శంషాబాద్ ఓఆర్ఆర్పై ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి
28-03-202028-03-2020 08:43:52 IST
Updated On 28-03-2020 11:08:18 ISTUpdated On 28-03-20202020-03-28T03:13:52.202Z28-03-2020 2020-03-28T03:13:44.373Z - 2020-03-28T05:38:18.644Z - 28-03-2020

లాక్ డౌన్ అమలవుతున్న వేళ ఔటర్ రింగ్ రోడ్డు రక్తసిక్తమయింది. శంషాబాద్ పెద్దగోల్కొండ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర ప్రమాదం జరిగింది, బొలెరో వాహనాన్ని ఢీ కొట్టింది లారీ. దీంతో ఐదుగురు సంఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమం ఉందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మృతి చెందినవారు కర్ణాటక వాసులని తెలిసింది. ప్రమాద సమయంలో టెంపోలో 20 మంది వలస కార్మికులు ఉన్నారు. వీరంతా రోడ్డు కాంట్రాక్ట్ పనులు చేసేవారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఉండడంతో ఎక్కడా పని దొరకకపోవడంతో వీరంతా తమ స్వస్థలమైన కర్ణాటకలోని రాయచూరుకు పయనమయ్యారు. అయితే శంషాబాద్ ఓఆర్ఆర్పై వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ వీరి వాహనాన్ని బలంగా ఢీకొంది. ప్రమాద వార్త అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని గాయాలపాలైనవారిని హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. లాక్డౌన్ నేపథ్యంలో తెలంగాణవ్యాప్తంగా ఔటర్ మార్గాన్ని మూసి ఉంచారు. కానీ వీరి వాహనం ఎలా వచ్చిందనేది దర్యాప్తు వీరి వాహనానికి అనుమతి ఎలా లభించిందన్న దానిపై దర్యాప్తు సాగుతోంది. సూర్యాపేట్ నుండి కర్ణాటక కు వెళ్తుండగా ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. కరోనా కారణంగా పనులు ఆగిపోవడంతో సొంత గ్రామాలకు చేరుకోవాలని బయలుదేరిన కూలీలను రోడ్డు ప్రమాదం కబళించింది. మృతులలో మూడేళ్ళు, రెండేళ్ళ వయసున్నఆడపిల్లలు ఉన్నారు. కాంట్రాక్ట్ పనులు చేసేవీరికి వచ్చే నెల వరకు పని చేయకూడదని నిషేధం అమలు చేయడంతో వారి స్వస్థలాలయిన అయిన కర్ణాటక రాష్ట్రం రాయచూర్ డిస్టిక్ లింగసూర్ మండలం రాయ్ దుర్గ్ వెళ్లేందుకు సిద్ధపడ్డారు. ఈ సమయంలో మృత్యు రూపంలో వచ్చి అర్ధాంతరంగా మధ్యలో శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో రంగప్ప, శరణప్ప ,సిరియమ్మ ,హనుమంతు వీరితో పాటు మరో వ్యక్తి మృతి చెందారు.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
11 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
7 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
9 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
11 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
14 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
15 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
17 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
18 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
18 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
19 hours ago
ఇంకా