తెలంగాణలో మరో 983 మందికి కరోనా.. 14,400 పాజిటివ్ కేసులు
29-06-202029-06-2020 12:31:14 IST
Updated On 29-06-2020 14:16:47 ISTUpdated On 29-06-20202020-06-29T07:01:14.692Z29-06-2020 2020-06-29T07:01:08.033Z - 2020-06-29T08:46:47.290Z - 29-06-2020

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. తాజాగా మరో 983 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 14,419కి చేరింది. ఇందులో 9వేల మంది వివిధ ఆస్పత్రులు, హోంఐసోలేషన్లలో చికిత్స పొందుతుం డగా.. 5,172 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఆదివారం నలుగురు మృతి చెందగా.. ఇప్పటివరకు కరోనాతో చనిపోయినవారి సంఖ్య 247కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 816 ఉండగా.. రంగారెడ్డిలో 47, మంచి ర్యాలలో 33, మేడ్చల్లో 29, వరంగల్ రూరల్లో 19, వరంగల్ అర్బన్లో 12, కొత్తగూడెంలో 5, కరీంనగర్, సిద్దిపేట, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో 3 చొప్పున, ఆదిలాబాద్, గద్వాల జిల్లాల్లో 2 చొప్పున, సంగారెడ్డి, మహబూబ్నగర్, జనగామ, మెదక్, సూర్యాపేట, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కో కేసు ఉన్నట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 3,227 మందికి పరీక్షలు నిర్వహించగా ఏకంగా 30% మందికి పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు మొత్తం 82,458 మందికి పరీక్షలు నిర్వహించగా 17.48%మందికి పాజిటివ్ వచ్చింది. బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఈనెల 24న అక్కడి ఐసోలేషన్ వార్డు నుంచి 47 మంది శాంపిల్స్ సేకరించి వరంగల్ ఎంజీఎంకు పంపించగా, ఆదివారం 31 మందికి పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయింది. వీరిలో బెల్లంపల్లి పట్టణానికి చెందినవారు 30 మంది ఉండగా, మందమర్రికి చెందిన ఓ వ్యక్తి ఉన్నారు. ఓ సింగరేణి కార్మికుడి నుంచి వారందరికీ వైరస్ సోకినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. నారాయణఖేడ్ కరోనాతో నారాయణఖేడ్ మండలం నిజాంపేట్ గ్రామానికి చెందిన 7 నెలల బాలుడు ఆదివారం తెల్లవారుజామున మరణించాడు. పదిరోజుల క్రితం అనారోగ్యానికి గురైన బాలుడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈనెల 24న అతడికి పాజిటివ్ అని తేలడంతో గాంధీ ఆస్పత్రికి తరలించగా..చికిత్స పొందుతూ చనిపోయాడు. తెలంగాణలో కేంద్ర బృందం పర్యటన తెలంగాణలో కేంద్ర బృందం మరోసారి పర్యటించనుంది. క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షిస్తోంది. మొదట టిమ్స్కు వెళ్లి అక్కడి పరిస్థితులను సమీక్షిస్తుంది. ఇప్పటికే రాష్ట్రాల్లో కరోనా పరిస్థితిపై అంచనా వేయడానికి ఎప్పటికప్పుడు కేంద్ర బృందాలు పర్యటిస్తున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి అగర్వాల్ నేతృత్వంలో ఈ బృందం పర్యటిస్తోంది. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్రాల అధికారులతో చర్చించనుంది. దేశంలో కరోనా ప్రవేశించిన నాటి నుంచి కేంద్రం తమ బృందాలను పంపి రాష్ట్రప్రభుత్వాల అప్రమత్తతతో సమాచారాన్ని సేకరిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితుల ఆధారంగా సూచనలు, సలహాలు ఇస్తోంది. ఏప్రిల్ 25 నుంచి మే 2 వరకు లాక్ డౌన్ సమయంలో తెలంగాణలో సెంట్రల్ టీమ్ పర్యటించింది. కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు పరిస్థితులను సమీక్షించింది. లాక్ డౌన్ సడలింపుల తర్వాత కూడా కరోనా రోగులకు అందుతున్న వైద్యం, వ్యాధి నివారణకు తీసుకుంటున్న చర్యలపై పరిశీలించింది.

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
28 minutes ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
2 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
3 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
5 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
5 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
6 hours ago

వన్ ప్లస్ వన్ ఆఫర్
4 hours ago

నా రూటే సెపరేటు
8 hours ago

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
21 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
a day ago
ఇంకా