రాజకీయాలు కాదు.. మాకు ప్రజల ఆరోగ్యమే ముఖ్యం
21-03-202021-03-2020 18:06:25 IST
2020-03-21T12:36:25.648Z21-03-2020 2020-03-21T12:36:23.325Z - - 16-04-2021

తమకు రాజకీయాలకంటే ప్రజల ఆరోగ్యం ముఖ్యం అన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. సీఎం కేసీఆర్ కరోనా నివారణకు బార్లు, స్కూళ్ళు మూయిస్తే ఆయన కూతురు మాత్రం ఎన్నికల కోసం క్యాంపు నిర్వహించటం దురదృష్టకరం అన్నారు. ఆ క్యాంపులో పలువురి సభ్యులకు అనారోగ్యం ఉన్నట్లు తెలుస్తోందన్నారు. టీఆర్ఎస్కి మెజారిటీ ఉంటే క్యాంపు రాజకీయాలు చేయటం కవిత అసహనానికి నిదర్శనం అన్నారు. కవిత, మంత్రి ప్రశాంత్ రెడ్డి నిర్లక్ష వైఖరిని ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో క్యాంపు రాజకీయాలు చేయటం సిగ్గు చేటన్నారు. ఒక వైపు ప్రధాని కర్ఫ్యూ అంటుంటే టీఆరెస్ మాత్రం క్యాంపు పేరుతో ప్రజాప్రతినిధుల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతోందని, టీఆర్ఎస్ క్యాంపు రాజకీయాలపై కేసీఆర్ స్పందించాలన్నారు. రేపటి జనతా కర్ఫ్యూని అందరూ పాటించాలని, కరోనా రోజు రోజుకి విస్తరిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని, ప్రపంచ అభివృద్ధి ఆగిపోయిందన్నారు ఎంపీ అరవింద్. ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం అవుతున్నాయని, అంతా జాగ్రత్తగా ముందడుగు వేయాలన్నారు. మన కంటే ఇతర దేశాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో వెనుకబడ్డాయి.కేంద్ర ప్రభుత్వ ముందస్తు చర్యల వల్ల మన దేశంలో కరోనా ప్రభావం తక్కువగా ఉందని, కరోనా నివారణ చర్యల్లో మోడీని ప్రపంచ దేశాలు ఫాలో అవుతున్నాయన్నారు. పార్లమెంటు సభ్యులు సైనికులుగా పోరాడాలని మోడీ మాకు సూచించారని, కరోనా విషయంలో మన దేశ మీడియా అవగాహన కల్పించిన తీరు అద్భుతమని మోడీ అన్నారన్నారు. అందరూ ఇంట్లోనే ఉండాలి, అత్యవసర పరిస్థితులుంటేనే బయటికి రండి..ఏప్రిల్ 15 వరకు అందరు ఆత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు. జనతా కర్ఫ్యూ ద్వారా ముందు జాగ్రత్తే కావాలలని పిలుపునిచ్చారు. శుభకార్యాలు కొద్ది రోజులు వాయిదా వేసుకోవాలని, కరోనా విషయంలో ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉండవద్దన్నారు. ఎయిర్ పోర్ట్ సిబ్బంది, రైల్వే, పోలీస్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల తీరు గర్వించదగ్గదని, అంతా శుచి, శుభ్రత మీద దృష్టి పెట్టాలన్నారు. ఆదివారం జనతా కర్ఫ్యూని అందరూ పాటించాలన్నారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్షం వద్దని, మనందరం కలిని కరోనాను నిర్మూలిద్దాం అన్నారు ఎంపీ అరవింద్. ఇంట్లోంచి బయటకు రాకుండానే..కరోనాతో యుద్ధం చేస్తున్న వారిని చప్పట్లతో ప్రోత్సహించాలన్నారు. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నందున అక్కడి వారిని వీలయినంత దూరంగా ఉంచాలని, గల్ఫ్ నుండి వచ్చే వారి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
11 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
6 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
9 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
11 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
14 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
15 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
16 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
18 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
18 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
19 hours ago
ఇంకా