వరంగల్ ఐటీ సిగలో టెక్ మహీంద్రా, సైయంట్
07-01-202007-01-2020 13:17:41 IST
2020-01-07T07:47:41.148Z07-01-2020 2020-01-07T07:47:39.281Z - - 14-04-2021

ఐటీ అనగానే మనకు గుర్తుకువచ్చేది హైదరాబాద్ హైటెక్ సిటీ, గచ్చిబౌలి. దేశ, విదేశీసంస్థలు తమ క్యాంపస్ లను హైదరాబాద్ లో ఏర్పాటుచేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరం వరంగల్ పెద్ద సంస్థలను ఆకట్టుకుంటోంది. ఐటీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటోంది. వరంగల్ మడికొండలోని ఐటీ పార్క్లో సైయెంట్, టెక్ మహీంద్రా క్యాంపస్లను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సైయెంట్, టెక్ మహీంద్రా ప్రతినిధులు, మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్రావు, ఈటల రాజేందర్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అత్యాధునిక హంగులతో 5 ఎకరాల్లో సైయెంట్ నూతన భవనాన్ని నిర్మించారు. 600 నుంచి 700 మంది ఉద్యోగులతో సేవలు అందించేందుకు వీలుగా భవన నిర్మాణం చేపట్టారు. టెక్ మహీంద్రాలో 100 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. 2016 ఫిబ్రవరిలో వరంగల్ ఐటీ సెజ్లో ఇంక్యుబేషన్ సెంటర్ను కేటీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఐటీ సేవల కోసం 27 ఎకరాల్లో ప్రత్యేక ఆర్థిక మండలిని ప్రభుత్వం అభివృద్ధి చేసింది. మొదటి దశలో భాగంగా 2017లో 5 ఎకరాల్లో మూడు కంపెనీలను ప్రారంభించారు. వరంగల్లో మరిన్ని ఐటీ సంస్థలు రావాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీయార్ అన్నారు. ఐటీ రంగం అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూత నిస్తుందన్నారు. ఐటీ జాబ్స్ అంటే హైదరాబాద్ లోనే కాదు వరంగల్లోనూ ఉంటాయన్నారు.

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
36 minutes ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
an hour ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
3 hours ago

కేటీఆర్ కి అంత సీన్ లేదులే
4 hours ago

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!
5 hours ago

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ
20 hours ago

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!
19 hours ago

ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!
20 hours ago

గత సావాసంతో టీఆర్ఎస్ కు కమ్యూనిస్టుల సపోర్ట్
18 hours ago

మమత ప్రచారంపై 24 గంటల బ్యాన్. ఈసీ కొరడా..
13-04-2021
ఇంకా