తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫిక్స్...?
18-01-202018-01-2020 11:42:31 IST
Updated On 20-01-2020 17:34:11 ISTUpdated On 20-01-20202020-01-18T06:12:31.143Z18-01-2020 2020-01-18T06:12:28.880Z - 2020-01-20T12:04:11.350Z - 20-01-2020

తెలంగాణ కాంగ్రెస్ పేరుకే పెద్దన్న అయినా పార్టీ మాత్రం పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఆ పార్టీ నేతలు సవాలక్ష కారణాలతో తడబడుతూ పార్టీని ప్రజలలో పలచన చేశారు. గత ఏడాది ఎన్నికలలో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీగా ప్రజలలో బజ్ క్రియేట్ చేసినా పార్టీ చివరికి ఘోరపరాజయం చవిచూసి ప్రతిపక్ష స్థానంతో సరిపెట్టుకున్నారు. అధికార పార్టీ గులాబీ బాస్ కాంగ్రెస్ నేతలలో కొరవడిన సమన్వయాన్ని క్యాష్ చేసుకుంటూ ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. అయినా ఆ పార్టీ నేతల తీరు మారలేదు. ఏపీలో తుడిచిపెట్టుకుపోతుందని తెలిసినా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించినా ఆ త్యాగాన్ని ప్రజలలో ఓట్లగా మలచడంతో కాంగ్రెస్ లీడర్లు కేసీఆర్ తో పోటీపడలేకపోయారు. ఇక తొలి నుండి పార్టీలో ఉండే గ్రూపు తగాదాలు.. ఆధిపత్య పోరు ఓటమితో ఇంకా పెచ్చుమీరడం ఆశ్చర్యం కలిగించక మానదు. ప్రస్తుతానికి ఆ పార్టీకి రాష్ట్రంలో సత్తా గల అధినాయకుడు కరువయ్యారు. పేరుకి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నా మున్సిపల్ పోరుకి ముందే తాను అధ్యక్షుడిగా ఉండలేనని అధిష్టానం వద్ద చెప్పేసి చేతులెత్తేశారు. ఎన్నికల ముందు కొత్త పంచాయతీ ఎందుకని ఆయననే కొనసాగిస్తుంది. అయితే, ఉత్తమ్ తర్వాత ఆ పదవి ఎవరిని వరిస్తుందన్నది ఇప్పటికే అధిష్టానం వద్ద స్పష్టమైన రిపోర్ట్ ఉందని తెలుస్తుంది. నిజానికి ఈ పదవికి దాదాపు డజను మంది పోటీపడుతున్నారు. సీనియర్లలో వీహెచ్, భట్టి, కోమటిరెడ్డి, జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి లాంటి వాళ్ళతో పాటు పార్టీలో వయసు తక్కువే అయినా ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ గా సత్తా చూపించిన రేవంత్ రెడ్డి కూడా రేసులో ఉన్నారు. కాగా అధిష్టానం మాత్రం ప్రభుత్వాన్ని ఢీకొట్టే నేతగా రేవంత్ కే మొగ్గుచూపినట్లుగా తెలుస్తుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్గా ఆ పార్టీలో సీనియర్ నేతలలో ఒకరైన మాజీ మంత్రి శైలజానాథ్ పేరును ఏఐసీసీ ప్రకటించింది. శైలజానాధ్ దళితవర్గానికి చెందిన నేత కాగా.. వర్కింగ్ ప్రెసిడెంట్లు తులసిరెడ్డి, షేక్ మస్తాన్ వలీని ప్రకటించి అధిష్టానం సామజిక సమతౌల్యం పాటించింది. ఏపీపిసిసితో పాటు తెలంగాణ పిసిసి ప్రక్షాళన కూడా జాగ్రల్సి ఉండగా మున్సిపల్ ఎన్నికల ఎఫెక్ట్ తో వాయిదా పడినట్లుగా తెలుస్తుంది. అయితే వాయిదా పడింది ప్రకటన మాత్రమేనని.. కమిటీ మాత్రం అధిష్టానం వద్ద ఫిక్స్ అయిపోయిందంటున్నారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేసారని, మున్సిపల్ ఎన్నికల అనంతరం ఫిబ్రవరి మొదటివారంలో ప్రకటన వెలువడుతుందని పార్టీ వర్గాలలో వినిపిస్తుంది. మరి ప్రకటన సమయానికి రేవంత్ పేరే ఉంటుందా? లేక మారుతుందా? అప్పటి వరకు సీనియర్లు రాయబారాలు చేయకుండా ఉంటారా? అన్నది వేచిచూడాల్సి ఉంది.

ఏపీలో స్కూల్స్ బంద్
an hour ago

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?
28 minutes ago

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
5 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
6 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
2 hours ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
9 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
9 hours ago

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్పై ప్రమాణం చేయగలరా
an hour ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
3 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
9 hours ago
ఇంకా