21-08-2020

నారా లోకేశ్ కి విడదల రజనీ షాక్
28-10-2020

ఏంటి రజనీ మేడమ్.. అసలు కథ అదేనా
30-10-2020

అప్పుడలా.. ఇప్పుడిలా..! విడదల రజినీ ఇంతలా మారిపోయారా..?
04-07-2020

విజయసాయి రెడ్డికి ఇష్టం లేని పని జరగబోతోందా?
24-07-2020