'మైండ్ బ్లాక్' సాంగ్.. దేవి తుస్సుమనిపించాడు
03-12-201903-12-2019 09:02:28 IST
2019-12-03T03:32:28.924Z03-12-2019 2019-12-03T03:03:40.567Z - - 06-12-2019

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు'. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 11న విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలతో పాటు ఓ రేంజ్ లో టెన్సన్ కూడా ఉంది. సంక్రాంతికే విడుదల అవుతున్న అల్లు అర్జున్ 'అల..వైకుంఠపురము' సినిమా నుండి విడుదల చేసిన పాటలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. 'సామజవరగమనా' సాంగ్ 100 మిలియన్ వ్యూస్ పట్టేయగా 'రాములో రాములా' సాంగ్ 100 మిలియన్ వ్యూస్ చేరువలో ఉంది. 'ఓ మై గాడ్ డాడీ' అంటూ వచ్చిన సాంగ్ రెండు పాటల రేంజ్ లో కాకపోయినా పర్వాలేదనిపించింది. దీంతో 'సరిలేరు నీకెవ్వరు' సినిమాపై ఒత్తిడి పెరిగింది. థమన్ ఇచ్చిన పాటలకు దీటుగా దేవి శ్రీ ప్రసాద్ కూడా పాటలు చేయవలసి వచ్చింది. అందుకే మహేష్ బాబు & కో దేవి శ్రీ ప్రసాద్ పై ఒత్తిడి పెంచారని కథనాలు కూడా వినబడ్డాయి. దేవిపై ఉన్న ఒత్తిడిని తగ్గించడానికి చిత్ర యూనిట్ ముందుగా టీజర్ విడుదల చేసింది. టీజర్ మంచి రెస్పాన్స్ పట్టేయడంతో బాటు ట్రెండింగ్ లో కూడా ఎక్కువ రోజులు ఉంది. ఆ తరువాత ప్రతి సోమవారం ఒక పాటను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. వారు ప్రకటించినట్లు గానే సినిమా నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను సోమవారం విడుదల చేశారు. 'మైండ్ బ్లాక్.. మైండ్ బ్లాక్.. మైండ్ బ్లాక్..బాబు నీ మాస్ లుక్కు మైండ్ బ్లాకు.. బాబు నువ్వు స్టెప్పే స్తే మైండ్ బ్లాకు.. ఎపుడూ ఫ్యాంటేసేవాడు ఇపుడు లుంగీ కట్టాడు ఎపుడూ షర్టేసేవాడు ఇపుడు ఝబ్బా తొడిగాడు చేతికేమో మల్లెపూలు కళ్లకేమో కళ్లజోడు చుట్టేసి – పెట్టేసి వచ్చేశాడూ' అంటూ వచ్చిన ఈ పాటకు శ్రీమణితో బాటు దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యాన్ని అందించారు. బ్లాజీ, రెనీనా రెడ్డి ఆలపించిన ఈ ర్యాప్ స్టయిల్ మాస్ సాంగ్ కు దేవి అందించిన సంగీతం చాలా సాదా సీదాగా సాగింది.ఏ మాత్రం కొత్తదనం లేని ట్యూన్ కు నాలుగు రాప్ ముక్కలు, నాలుగు మహేష్ బాబు మాటలు యాడ్ చేసి దేవి ఏదో సో సో అనిపించాడు. పక్కా మాస్ బీట్ అంటూ దేవి, అనీల్ రావిపూడి చెప్పడంతో ఈ పాటపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ అనుకున్న రేంజ్ లో పాట లేకపోవడం మహేష్ అభిమానులకు నిరాశ కలిగించింది. 'నేను శైలజా' సినిమాలోని 'శైలజా శైలజా' పాట ట్యూన్ నే దేవి అటు ఇటు మార్చి 'మైండ్ బ్లాక్' పాటను చేశాడని కామెంట్స్ పడుతున్నాయి. కేవలం మహేష్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల ఈ పాట ఇప్పటి వరకు 3.5 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇదే సమయంలో 25k మంది ఈ పాటకు డిస్ లైక్స్ కొట్టారు. ఈ పాటతో దేవి ఫామ్ లో లేడనే విషయం అర్ధమవుతోంది. 'మైండ్ బ్లాక్' అయ్యే సాంగ్ వస్తోందని ఊరించి ఊరించి చివరకు దేవి శ్రీ ఊసూరు మనిపించాడని కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో పడుతున్నాయి. ఓ రేంజ్ లో బిల్డప్ ఇచ్చిన పాటే యిలా ఉంటే మిగిలిన పాటలు ఎలా ఉండనున్నాయో దేవికే తెలియాలి? రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి ప్రధాన పాత్రలో నటించారు.

'జాన్' కోసం కాజల్ అగర్వాల్..
9 hours ago

విజయ్ దేవరకొండపై అలియా భట్ సంచలన కామెంట్స్..
14 hours ago

రజనీకాంత్ కు విలన్ గా మీనా..
14 hours ago

'ప్రతిరోజూ పండగే' థియేట్రికల్ ట్రైలర్.. భావోద్వేగ ప్రయాణం
18 hours ago

కార్తికేయ మూవీకి సెన్సార్ చిక్కులు
18 hours ago

మల్లెమాల, ఈటీవీలపై నాగబాబు అక్కసు!
18 hours ago

'అల..వైకుంఠపురములో' మై బాస్ ఎఫెక్ట్..
04-12-2019

ఎన్టీఆర్ అతిధిగా 'సరిలేరు నీకెవ్వరు' ప్రీ రిలీజ్ ఈవెంట్..
04-12-2019

సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న నిఖిల్
04-12-2019

పవన్ కళ్యాణ్ సినిమాకి నో చెప్పిన మమ్ముట్టి
04-12-2019
ఇంకా