రోజుకు 23 వేల టెస్టులు.. సెప్టెంబర్ కల్లా తెలంగాణలో కరోనా ఉండదు
09-08-202009-08-2020 09:07:59 IST
2020-08-09T03:37:59.350Z09-08-2020 2020-08-09T03:37:55.371Z - - 14-04-2021

తెలంగాణలో రోజుకు 23వేల మందికి కరోనా టెస్టులు చేస్తున్నామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో కేసు ల సంఖ్య రోజు రోజుకి తగ్గుతుందని చెప్పారు. నెలాఖరుకు నగరంలో కేసులు చాలా తగ్గుతాయని అంచనా వేస్తున్నట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు. సెప్టెంబర్ చివరికి తెలంగాణలో కరోనా పూర్తిగా తగ్గే అవకాశం ఉందన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను కేటాయించిదని గుర్తు చేశారు. కొన్ని ఆస్పత్రులు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 1039 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిలో 130కి పైగా బిల్లులకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయన్నారు. ఇన్యూరెన్స్కు సంబంధించి 16 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ ఆస్పత్రలన్నింటికి కౌన్సిలింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రైవేట్ ఆస్పత్రులను మూసివేడం తమ ఉద్ధేశ్యం కాదని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కాగా, . రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 150 ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు కరోనా చికిత్సకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందులో ప్రస్తుతం 91 ఆసుపత్రుల్లో చికిత్సలు జరుగుతున్నాయి. మరిన్ని ప్రైవేట్ ఆస్పత్రులలో కరోనా పరీక్షలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రం మొత్తాన్ని చుట్టేసిన ఈ వైరస్తో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జాగ్రత్తలెన్ని తీసుకున్నా ముప్పు ఏ మూల.. ఎవరి నుంచి వస్తుందో..? తెలియక ప్రజలు కలవరపడుతున్నారు. భయం భయంగా జీవనం సాగిస్తున్నారు. సామాన్య జనం, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ఎవ్వరూ కరోనాకు అతీతులు కారు. ఇలా అందరిపైనా దాడి చేస్తోంది. ఇలాంటి తరుణంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు రాష్ట్ర ప్రజలకు ఒకింత శుభవార్త చెప్పారు. ‘తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ధైర్యమే కరోనాకు మందు. సెప్టెంబరు ఆఖరు నాటికి తెలంగాణలో కరోనా పూర్తిస్థాయిలో కనుమరుగవుతుంది. ఈ నెలాఖరుకల్లా హైదరాబాద్లో కేసులు చాలా వరకు తగ్గుతాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని శ్రీనివాసరావు చెప్పారు. తెలంగాణలో పాజిటవ్ కేసులు నెమ్మదిగా తగ్గుతున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 5శాతం పాజిటివ్ రేటు నమోదవుతోంది. ప్రభుత్వం తాజాగా కోవిడ్-19 నివారణ చర్యలకు రూ. 100 కోట్లు కేటాయించింది. కరోనా రెండు వారాలు మాత్రమే ఉండే జబ్బు. 11వందల సెంటర్స్లో రోజుకు 20వేలకు పైగా టెస్టులు చేస్తున్నాం. పాజిటివ్ వచ్చిన వారికి వెంటనే హోం ఐసోలేషన్ కిట్ ఇస్తున్నాం. కోవిడ్ కేర్ సెంటర్స్ ద్వారా హోం ఐసోలేషన్ రోగులను మానిటరింగ్ చేస్తున్నాం’ అని శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. ‘ప్రస్తుతం 10వేల బెడ్లు అందుబాటులో ఉన్నాయి. మెత్తం 18వేల పడకలకు ఆక్సిజన్ అందుబాటులో ఉంది. ఔట్ సోర్సింగ్ నర్సింగ్, డాక్టర్లను విధుల్లోకి తీసుకున్నాం. కొంతవరకే ప్లాస్మా ఉపయోగపడుతోంది. క్రిటికల్ రోగులకు ప్లాస్మాతో ప్రయోజనం ఉండదు. కరోనా లక్షణాలు లేకుండా పాజిటివ్ వచ్చిన వారిలో యాంటీబాడీస్ డెవలప్ కావు. పాజిటివ్ వచ్చిన వారు హైదరాబాదు రావాల్సిన అవసరం లేదు. జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలు కల్పించాం’ అని తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేష్ రెడ్డి తెలిపారు.

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
4 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
5 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
5 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
9 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
10 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
8 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
11 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
11 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
6 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
13 hours ago
ఇంకా