గుప్త నిధుల కోసం ప్రభుత్వం ... రంగంలోకి నిజాం వారసులు
18-07-202018-07-2020 13:00:21 IST
Updated On 18-07-2020 17:34:08 ISTUpdated On 18-07-20202020-07-18T07:30:21.940Z18-07-2020 2020-07-18T07:30:18.998Z - 2020-07-18T12:04:08.636Z - 18-07-2020

తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులు ప్రారంభం అయ్యాక దాని అసలు ఉద్దేశంపై భిన్న రకాల వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. సచివాలయ భవనాల్లోని జీ బ్లాక్ భవంతి కింద రహస్య నిధులు ఉన్నాయనే వాదనలు తెరపైకి వచ్చాయి. దీనికి సంబంధించిన కొన్ని కథనాలు గతంలో కేసీఆర్ సొంత పత్రిక సహా, కొన్ని జాతీయ పత్రికల్లో సైతం వచ్చినట్లు ఇటీవలే కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పేపర్ కటింగ్లను చూపించారు. హడావుడిగా సచివాలయ కూల్చివేత పనులు మొదలు పెట్టడం, చుట్టూ 3 కిలోమీటర్ల వరకూ సంచారంపై నిషేధం విధించడం, సీఎం కేసీఆర్.. సీఎస్, డీజీపీలతో రహస్య సమీక్ష నిర్వహించడం వంటి పరిణామాలు ఆ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నారని రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. నిజం నిర్మించిన సైఫాబాద్ ప్యాలెస్ (ప్రస్తుత సచివాలయ జీ బ్లాక్) కింద రహస్య నిధులు ఉన్నాయని పురావస్తు శాఖ గతంలోనే గుర్తించిందని, వాటి అన్వేషణ కోసం అనుమతి కోరితే కేసీఆర్ ప్రభుత్వం నిరాకరించిందని వార్తలు వచ్చినట్లు అప్పుడు రేవంత్ అన్నారు. మరోవైపు, తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేసేందుకు హైకోర్టు రెండోసారి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మళ్లీ శుక్రవారం సాయంత్రం నుంచి కూల్చివేత పనులు మొదలయ్యాయి. ఈ క్రమంలో రహస్య నిధులు ఉన్నాయనే వాదనలు వస్తున్న వేళ నిజాం వారసులు ఎంట్రీ ఇచ్చారు. ఆఖరి నిజాం (7వ) అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మనవడైన నవాబ్ నజఫ్ అలీ ఖాన్ దీనిపై స్పందించారు. మహ్మదీయ రాజులెవరికీ నేలలో నిధులు దాచే అలవాటు లేదని క్లారిటీ ఇచ్చారు. భూమి మినహా ఇతర ఆస్తులు కూడబెట్టడం పాపమని ఖురాన్లో స్పష్టంగా రాసి ఉందని గుర్తు చేశారు. నిజాం రాజులు సొరంగాల్లో గుప్త నిధులు దాచారనే ప్రచారాన్ని నజఫ్ అలీ ఖాన్ ఖండించారు. వాస్తవానికి తమ తాత అయిన ఏడో నిజాం వేసవి విడిది కోసం సైఫాబాద్ ప్యాలెస్ కట్టించుకున్నారని తెలిపారు. అయితే, కట్టడం పూర్తయ్యాక అక్కడకు వెళ్లిన తొలిరోజు ఆయనకు ఎదురుగా తొండ కనిపించడంతో దాన్ని అపశకునంగా భావించిన ఆయన మళ్లీ ఆ వైపునకు వెళ్లలేదని స్పష్టం చేశారు. కాలక్రమేణా ఆ భవనమే సచివాలయంగా రూపాంతరం చెందిందని వివరించారు. భవనాల కింద అక్కడ రహస్య నిధి నిక్షేపాలు ఉంటాయనే ప్రచారం తప్పని ఆయన చెప్పారు.

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్
36 minutes ago

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!
an hour ago

తిరుపతిలో కొనసాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్
4 hours ago

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెపరేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేనట్లే
2 hours ago

సభ్య సమాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామని అక్కా
5 hours ago

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!
19 hours ago

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు
a day ago

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు
20 hours ago

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ
16-04-2021

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!
a day ago
ఇంకా