సీఎం కేసీఆర్ కు ప్రాణహాని.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు
05-01-202005-01-2020 15:29:50 IST
Updated On 06-01-2020 12:54:21 ISTUpdated On 06-01-20202020-01-05T09:59:50.758Z05-01-2020 2020-01-05T09:59:24.253Z - 2020-01-06T07:24:21.662Z - 06-01-2020

మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి తెలంగాణ రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ గా పేరుంది. అంతకు మించి ఆయన దీనిపై మీడియా ముందుకి వచ్చినా పూర్తి సబ్జెక్టుతోనే వస్తారు. అందుకే అనర్గళంగా ఎదురుదాడి చేసి మాటలతో ఎదుటివాళ్ళని పడగొట్టేస్తారు. అయనతో పరిచయం ఉన్నవాళ్లు, జర్నలిస్టులు కూడా చెప్పే మాట ఇదే. అందుకే ప్రభుత్వం కూడా అయనని టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేస్తుంది. కాగా, సీఎం కేసీఆర్, రేవంత్ రెడ్డికి మధ్య రాజకీయంగానే కాకుండా అంతకి మించి ఏదో పగ ఉన్నట్లుగా వీరి రాజకీయాలు కొనసాగుతుంటాయి. రేవంత్ కూడా కేసీఆర్ కుటుంబం మీద దూకుడుగా ఉంటారు. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు మీడియా ముందు రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. గతంలో బావ-బావమరుదులైన హరీష్ రావు- కేటీఆర్ లపై వ్యాఖ్యలు చేస్తుండగా ఇప్పుడు తండ్రి కొడుకులపై రేవంత్ కామెంట్స్ సంచలనంగా మారాయి. తాజాగా గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా కర్మన్ఘాట్లో సభ ఏర్పాటు చేశారు. ఈసభలో మాట్లాడిన ఎంపీ రేవంత్ 'పదవి కుటుంబసభ్యుల మధ్య కూడా చిచ్చు పెడుతుంది. ‘‘కేటీఆర్ను సీఎం చేయకపోతే అర్ధరాత్రి లేచి తండ్రిని మెత్తపెట్టి ఒత్తిండంటే ఏదైనా జరగరానిది జరగొచ్చు’’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో టీవీలో వార్తలు చూస్తుంటే సీఎం కేసీఆర్ ప్రాణాలకు ఏదో ముప్పు ఉన్నట్లుగా కనిపిస్తుందని.. ముందుగా కేటీఆర్ను ప్రగతి భవన్ నుంచి ఖాళీ చేయించాలని.. లేకపోతే మాట్లాడుకోడానికి ఏమీ మిగలదని రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయలలో హాట్ టాపిక్ గా మారింది. కొంతకాలం బావ-బావమరుదులు మధ్య పంచాయతీ అన్నారని.. ఇప్పుడు తండ్రీ కొడుకుల మధ్య పంచాయతీగా కనిపిస్తుందన్నారు. కాగా, ఒకపక్క మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి అంటున్నారంటే సీఎంగా కేసీఆర్ పై నమ్మకం కోల్పోయినట్లేనని అర్థమవుతుందన్నారు. మంత్రివర్గంలో కూడా స్పష్టమైన చీలిక కనిపిస్తుందని.. ఇక కేటీఆర్ ను సీఎం చేయకపోతే ఏదైనా జరగొచ్చని.. ముందుగా కేసీఆర్ జాగ్రత్త పడి కేటీఆర్ ను ప్రగతి భవన్ నుండి ఖాళీ చేయిస్తే మంచిదని సలహా ఇచ్చారు. రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయాలలో దుమారం రేపుతోంది. ఒకపక్క మంత్రుల వ్యాఖ్యలకు తోడు రేవంత్ వ్యాఖ్యలు పార్టీలో ఏదో జరుగుతుందన్న అనుమానాలు కొందరు లేవనెత్తుతున్నారు. అయితే రేవంత్ వ్యాఖ్యలు వినడానికి ఆసక్తికరంగా, విశ్లేషణగానే ఉన్నా వాస్తవికత మాత్రం ఎక్కడా కనిపించడం లేదని విశ్లేషకుల అభిప్రాయంగా చెప్తున్నారు.

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
4 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
5 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
an hour ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
8 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
8 hours ago

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్పై ప్రమాణం చేయగలరా
27 minutes ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
2 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
8 hours ago

ఇక కేటీఆర్ టైం వచ్చినట్లేనా
10 hours ago

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం
18-04-2021
ఇంకా