సరూర్నగర్లో ఘనంగా ఉమెన్స్ డే ఉత్సవాలు
08-03-202008-03-2020 09:29:02 IST
2020-03-08T03:59:02.432Z08-03-2020 2020-03-08T03:55:34.594Z - - 16-04-2021

హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా తెలంగాణ హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ,తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,, తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు మహేందర్ రెడ్డి,రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ సుమారు 2,500 మంది విద్యార్దిని విద్యార్థులు,, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఐటీ సంస్థలు, కాలేజీల నుండి, 25 జిల్లాల పరిషత్ పాఠశాలలు నుంచి విద్యార్ధులు విచ్చేశారు. ఆనాడు మహాత్మాగాంధీ చెప్పినట్లు గా ఒక మహిళ అర్ధరాత్రి నడిస్తే స్వతంత్రం వచ్చినట్లు. ఆ మాట రాచకొండ కమిషనరేట్ పరిధి లో చూడాలని అన్నారు. ఎక్కడ మహిళలు పూజంపబడతారో అక్కడ దేవతలు ఉంటారని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. షీ టీం అనేది భయం వీడు నేను ఉన్నానని అభయం ఇచ్చేదన్నారు. 42 లక్షల జనాభా గల రాచకొండ కమిషనరేట్ మహిళల రక్షణలో ముందుందన్నారు. షీ టీం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో లింగ నిర్దారణ, బాల్య వివాహాలను ఆరికట్టిందని. ప్రతి ఆడపిల్ల లకు మేము ఉన్నామని అభయం ఇస్తూ ముందు ఉంటుందని అన్నారు. హాజిపూర్ నుండి విద్యనభ్యసించే విద్యార్థినులకు 6 కిలోమీటర్లు నడిచి వెళ్లే విద్యార్థులకు మేము ఉన్నామని లైన్స్ క్లబ్ ముందు కొచ్చి సైకిళ్లు పంపిణీ చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాచకొండ కమిషనరేట్లో గత 7 రోజులుగా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్న కమిషనర్ను హృదయ పూర్వకంగా అభినందించారు తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు మహేందర్ రెడ్డి. గత ఐదారేళ్ళ క్రితం తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు షీ టీం ను ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. మహిళల భద్రతే ప్రామాణికంగా షీ టీం అని, గత అరేళ్లలో మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నామని, రాచకొండ కమిషనరేట్ లో మార్గదర్శక కార్యక్రమాన్ని చేస్తున్నామని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం ఎంతో సంతోషకరం అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల పట్ల ఎంతో శ్రద్ద కనబరుస్తున్నారన్నారు. దానికి ఉదాహరణ షీ టీమ్స్ అన్నారు తెలంగాణ హోంమంత్రి మహమ్మద్ అలీ. తెలంగాణ పోలీసులు దేశంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు తెస్తున్నారు. లా అండ్ ఆర్డర్ ఎక్కడ అయితే బాగుంటుందో అక్కడ పెట్టుబడులు వస్తాయి. కాబట్టి మన ముఖ్యమంత్రి పోలీసు విభాగానికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు అని తెలిపారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ మహిళల సమస్యలపై ఎక్కువగా స్పందించే వ్యక్తి రాచకొండ సీపీ మహేష్ భగవత్ అన్నారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రంలో షీ టీమ్స్ ను తీసుకొని వచ్చి మహిళల రక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. దేశంలోనే తలెత్తుకునే విధంగా పని చేస్తున్న తెలంగాణ పోలీసులను ఆమె అభినందించారు. మహిళలు ముఖ్యంగా విద్యార్ధినులు సమర్థులుగా, ధైర్యవంతులుగా అన్ని పాత్రలలో మమేకం కావాలని ఆమె ఆకాంక్షించారు.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
10 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
6 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
8 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
11 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
13 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
15 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
16 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
17 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
18 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
19 hours ago
ఇంకా