నియోజకవర్గాల పెంపు ఎన్పీఆర్ మధ్య లింకు పెట్టారా?
01-03-202001-03-2020 12:37:27 IST
2020-03-01T07:07:27.506Z01-03-2020 2020-03-01T07:07:21.505Z - - 16-04-2021

ఇప్పుడున్న రెండు తెలుగు రాష్ట్రాలలో అధికార పార్టీలకు నియోజకవర్గాల పెంపు చాలా అవసరం. ఎందుకంటే అధికార టీఆర్ఎస్, వైసీపీ రెండు పార్టీలు మరే ఇతర పార్టీలలో లేనంతగా నేతలతో ఫుల్ లోడ్ అయి ఉన్నాయి. అటు ఏపీలో శాసన మండలి రద్దు నిర్ణయంతో వచ్చే ఎన్నికలలో నేతలు ఎమ్మెల్యే స్థానాలపై చాలా ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు తెలంగాణలో దాదాపు అన్ని పార్టీలలో నలుగురైదుగురు మినహా మిగతా మేలైన నేతలందరినీ గులాబీ పార్టీ ఆకర్షించి కారెక్కించుకుంది. ఇప్పుడు ఆ పార్టీకి నియోజకవర్గాల పెంపు చాలా అవసరం. రాష్ట్ర పరిధిలోది.. కేసీఆర్ చేతిలో పని కావడంతో అనుకున్న దానికన్నా ఎక్కువగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే, నియోజకవర్గాల పెంపు అంశం కేంద్రం పరిధిలోది. నిజానికి రాష్ట్ర విభజన అనంతరమే రెండు రాష్ట్రాలలో ఈ ఆశలు మొదలయ్యాయి. ఒక్క తెలంగాణ విషయమే తీసుకుంటే ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి రెండు అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 34 కొత్త స్థానాలు ఏర్పడతాయి. దీంతో మంత్రివర్గంలో మంత్రుల సంఖ్య కూడా పెరుగుతుంది. వీటితో పాటే ఎమ్మెల్సీల సంఖ్య కూడా పెరుగుతుంది. అదే జరిగితే మరో నలభై, యాభై మంది నేతలకు పదవులు దక్కుతాయి. ఇక ఏపీలో మండలి రద్దుతో వైసీపీకి అయితే సీట్ల పెంపు జరగకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అసంతృప్తులను చల్లార్చడం ఆ పార్టీ పెద్దల వలన జరగని పని అని ఇప్పటికే రాజకీయ మేధావుల మాట. అందుకే కొత్త, పాత తేడా లేకుండా అందరూ సీట్ల పెంపుపై ఆశలు పెట్టుకున్నారు. ఇంతగా రెండు రాష్ట్రాలు ఆశలు పెట్టుకున్నా కేంద్రం మాత్రం 2026 వరకు ఆ విషయం జోలికి వెళ్లే అవకాశమే లేదని తేల్చిచెప్పడం విశేషం. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తాజాగా ఈ విషయంపై మరోసారి స్పష్టత ఇచ్చారు. వచ్చే ఏడాది జనన గణన లెక్కలు.. అనంతరం 2026కి సీట్ల పెంపు ఆలోచన చేస్తామని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే, కేంద్రం తీసుకొచ్చిన సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్లను రెండు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. మరీ ముఖ్యంగా సీఎం కేసీఆర్ అయితే కత్తికట్టికొని ఉన్నారు. నియోజకవర్గాల పెంపు వలన బీజేపీకి రెండు రాష్ట్రాలలో కూడా ఒరిగేదేమీ లేదు. ఆ పార్టీకి అవసరం లేదు. అవసరం ఉన్న రాష్ట్రాల పార్టీలు కేంద్రానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ రాష్ట్రాలలో వాటి ప్రకారం జననగణన కూడా సక్కగా జరుగుతుందో లేదో కూడా అనుమానమే. అందుకే దాని తర్వాతే సీట్ల పెంపు అని మెలిక పెట్టారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
11 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
7 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
9 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
12 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
14 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
16 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
17 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
18 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
19 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
20 hours ago
ఇంకా