లాక్ డౌన్ ఉల్లంఘనులపై భారీగా కేసులు
16-04-202016-04-2020 19:11:54 IST
Updated On 16-04-2020 20:21:18 ISTUpdated On 16-04-20202020-04-16T13:41:54.636Z16-04-2020 2020-04-16T13:41:46.500Z - 2020-04-16T14:51:18.422Z - 16-04-2020

తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ ఉల్లంఘనల కేసులు పెరిగిపోతున్నాయి. పోలీసులు, హెల్త్ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికుల పనితీరు అభినందనీయమని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు. రెడ్ జోన్ గా ప్రకటించిన ఎన్టిపీసీ అన్నపూర్ణ కాలనీని ఆయన తనిఖీ చేశారు. నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అతనిని ఐసోలేషన్ కి పంపించడం జరిగిందని అతడు కోలుకుంటున్నాడని ఆయన చెప్పారు. రెడ్ జోన్ ప్రాంతంలో ఇతరులెవరూ ప్రవేశించకుండా డ్రోన్ కెమెరాతో పోలీసులు పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. కరోనా వ్యాప్తి చెందకుండా కంట్రోల్ లో ఉండడంతో అన్నపూర్ణ కాలనీ నీ కంటోన్మెంట్ పరిధి నుండి తొలగించేందుకు నిర్ణయం తీసుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను మే 3 వరకు పొడిగించడం జరిగిందిని ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా పోలీసులకు సహకరించాలన్నారు. కరీంనగర్ లోని కశ్మీర్ గడ్డ ప్రాంతంలో ఐదుగురు వ్యక్తులు ఒక కిరాణా దుకాణం వద్ద నిత్యావసర వస్తువుల పంపిణీ పేరిట 70కి పైగా జనాలను సమీకరించి, సమావేశాన్ని నిర్వహించడం, ఎలాంటి అనుమతులు లేకుండా నిత్యావసరాల వస్తువులను పంపిణీ చేస్తున్న వీరి పై కరీంనగర్ లోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో బుధవారం నాడు కేసు నమోదు చేశారు. కరీంనగర్లోని హుస్సేనిపురా ప్రాంతానికి చెందిన సయ్యద్ సహా అర్సలాన్, సయ్యద్ అబూజార్, మహమ్మద్ తర్భిజ్ అహ్మద్ ఖాన్, అహ్మద్ పురా కు చెందిన మీర్జా రహమతుల్లా బేగ్, సయ్యద్ అఖిల్లపై కేసును నమోదు చేశారు. పైన పేర్కొన్న వ్యక్తుల్లో కొందరికి నిషేధిత PFI సంస్థతో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. ఈ సంస్థ పేరిట ఈ నిత్యావసరాల వస్తువులను పంపిణీ చేస్తున్నారంటూ ముద్రించబడిన డోర్ పోస్టర్లు,ఢిల్లీ లో జరిగిన అల్లర్లలోని వారికి సహాయం కోసం ముద్రించిన ఒక చందాలు స్వీకరించే బుక్కు, రెండు కార్లు, రెండు సెల్ ఫోన్లు, 49 రేషన్ కిట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ స్వరూప్ రాజ్ ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న వీరిని విచారిస్తున్నారు. ఇటు జామాబాద్ జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిజామాబాద్ డిప్యూటీ మేయర్ మహమ్మద్ ఇంద్రిస్ ఖాన్ తో పాటు మరో 10 మంది పై కేసు నమోదు చేశారు పోలీసులు. రెడ్ జోన్ ప్రాంతంగా గుర్తించిన ఆటో నగర్ లో ఓ కుటుంబ సభ్యులను క్వారన్ టైన్ కు తరలిస్తుండగా అడ్డుకున్నారు నిజామాబాద్ డిప్యూటీ మేయర్ ఇంద్రిస్ ఖాన్. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రెడ్ జోన్ ప్రాంతంలోకి రావడం, అధికారుల విధులకు ఆటంకం కలిగించి పోలీసులతో వాగ్వాదానికి దిగిన నేతలపై కేసులు నమోదుచేశారు. ఈ ఘటనలో డిప్యూటీ మేయర్ తో పాటు మరో 10 మంది పై పలు కేసులు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
5 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
8 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
12 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
2 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
12 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
10 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
12 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
13 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
7 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
15 hours ago
ఇంకా