సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు
26-05-202026-05-2020 09:53:03 IST
Updated On 26-05-2020 10:06:15 ISTUpdated On 26-05-20202020-05-26T04:23:03.370Z26-05-2020 2020-05-26T04:22:48.330Z - 2020-05-26T04:36:15.118Z - 26-05-2020

కరోనా లాక్ డౌన్ వేళ వరంగల్ పోలీసులకు చుక్కలు చూపించాడు సంజయ్ కుమార్. ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు మరో తొమ్మిది హత్యలు చేశాడు బీహార్ కు చెందిన సంజయ్. వరంగల్ గొర్రెకుంటలో జరిగిన 9హత్యల మిస్టరీని చేధించారు పోలీసులు. ప్రధాన నిందితుడు సంజయ్ కుమార్ ను వరంగల్ సీపీ రవీందర్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. “బెంగాల్ నుంచి వలసవచ్చిన మక్సూద్ ఫ్యామిలీ స్థానిక శాంతినగర్ లోని గోనె సంచిల ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్లు. ఇక్కడే వాళ్లకు సంజయ్ పరిచయం అయ్యాడు. ఇదే టైంలో మక్సూద్ భార్య అక్క కూతురు..రఫికా తన ముగ్గురు సంతానంతో మక్సూద్ దగ్గరకు వచ్చింది. తను కూడా గోనె సంచిల ఫ్యాక్టరీలోనే పనిచేసేది. రోజూ సంజయ్కు అన్నం వండిపెట్టేది రఫికా. అలా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి.. అది సహజీవనం వరకు వెళ్లింది. అయితే రఫిక కూతురుపై సంజయ్ కన్నేశాడు. ఇది నచ్చని రఫికా సంజయ్ ను నిలదీసింది. పెళ్లిచేసుకుంటానంటూ రఫికాకు నచ్చజెప్పి.. కుటుంబ సభ్యులతో మాట్లాడదామని చెప్పి బెంగాల్ వెళ్దామంటూ మార్చి 7న ట్రైన్ లో రఫికను తీసుకెళ్లాడు సంజయ్. మార్చి8న ఉదయం ట్రైన్ లోనే మజ్జిగలో నిద్రమాత్రలు కలిపి రఫికాను చున్నీతో బిగించి చంపేశాడు. తర్వాత పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు దగ్గర.. ట్రైన్ నుంచి నెట్టేసి వరంగల్ చేరుకున్నాడు సంజయ్. కొద్దిరోజుల తర్వాత రఫికా విషయమై సంజయ్ను నిలదీయడం మొదలుపెట్టారు మక్సూద్ కుటుంబసభ్యులు. దీంతో రఫికా మర్డర్ విషయం ఎక్కడ బయటపడుతోందనని.. మక్సుద్ ఫ్యామిలీని కూడా చంపాలని నిర్ణయించుకున్నాడు సంజయ్ కుమార్ . మక్సుద్ ఫ్యామిలీ మొత్తం ఆరుగురు సభ్యులు. మక్సుద్ అతని భార్య, ఇద్దరు కుమారులు, కూతురు, మనవడు ఉన్నారు. అలాగే మక్సుద్ ఉంటున్న పై రూంలో శ్రీరాం,శ్యాం అనే ఇద్దరు బిహారీలు కూడా ఉంటున్నారు. మక్సుద్ ఫ్యామిలీని చంపాలనుకున్న సంజయ్ హన్మకొండ చౌరస్తాలోని ఓ మెడికల్ షాపు నుంచి స్లీపింగ్ పిల్స్ కొన్నాడు. ఈనెల 16 నుంచి 20వరకు మక్సుద్ ఉండే ప్రాంతం చుట్టుపక్కల రెక్కీ చేశాడు. మక్సుద్ కొడుకు బర్త్ డే రోజున అందరినీ చంపాలని డిసైడ్ అయ్యాడు. అదే రోజు స్లీపింగ్ పిల్స్ ను మక్సుద్ వాళ్లు చేసుకున్న వంటలో కలిపాడు. అలాగే పై రూంలో ఉంటున్న బిహారీల వంటలో కూడా మత్తు మాత్రలు కలిపాడు. అందరూ స్పృహ తప్పి పడిపోయాక.. ఒక్కొక్కరిని తీసుకెళ్లి బావిలో పడేశాడు. ఆ తర్వాత ఏమీ తెలీనట్టే తన ఇంటికి చేరుకున్నాడు. ఈ వరుస హత్యల కేసును చేధించేందుకు వరంగల్ పోలీసులకు సీసీ టీవీ ఫుటేజీ బాగా ఉపయోగపడింది. ఆ ఫుటేజీ ద్వారానే సంజయ్ కదలికలను గుర్తించారు పోలీసులు. తర్వాత సంజయ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తే.. అసలు విషయం మొత్తం బయటపడిందని తెలిపారు వరంగల్ సీపీ రవీందర్. మొత్తం మీద ఒక హత్యను దాచేందుకు 9 మందిని హతమార్చి సంజయ్ పెద్ద సీరియల్ కిల్లర్ గా మారాడు. ఈ పది హత్యల ఉదంతం రాష్ట్యవ్యాప్తంగా సంచలనం రేపింది.

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
an hour ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
3 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
4 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
5 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
6 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
7 hours ago

వన్ ప్లస్ వన్ ఆఫర్
5 hours ago

నా రూటే సెపరేటు
8 hours ago

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
a day ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
a day ago
ఇంకా