భారత్-చైనా ఘర్షణ.. తెలంగాణ కల్నల్ బలిదానం
16-06-202016-06-2020 19:43:09 IST
Updated On 17-06-2020 11:40:34 ISTUpdated On 17-06-20202020-06-16T14:13:09.343Z16-06-2020 2020-06-16T14:12:40.167Z - 2020-06-17T06:10:34.604Z - 17-06-2020

ఒకవైపు కరోనా వైరస్ తో ప్రపంచం యుద్దం చేస్తుంటే సరిహద్దుల్లో మాత్రం భారతీయ సైనికులకు ముష్కరులు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. ఒకవైపు పాక్, మరో వైపు చైనా కవ్వింపులకు పాల్పడుతోంది. తాజాగా చైనా సరిహద్దులో సైనికుల ఉపసంహరణ జరుగుతుంటే.. చైనా సైనికులు ఘర్షణకు దిగారు. భారత్-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు సైనికులు అమరులయ్యారు. దేశంకోసం ప్రాణత్యాగం చేసినవారిలో తెలంగాణ లోని సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు ఉండడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి, కల్నల్ సంతోష్ మృతిపై అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంతోష్ ఏడాదిన్నరగా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఈమధ్యే హైదరాబాద్ బదలీ అయినా కరోనా వైరస్ వల్ల అక్కడే ఉండిపోయాడు. త్వరలో తన భర్త వచ్చేస్తాడని ఆశించిన భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్(4)లు షాక్ కి గురయ్యారు. వీరు ఢిల్లీలో వున్నారు. లద్దాఖ్లోని గాల్వన్ లోయ వద్ద సరిహద్దుల్లో భారత్, చైనా బలగాలు బాహాబాహీకి దిగాయి. ఈ గొడవల్లో భారత సైన్యానికి చెందిన ఓ కల్నల్ సంతోష్ బాబుతో పాటు ఇద్దరు సైనికులు అమరులయ్యారు. లద్దాఖ్లోని గాల్వన్ లోయ వద్ద సోమవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు. సంతోష్ కోరుకొండ సైనిక్ స్కూలులో విద్యాభ్యాసం పూర్తి చేశారు. తండ్రి ఉపేందర్ స్టేట్ బ్యాంకులో మేనేజర్గా పనిచేసి పదవీ విరమణ పొందారు. సంతోష్ మరణ వార్త విని ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. సంతోష్ అత్తగారు తీవ్ర వేదనకు గురికావడంతో బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. తల్లి తీవ్ర ఆవేదనతో వున్నారు. తన ఒక్కగానొక్క కొడుకు దేశం కోసం త్యాగం చేశాడని గర్వంగా ఉన్నా, గర్భశోకంతో బాధ అనుభవిస్తున్నానని తల్లి మంజుల అన్నారు. ఈఘటన రాత్రి జరిగినా ఈ విషాద వార్త తనకు చెబితే తన ఆరోగ్యం పాడవుతుందని తన కోడలు చెప్పలేదని ఆమె కన్నీరుమున్నీరవుతున్నారు.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
6 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
9 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
12 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
3 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
13 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
10 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
13 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
13 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
7 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
16 hours ago
ఇంకా