రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సందడి
02-06-202002-06-2020 13:22:33 IST
Updated On 02-06-2020 16:29:03 ISTUpdated On 02-06-20202020-06-02T07:52:33.245Z02-06-2020 2020-06-02T07:36:02.965Z - 2020-06-02T10:59:03.891Z - 02-06-2020

లాక్ డౌన్ కారణంగా రైల్వే శాఖ అన్ని సర్వీసులను రద్దుచేసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా వలస కార్మికుల కోసం వందలాది శ్రామిక్ రైళ్ళను నడిపింది. తాజాగా సోమవారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో రైల్వే రిజర్వేషన్లు, ప్రయాణాలు ప్రారంభం అయ్యాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. తెలుగు రాష్ట్రాల నుంచి 9 రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఉదయం ఆరుగంటలకు నాంపల్లి నుంచి తెలంగాణ ఎక్స్ప్రెస్ ఢిల్లీకి బయలుదేరింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు చేరుకోవడంతో భారీ క్యూలైన్ ఏర్పడింది. దేశవ్యాప్తంగా 100 రూట్లలో 200 ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడుపుతుంది. తొలి రోజు లక్షా 45వేల మంది ప్రయాణాలు చేయనున్నారు. ఆన్లైన్, రైల్వే బుకింగ్ కౌంటర్లలో రిజర్వేషన్కు అవకాశం కల్పించారు. థర్మల్ స్క్రీనింగ్ తర్వాత టికెట్ ఉన్న వారికే స్టేషన్లోకి అనుమతిస్తారు. ప్రతి ప్రయాణికుడు తప్పని సరిగా మాస్క్ ధరించాలని నిబంధన విధించారు. రైల్వే ప్రయాణాల కోసం విజయవాడలోబారులు తీరారు ప్రయాణికులు. దాదాపు రెండున్నర నెలల తర్వాత ప్రయాణికులతో కళకళలాడుతోంది విజయవాడ రైల్వే స్టేషన్. నేటి నుంచి రైళ్లు మళ్లీ ప్రారంభం కావడంతో పెద్ద సంఖ్యలో రైల్వే స్టేషన్ కు చేరుకుంటున్నారు ప్రయాణికులు. లాక్ డౌన్ కారణంగా తమ బంధువులకు, స్నేహితులకు దూరంగా వున్నవారు తగిన జాగ్రత్తలతో ప్రయాణాలు చేస్తున్నారు. గతంలోలా కాకుండా రైలు బయలుదేరే సమయానికి గంటన్నర నుంచి రెండుగంటల ముందే స్టేషన్కు చేరుకోవాలన్న నిబంధన మేరకు ముందే తరలివచ్చారు ప్రయాణికులు. వందల సంఖ్యలో వస్తున్న ప్రయాణికులతో రోడ్డు పైకి క్యూ వచ్చింది. స్టేషన్లో ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా నేలపై గుర్తులు వేశారు రైల్వే శాఖ సిబ్బంది. రైల్వే స్టేషన్కు చేరుకుంటున్న ప్రయాణికులకు పరీక్షల అనంతరం ఎటువంటి లక్షణాలు లేకుంటేనే లోపలికి పంపుతున్నారు అధికారులు. ప్రయాణానికి ముందే ఆయా రైల్వే బోగీలను శుభ్రం చేస్తున్నారు పారిశుద్ధ్య సిబ్బంది. ప్రయాణికులు తగిన జాగ్రత్తలతో ప్రయాణం చేయాలని, ప్రయాణికులకు ప్రయాణికులకు మధ్య భౌతిక దూరం వుండేలా చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కరోనా అనుమానితుల కోసం ఒక్కో రైల్లో 3 పీపీఈ కిట్లను ఉంచుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం రెగ్యులర్ ఛార్జీలతోనే టికెట్లు ఇస్తుండగా, జూన్ 29వ తేదీ నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్ మొదలవుతుంది. కాగా, హైదరాబాద్ నుండి ఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్ ప్రెస్ దేశరాజధానికి బయల్దేరింది.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
9 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
12 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
15 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
5 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
15 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
13 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
15 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
16 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
10 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
18 hours ago
ఇంకా