4. 4 రోజుల బిడ్డ ఖరీదు 5 వేలు.. ఆడపిల్లంటే ఇంత వివక్షా?
08-05-202008-05-2020 09:26:31 IST
Updated On 08-05-2020 10:14:30 ISTUpdated On 08-05-20202020-05-08T03:56:31.405Z08-05-2020 2020-05-08T03:56:29.440Z - 2020-05-08T04:44:30.706Z - 08-05-2020

ఏడు దశాబ్దాల మన స్వతంత్ర భారతంలో ఇంకా ఆడపిల్లపై వివక్ష కరగడం లేదు. మన సమాజంలో లింగవివక్ష అనే జాడ్యం వేళ్ళూనుకుపోయి ఎంతకీ విడవడం లేదు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా.. ఎన్నెన్ని శిక్షలు వేసినా సమాజం హృదయంలో మాత్రం చిన్నచూపు మాసిపోవడం లేదు. ఇప్పటికీ పుట్టిన పురిటి బిడ్డను బేరం పెట్టే మనుషులు మన మధ్యలో జీవిస్తుండడం తీవ్ర విచారకరం. భూమ్మీద పడి నిండా నాలుగు రోజులు కాకముందే.. తల్లిని కళ్లారా చూడకముందే ఆ ముక్కుపచ్చలారని పసికందుని జస్ట్ ఐదు వేల రూపాయలకు బేరం పెట్టేశారు. ఇది దేశంలో ఎక్కడో వెనుకబడిన రాష్ట్రాలుగా చెప్పుకొనే బీహార్, ఒరిస్సా లాంటి రాష్ట్రాలలో జరిగిన ఘటన కాదు మన తెలంగాణ సమాజం తలదించుకునేలా మెదక్ జిల్లాలోనే జరిగిన ఘటన కావడం దిగ్బ్రాంతికి గురిచేస్తుంది. మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చిట్కుల్ తాండలో ఈ అమానుష ఘటన జరిగింది. పసిబిడ్డ తల్లిదండ్రులకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండగా మూడో సంతానంగా పుట్టడమే ఇప్పుడు ఈ ఆడపిల్ల చేసిన పాపం. మగపిల్లవాడి కోసం ప్రయత్నిస్తున్న కుటుంబ పెద్దలు మళ్ళీ ఆడపిల్లే పుట్టడంతో తల్లి నుండి బిడ్డను వేరు చేసేందుకు సిద్దపడి బేరం పెట్టారు. బిడ్డను కనుక్కోవాలని సిద్ధపడిన అవతలి వారిది మరో కథ. పెళ్ళై ఏళ్ళు గడుస్తున్నా వాళ్ళకి పిల్లల భాగ్యంలేకపోవడంతో డబ్బుతో ఆ భాగ్యాన్ని కొనుక్కోవాలనుకున్నారు. ఇక ఇప్పటికే ఇద్దరు ఆడబిడ్డలను కని ఇప్పుడు మరోసారి కూడా ఆడపిల్లకు జన్మనిచ్చిన ఆ తల్లిని కూడా భర్త నుండి వేరుచేసి మరో పెళ్లి చేసేందుకు కూడా కుటుంబ పెద్దలు సిద్దమైనట్లుగా స్థానికులు చెప్పడం విస్తుపోయేలా చేస్తుంది. ఇంకా మన సమాజంలో ఇంతటి మూర్ఖపు మనుషులు ఉన్నారా.. మనిషి అంతరిక్షంలో జీవించేందుకు ప్రయత్నిస్తున్నారంటే ఎంతో వృద్ధి చెందామని గొప్పలు చెప్పుకుంటాం. కానీ ఇదే సమాజంలో కనీసం ఈ భూమి మీద ఆడపిల్లకు బ్రతికే హక్కు కూడా ఉందని ఇప్పటికీ గుర్తించలేని మనుషులు ఉండడం ఎంతటి నీచమో అర్ధంకాని ఆవేదన. ఇప్పటికే మన తెలుగు రాష్ట్రాలలో ఈ వివక్ష కారణంగా స్తీ-పురుష నిష్పత్తిలో వ్యత్యాసం ఎక్కువగా కనిపిస్తుంది. గత రెండు దశాబ్దాలుగా ఆడ-మగ తెలిపే స్కానింగ్ తో అమ్మ కడుపులోనే పసిగుడ్డును నలిపేసి రాక్షస ఆనందం పొందారు. ప్రభుత్వ కఠిన చట్టాలతో కొద్దిగా మార్పులు వచ్చినా భూమి మీద పడ్డాక కూడా చిట్టితల్లికి కష్టాలు మాత్రం తప్పడం లేదు. ఇలాంటి ఆటవిక మనుషులు ఉండగా ఈ సమాజంలో మార్పు రాదేమో!

తిరుపతిలో ఇవాళ అమ్మవారి కటాక్షమే పార్టీలకు ఇంపార్టెంట్
5 minutes ago

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
an hour ago

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
15 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
10 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
13 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
15 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
18 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
19 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
20 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
a day ago
ఇంకా