తెలంగాణలో టెస్టులు తక్కువే.. కేసులు కూడా!
17-08-202017-08-2020 14:24:52 IST
2020-08-17T08:54:52.203Z17-08-2020 2020-08-17T08:54:39.823Z - - 10-04-2021

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కోరకంగా నమోదవుతున్నాయి. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 8794 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 894 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 92,255 కు చేరింది. కొత్తగా 2006 మంది వైరస్ బారి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 70,132 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,420 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా 10 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 703 కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా రికవరీ రేటు 76.01 శాతంగా ఉంది. ఈమేరకు వైద్యారోగ్యశాఖ సోమవారం హెల్త్ బులెటిన్లో పేర్కొంది. తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం 7,53,349 వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశామని తెలిపింది. మరో తెలుగు రాష్ట్రం ఏపీతో పోలిస్తే తెలంగాణలో పరీక్షల సంఖ్య చాలా తక్కువగా వుంది. తెలంగాణలో 9వేలకు మించి జరగడం లేదు. అదే ఏపీలో 50వేల వరకూ టెస్టులు నిర్వహిస్తున్నారు. దీంతో కేసులు కూడా 8వేల నుంచి 9వేల వరకూ నమోదవుతున్నాయి. ఏపీలో ఇప్పటి వరకు మొత్తం 28,60,943 పరీక్షలు నిర్వహించారు. తాజాగా 88 మంది మృతితో మొత్తం మరణాలు 2,650కి చేరాయి. యాక్టివ్ కేసులు 85,945 ఉన్నాయి. రాష్ట్ర జనాభాలో 5.35 శాతం మందికి కోవిడ్ టెస్టులు జరిగాయి. దేశంలో అత్యంత ఎక్కువ టెస్టులు నిర్వహించిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది. టెస్టుల సంఖ్య ఎక్కువగా వుండడం వల్లే ఏపీలో కేసు సంఖ్య 3 లక్షలకు చేరువ అవుతోంది. అదే తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 92 వేలు దాటాయి. మరోవైపు కోవిడ్ చికిత్స అందిస్తున్న గాంధీ ఆస్పత్రిలో వెంటిలేటర్లు లేక రోగులు కార్పోరేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్పి వస్తోంది. 1890 పడకల సామర్థ్యం ఉన్న ప్రతిష్టాత్మాక గాంధీ జనరల్ ఆస్పత్రిలో రోగుల నిష్పత్తికి తగినన్ని వెంటిలేటర్లు అందుబాటులో లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి చేరుకున్న పేద, మధ్య తరగతి రోగులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సాధారణ ఐసోలేషన్ వార్డులో 390 పడకలు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం 144 మంది చికిత్స పొందుతున్నారు. 1000 పడకలకు ఆక్సిజన్ ఏర్పాటు చేయగా, వీటిలో 117 మంది చికిత్స పొందుతున్నారు. ఇక కీలకమైన ఐసీయూలో 500 వెంటిలేటర్ పడకలు ఉండగా, ప్రస్తుతం ఇవన్నీ రోగులతో నిండిపోయాయి. ప్రభుత్వ గాంధీ ఆస్పత్రిలోనే కాదు...సికింద్రాబాద్, మాదాపూర్, మలక్పేట్, బంజారాహిల్స్, సోమాజిగూడలోని పలు ప్రతిష్టాత్మాక కార్పొరేట్ ఆస్పత్రుల్లోని ఐసీయూ వెంటిలేటర్ పడకలు కూడా దాదాపు నిండిపోయాయి. ఇతర ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలు ఖాళీగా ఉన్నప్పటికీ..వాటిలో చేరేందుకు వెనుకాడుతున్నారు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
6 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
2 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
4 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
9 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
12 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
13 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
a day ago

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా