నిన్నటి దాకా మీ ద్వేషిని.. నేడు అభిమానిని.. కేటీఆర్ కు నెటిజన్ ట్వీట్!
21-04-202021-04-2020 15:02:33 IST
Updated On 21-04-2020 15:23:36 ISTUpdated On 21-04-20202020-04-21T09:32:33.879Z21-04-2020 2020-04-21T09:32:30.904Z - 2020-04-21T09:53:36.613Z - 21-04-2020

తెలంగాణ మంత్రి.. ప్రభుత్వంలో నెంబర్ 2 స్థానంలో ఉన్న కేటీఆర్ ను అయన పార్టీ వారు.. రాజకీయ వర్గాలలో కొందరు షాడో సీఎంగా పిలుచుకుంటారు. అందుకు తగ్గట్లే కేటీఆర్ ఇటు ప్రభుత్వంలో అటు పార్టీలో ఎంతో చురుకుగా ఉంటారు. ఇక కేటీఆర్ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటారు. అయితే ఆయనేం ఏదో కాలయాపనకో.. లేక సరదాకో సోషల్ మీడియాలో ఉండరు. సోషల్ మీడియా.. ముఖ్యంగా ట్విట్టర్ ద్వారానే ఆయన ఇప్పటికే చాలా మందికి సహాయపడ్డారు. గత రెండు రోజుల క్రితం జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. హైదరాబాద్ లోని బోరబండకి చెందిన ఓ వ్యక్తి భార్య చనిపోతే రెండేళ్ల బాబును తానే దగ్గరుండి చూసుకుంటున్నారు. అయితే బాబు అర్ధరాత్రి పాల కోసం ఏడుపు ఆపకపోవడం.. లాక్ డౌన్ వేళ బయట దొరికే పరిస్థితి లేకపోవడంతో కేటీఆర్ కు ట్వీట్ చేశారు. అంతే నగర డిప్యూటీ మేటర్ ఫసియుద్దీన్ బోరబండకి వెళ్లి ఆవ్యక్తి అవసరాలను తీర్చారు. ఇదొక్కటే కాదు.. ఎన్నో సమస్యలు.. పోలీసుల వద్దకి వెళ్లినా స్పందన లేని కేసులను కూడా కేటీఆర్ దృష్టికి తేవడంతో పరిష్కారాలు చూపడం వంటి ఎన్నో సందర్భాలు చూసాం. అయితే.. ఇప్పుడు మాత్రం ఓ నెటిజన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సుధీర్ అనే యువకుడు ట్విట్టర్ లో 'నేను తెలంగాణకు చెందినవాడిని కాదు.ఇన్నాళ్లుగా మిమ్మల్నీ, మీ నాన్నని ద్వేషించాను. కానీ ఇప్పుడు మీ పాలన చూసి అభిమానిగా మారిపోయాను. ఒక్క తెలంగాణకే కాదు.. దేశం మొత్తం మీ న్యాయకత్వాన్ని పొందుతుందని ఆశిస్తున్నాను'. అంటూ కేటీఆర్ ని ఉద్దేశించి ట్వీట్ చేశాడు. కాగా... ఆ నెటిజన్ ట్వీట్ కి కేటీఆర్ స్పందించిన తీరు మరింత ఆకట్టుకుంటోంది. ‘‘మీ ఫ్రాంక్నెస్కు, నిష్కల్మష ప్రవర్తనకు ధన్యవాదాలు. మీలో వచ్చిన పరివర్తనకు అభినందనలు. మీ హృదయంలో ద్వేషం స్థానంలో అభిమానం చోటుచేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అంటూ కేటీఆర్ రిప్లై ఇచ్చారు. ఇప్పుడు వీరి సంభాషణ ట్విట్టర్ లో హైలెట్ గా నిలిచింది. నెటిజన్ ట్వీట్ బదులుగా మరికొందరు నెటిజన్లు అదే అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తాము అదే నమ్ముతున్నామన్నారు. మొత్తం ఈ ట్వీట్స్ తో తెలంగాణ ప్రజలు.. కేటీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. నిజానికి తెలంగాణ ఉద్యమ కాలంలో తలంగాణేతరులకు కేసీఆర్ పై చాలా వ్యతిరేకత ఉండేది. ఉద్యమంలో భాగంగా స్థానికత ఆధారంగా ద్వేషాలు తీవ్రంగా ఉండేవి. అందుకే ఇతర రాష్ట్రాల నుండి వచ్చి తెలంగాణలో ఉండే వారంతా అదే అభిప్రాయంతో ఉండేవారు. కానీ, ఒక్కసారి ప్రభుత్వం ఏర్పాట్లయ్యాక ఆరేళ్ళ కాలంలో ఎక్కడా కూడా స్థానికత ఆధారంగా విద్వేషాలు లేనేలేవు. మరోవైపు పాలనలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం మెరుగైన ఫలితాలను సాధిస్తుందనే అభిప్రాయం ప్రజలలో నెలకొంది. దీంతో ఒకనాడు ద్వేషంతో నిండిన మనసులలో మెల్లగా ప్రేమ మొదలైంది. అదే సుధీర్ అనే నెటిజన్ ద్వారా బయటకి వచ్చింది.

ఏపీలో స్కూల్స్ బంద్
32 minutes ago

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?
13 minutes ago

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
5 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
6 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
2 hours ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
8 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
9 hours ago

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్పై ప్రమాణం చేయగలరా
an hour ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
3 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
9 hours ago
ఇంకా