టీఆర్ఎస్ సర్కార్ తీరుపై కాంగ్రెస్ ఫైర్
07-09-202007-09-2020 10:00:21 IST
Updated On 07-09-2020 08:09:18 ISTUpdated On 07-09-20202020-09-07T04:30:21.353Z07-09-2020 2020-09-07T02:20:01.291Z - 2020-09-07T02:39:18.813Z - 07-09-2020

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసుల పనితీరుపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. పోలీసులు వన్సైడ్గా పని చేస్తున్నారని, ప్రతిపక్షాన్ని తొక్కేస్తున్నారని టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కార్ కి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారన్నారు. డీసీసీ అధ్యక్షులు అంశాల వారీగా పోరాటాలు చేయాలి. ప్రజల సమస్యలపై క్షేత్ర స్థాయిలో పోరాటానికి సిద్ధం కావాలి. గత ఎన్నికలలో టీఆర్ఎస్కు అండగా ఉన్న వర్గాలు ఇప్పుడు బలంగా వ్యతిరేకిస్తున్నాయి. వాళ్లంతా మనవైపు వస్తున్నారు. వచ్చే ఎన్నికలలో కచ్చితంగా కాంగ్రెస్ వైపు వస్తారు. భవిష్యత్ కాంగ్రెస్ పార్టీదే. నేను మీకు నిరంతరం అండగా అందుబాటులో ఉంటాను, కొట్లాడుదాం.. గుర్తింపు తెచ్చుకుందాం. పార్టీని మరింత బలోపేతం చేద్దామన్నారు ఉత్తమ్. మనం అధికారానికి దూరంగా వున్నాం. అయినా మీ కష్టానికి ఫలితం దక్కుతుంది. రాబోయే ఎన్నికలలో మనమే గెలుస్తాం. డీసీసీ అధ్యక్షులు కష్టపడి పని చేస్తున్నారు. అధికారంలో లేకున్నా పార్టీ పటిష్టంగా ఉందంటే డీసీసీ అధ్యక్షులు చేస్తున్న కృషే కారణం అన్నారు ఉత్తమ్. గ్రామాల్లో, క్షేత్రస్థాయిలో బలమయిన క్యాడర్ వుంది. 2014, 18 ఎన్నికలలో ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. కేసీఆర్ పాలనపై ఇప్పుడు ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. రాష్ట్రంలో కేసీఆర్ పాలన విపరీతమైన అవినీతికి ఆస్కారం ఇస్తోంది. ఎన్నికలలో టీఆర్ఎస్ అవినీతి సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేస్తోందన్నారు. ప్రభుత్వంపై పోరాటం కొనసాగిద్దామన్నారు. ఇటు రాబోయే కార్పోరేషన్ల ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పాలన్నారు ఎంపీ రేవంత్ రెడ్డి. గ్రేటర్లో ఇప్పటివరకు కేవలం 128 ఇళ్లు మాత్రమే కట్టారని, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వకపోవడం వల్ల కిరాయి రూపంలో పేదలపై రూ.1,200 కోట్ల భారం ప్రజలపై పడిందని చెప్పారు. హైదరాబాద్లో అద్భుతాలు సృష్టించినట్టు కేటీఆర్ గొప్పలు చెబుతున్నారని, పేద ప్రజలకు ఉపయోగపడే చోట ఎక్కడా రోడ్లు కూడా వేయలేదని ఎద్దేవా చేశారు. అక్టోబర్ 3 నుంచి తన మల్కాజ్ గిరి నియోజకవర్గం పరిధిలో ‘డివిజన్ యాత్ర’చేపడుతున్నానని, టీఆర్ఎస్ విస్మరించిన హామీలపై ప్రజలను చైతన్య పరుస్తానని రేవంత్ చెప్పారు. ఖమ్మం మేయర్ పాపలాల్ అవినీతి పరుడని సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేశారని, దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు పాలన చేశారని పార్టీ నేత కుసుమకుమార్ ఆరోపించారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వరంగల్ పర్యటనలో సీఎం కేసీఆర్ ప్రజలకు అనేక హామీలిచ్చారని, కనీసం డబుల్ బెడ్రూం ఇళ్లు కూడా ఇవ్వని కేసీఆర్కు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. అసమర్థ టీఆర్ఎస్ పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు.

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
4 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
5 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
an hour ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
8 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
8 hours ago

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్పై ప్రమాణం చేయగలరా
25 minutes ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
2 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
8 hours ago

ఇక కేటీఆర్ టైం వచ్చినట్లేనా
10 hours ago

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం
18-04-2021
ఇంకా