తెలంగాణలో రైతుబజార్లలోనూ సామాజిక దూరం
29-03-202029-03-2020 08:45:50 IST
2020-03-29T03:15:50.148Z29-03-2020 2020-03-29T03:15:47.365Z - - 16-04-2021

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం మరిన్ని ముమ్మర చర్యలు చేపట్టింది. చాలా చోట్ల ప్రజలు నిత్యావసరాలు, కూరగాయల కొనుగోళ్ల కోసం గుంపులుగుంపులుగా వస్తున్న దృష్ట్యా, దీన్ని నిరోధించడానికి రైతుబజార్లను విశాల ప్రదేశాలకు, ఖాళీ ప్రదేశాలకు తరలిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా, మండల కేంద్రాల్లో ఖాళీగా ఉన్న క్రీడా మైదానాలు, బస్టాండ్లు, కళాశాల, పాఠశాలల ప్రాంగణాల్లో కూరగాయల విక్రయాలకు చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై ఇప్పటికే జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఇప్పటికే హైదరాబాద్ చింతలబస్తీ లోని మార్కెట్ను పక్కనే ఉన్న రాంలీలా మైదానంలోకి తరలించారు. సంగారెడ్డిలో సైతం కలెక్టరేట్ వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో కూరగాయల అమ్మకాలు చేపట్టగా, కరీంనగర్ బస్టాండును మార్కెట్గా మార్చేశారు. చాలా చోట్ల ఇదేమాదిరి రైతుబజార్లను తరలించి కొనుగోలుదారుల మధ్య సామాజిక దూరం ఉండేలా మార్కింగ్ చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు హైదరాబాద్కే పరిమితమైన రైతుబజార్లను జిల్లాల్లో కూడా ఏర్పాటు చేసేలా చర్యలు మొదలు పెట్టారు. దీనిద్వారా ఎక్కడివారికి అక్కడే నిత్యావసరాలు అందుబాటులోకి తేవడంతోపాటూ గుంపులను నివారించే చర్యలు తీసుకుంటున్నారు. కాగా లాక్డౌన్ పేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ బుకింగ్లకు డిమాండ్ పెరగడంతో ఆయిల్ కం పెనీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. వినియోగదారులు ఒకటికి మించి ఎక్కువ గ్యాస్ బుకింగ్లు చేయకుండా పలు ఆంక్షలు విధించాయి. ఒక బుకింగ్ జరిగాక, రెండో బుకింగ్కు కనీసం 14 రోజుల గ్యాప్ ఉండేలా ఆంక్షలు తెచ్చాయి. ఈ మేరకు హెచ్పీ, భారత్గ్యాస్, ఇండేన్ గ్యాస్లు నిర్ణయం తీసుకున్నాయి. గతంలో కేవలం ఒక్క రోజు తేడాతో రెండో బుకింగ్కు సైతం సిలిండర్ సరఫరా చేసేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో డిమాండ్ పెరుగుతుండటం, వినియోగదారులు రెండుమూడు సిలిండర్లను బుక్ చేసుకుంటున్న నేపథ్యంలో ఈ ఆంక్షలు ఫలితాలనిస్తాయని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. మరోపక్క కేంద్రం ఉజ్వల పథకం కింది లబ్ధిదారులకు వచ్చే మూడు నెలల పాటు ఉచితంగా గ్యాస్ అందిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనూ బుకింగ్లు పెరగడంతో కంపెనీలు జాగ్రత్తలు తీసుకున్నాయి.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
12 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
8 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
10 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
12 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
15 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
16 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
18 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
19 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
20 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
20 hours ago
ఇంకా