రిటైరైన వారిన గౌరవించడం మన సంస్కృతి కావాలి.. కేసీఆర్
15-09-202015-09-2020 07:52:10 IST
2020-09-15T02:22:10.536Z15-09-2020 2020-09-15T02:22:07.542Z - - 19-04-2021

ఉద్యోగ జీవితం నుంచి రిటైరైన వారిని గౌరవించడం తెలంగాణ సంస్కృతి కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. దాదాపు 30, 35 ఏళ్ల పాటు ప్రజలకు సేవ చేసి రిటైరైన అధికారిని గౌరవించుకోవడం మానవతా దృక్పథం అని పేర్కొన్నారు. ప్రభుత్వ సర్వీసులో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, అధికారులను సత్కరించి ప్రభుత్వం వాహనంలో వారి ఇంటి వద్ద దించి రావాలని వ్యాఖ్యానించారు. వారికి అందాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్లు కూడా త్వరగా అందాలని, రిటైరైన రోజు వారికి సన్మానం చేసి ఇంటికి పంపే పద్ధతి రావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు కొత్త విధానం తెచ్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని, త్వరలోనే ఇలాంటి విధానం తీసుకొస్తామని వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సోమవారం ప్రశ్నోత్తరాల్లో భాగంగా సింగరేణి కార్మికుల కారుణ్య నియామకాలపై టీఆర్ఎస్ సభ్యులు బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య, కోరుకంటి చందర్, గండ్ర వెంకటరమణారెడ్డిలు అడిగిన ప్రశ్నలకు విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సమాధానమిచ్చారు. తర్వాత సభ్యులు లేవనత్తిన అంశాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా చర్చలో సీఎం కలుగజేసుకొని మాట్లాడుతూ.. 30, 35 ఏళ్ల పాటు ప్రజలకు సేవ చేసి రిటైరైన అధికారిని గౌరవించుకోవడం మానవతా దృక్పథం అని చెప్పారు. ఈ సందర్భంగా ఒక చీఫ్ ఇంజనీర్ స్థాయిలో పనిచేసిన వ్యక్తిని అటెండర్ సీటులో కూర్చోబెట్టిన ఘటనను తాను కళ్లారా చూశానని, అటెండర్ సీటులో కూర్చుని ఉన్న ఆయనను అలా చూడగానే చాలా బాధ కలిగిందని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. తనకు తెలిసిన పాండురంగం అనే ఓ ఎలక్ట్రిసిటీ సీఈ ఉదంతం గురించి కేసీఆర్ అసెంబ్లీలో వివరించారు.. ఒకరోజు పనిమీద విద్యుత్ కార్యాలయానికి వెళ్లినప్పుడు చీఫ్ ఇంజనీర్ స్థాయిలో పనిచేసిన ఆయన అటెండర్ సీటులో కూర్చుని ఉన్నారని, ఇదేంటని అడిగితే తాను రిటైరయ్యానని, రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసం వచ్చానని, అందుకే ఇక్కడ కూర్చున్నానని చెప్పారన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక సార్లు ఆయనను కలిశానని, కానీ అలాంటి స్థితిలో ఆయనను చూడగానే చాలా బాధనిపించిందన్నారు.. అప్పుడు వెళ్లిన పనిని కూడా పక్కకుపెట్టి అధికారులను పిలిపించి ఆయన సమస్య పరిష్కరించానని సీఎం అన్నారు. ఇలాంటి పద్ధతి మంచిది కాదని, రిటైరైన వారిని తగినంతగా గౌరవించుకోవాలని చెప్పారు. అందుకే ప్రభుత్వ ఉద్యోగులు రిటైరయ్యే సమయానికే వారికి సంబంధించిన రికార్డు సిద్ధంగా ఉండాలని, వీలున్నంత త్వరగా వాటిని అందజేయాలని తెలిపారు. కారుణ్య నియామకాల్లోనూ అలసత్వమేనా.. కేసీఆర్ ప్రశ్న కారుణ్య నియామకాలకు సంబంధించి కూడా రాష్ట్రంలోని చాలా శాఖల్లో అలసత్వం వహిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని సీఎం కేసీఆర్ చెప్పారు. ఓ వ్యక్తి చనిపోయినప్పుడు ఆ కుటుంబం బాధలో ఉంటుందని. అలాంటి సమయంలో ఆ కుటుంబంలో అర్హులైన వారికి ఉద్యోగమిచ్చి వారికి ఉపశమనం కలిగించాలని సూచించారు. రాబోయే రోజుల్లో రిటైర్మెంట్ బెనిఫిట్లు, కారుణ్య నియామకాల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామనీ మంచి ఫలితాలు సాధిస్తామనీ సీఎం చెప్పారు. సింగరేణి కార్మికుల కారుణ్య నియామకాల్లో విద్యార్హతల ఆధారంగా తగిన పోస్టులిచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామనీ, కొద్దిగా ఓపిక పట్టాలని కేసీఆర్ సూచించారు. సింగరేణిలో పోస్టులు సృష్టించి ఇవ్వలేం కానీ ఖాళీలను బట్టి ప్రయారిటీ మేరకు ఇస్తామని చెప్పారు. కాగా, సింగరేణి కార్మికులకు ఇన్కంట్యాక్స్ రద్దు అనేది రాష్ట్రం పరిధిలో లేదనీ, ఈ విషయమై ప్రధానిని స్వయంగా కోరాననీ సీఎం అన్నారు. తాము కేంద్రాన్ని అడిగితే సింగరేణి ఉద్యోగులకు ఆదాయ పన్ను రద్దు చేస్తే కోల్ ఇండియాకు కూడా వర్తింపజేయాల్సి వస్తుందని చెప్పారే తప్ప ఇన్కంట్యాక్స్ రద్దుపై నిర్ణయం తీసుకోలేదన్నారు. అయినా కేంద్రంపై తాము పోరాటాన్ని ఆపేది లేదని సీఎం కేసీఆర్ చెప్పారు

ఏపీలో స్కూల్స్ బంద్
an hour ago

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?
an hour ago

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
5 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
7 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
2 hours ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
9 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
9 hours ago

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్పై ప్రమాణం చేయగలరా
2 hours ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
4 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
10 hours ago
ఇంకా