మారుతీరావ్ ఆత్మహత్య వెనుక మిస్టరీ?
09-03-202009-03-2020 09:04:04 IST
2020-03-09T03:34:04.312Z09-03-2020 2020-03-09T03:33:51.964Z - - 19-04-2021

మిర్యాలగూడలో ప్రణయ్ హత్యలో ప్రధాన నిందితుడైన మారుతీరావు ఆత్మహత్య సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. మారుతీరావు ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు.మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడని టీవీలో చూసే తెలుసుకున్నాం.. మరణవార్త అఫిషియల్గా మాకు సమాచారం లేదు.. ప్రణయ్ హత్య నాటి నుంచి నాన్న నాకు టచ్లో లేడు..ప్రణయ్ని చంపిన పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకుని ఉంటారు. మారుతీరావు ఆత్మహత్య చేసుకునే ముందు సూసైట్ నోట్ రాసినట్లు పోలీసులు గుర్తించారు. ‘తల్లీ అమృత అమ్మ దగ్గరికి వెళ్ళిపో....’ అని సూసైడ్ నోట్లో రాసి ఉన్నట్లు తెలిసింది. ఈ ఒక్క విషయమే కాదు.. అమృత గురించి ఇంకా చాలా విషయాలు ప్రస్తావించినట్లు సమాచారం. అయితే పోలీసులు మాత్రం ఆ నోట్ను బయటపెట్టకుండా గోప్యంగా ఉంచుతున్నారు. ఈ ఆత్మహత్యపై ఇప్పుడే ఏం మాట్లాడలేనని అమృత పేర్కొన్న సంగతి తెలిసిందే. ‘నాన్న ఆత్మహత్యపై నాకు క్లారిటీ లేదు. ఆత్మహత్య వ్యవహారంలో నిజానిజాలేంటి అనేది తెలియాల్సి ఉంది. అసలు ఎలా జరిగిందో తెలియదు. ఇప్పుడే ఏమీ స్పందించలేను. అన్ని వివరాలు తెలిసాక స్పందిస్తాను’ అని అమృత మీడియాకు వెల్లడించింది. మరోవైపు మారుతీరావు మృతదేహం మిర్యాలగూడకు చేరుకుంది. పోలీసుల భద్రతల మధ్య మారుతీరావు మృతదేహాన్ని మిర్యాలగూడలోని నివాసానికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఘటనలు జరుగకుండా మారుతీరావు, అమృత ఇంటి వద్ద పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు మారుతీరావు ఆత్మహత్య ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మారుతీరావు మానసిక సంఘర్షణ వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. ఖైరతాబాద్లోని ఆర్యవైశ్యభవన్లో రూం అద్దెకు తీసుకున్న మారుతీరావు తనతో తెచ్చుకున్న పురుగుల మందు సేవించడం, వాంతి చేసుకోవడం, మందుల చీటీ వంటి అంశాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రణయ్ హత్యకు సంబంధించి ఏడునెలలు జైలులో వున్న మారుతీరావు తన కూతురు అమృతను ఇంటికి పిలిపించుకునే ప్రయత్నం చేశాడు. అయితే అమృత అంగీకరించకపోవడమే కాదు పోలీసులకు కూడా ఫిర్యాదుచేయడం మారుతీరావుని బాధించిందని అంటున్నారు. పోలీసులు కేసు నమో దు చేసి రెండోసారి అతడిని అరెస్టు చేశారు. ఈ కేసులో సైతం మారుతీరావు 20రోజులు జైలులో ఉండి బెయిల్పై విడుదలయి వచ్చాడు. ప్రణయ్ హత్య తరువాత కూతురితోపాటు దగ్గరి బంధువులు కూడా తనతో సరిగ్గా ఉండటం లేదనే ఆవేదనతో తీవ్ర ఒత్తిడికి గురయి వుంటాడని అంటున్నారు. హత్యకేసులో ప్రధాన నిందితుడిగా మారుతీరావు ఉండగా.. సుభాష్శర్మ, హజ్గర్ అలీ, మహ్మద్బారీ, కరీం, శ్రవణ్, శివ నిందితులుగా ఉన్నారు. వీరిలో ఒకరిద్దరు మారుతీరావును బెదిరించి, ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వకపోతే పోలీసులకు అప్రూవర్లుగా మారుతామని బెదిరించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆందోళనకు గురైన మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఉస్మానియా ఫోరెన్సిక్ వైద్యులు డాక్టర్ సుధాకర్ నేతృత్వంలోని వైద్యుల బృందం మారుతీరావు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించింది. అనంతరం ఆయన మృతదేహాన్ని భార్య గిరిజ, సోదరుడు శ్రావణ్కు అప్పగించారు. మారుతీరావు అంత్యక్రియలను మిర్యాలగూడలో నిర్వహిస్తారు. మరోవైపు తమ కుటుంబాన్ని వదిలేయండని మారుతీరావు భార్య మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. ఇటు కూతురికి అన్యాయం చేసి, కేసుల మీద కేసులు మారుతీరావుని బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చంటున్నారు. అయితే ఆత్మహత్య విషయంలో పోెలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
3 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
5 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
21 minutes ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
7 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
7 hours ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
2 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
8 hours ago

ఇక కేటీఆర్ టైం వచ్చినట్లేనా
9 hours ago

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం
18-04-2021

చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!
18-04-2021
ఇంకా