గాంధీ ఆసుపత్రి వైద్యుల మద్దతుతోనే వైరస్ను జయించాం.. కరోనా రోగుల మనోగతం
09-04-202009-04-2020 10:38:06 IST
Updated On 09-04-2020 10:39:35 ISTUpdated On 09-04-20202020-04-09T05:08:06.106Z09-04-2020 2020-04-09T05:08:03.935Z - 2020-04-09T05:09:35.111Z - 09-04-2020

దాదాపు 14 రోజుల పాటు క్వారంటైన్లో ఏకాంతంలో ఉండి అనుభవించిన దుర్భర పరిస్థితులనుంచి.. గాంధీ ఆసుపత్రిలోని వైద్యులు, సిబ్బంది ఇచ్చిన మనోధైర్యంతోటే కరోనా వైరస్నుంచి బయటపడ్డామని డిశ్చార్జి అయిన వారు చెబుతున్నారు. కరోనా మహమ్మారి బారినపడి నరకం అనుభవించినప్పటికీ ఆసుపత్రిలో తమకు ఇచ్చిన సూది మందులు, ఇతర మెడిసిన్స్తో కంటే వైద్యులిచ్చిన మనో ధైర్యంతోనే దానిని జయిం చాం’ అని చెబుతున్నారు ఆ వైరస్ బారి నుంచి విజయ వంతంగా బయటపడిన వారు. కరోనా వైరస్ సోకినట్లు తమకు పాజిటివ్ వచ్చిన దగ్గరనుంచి డిశ్చార్జి అయ్యే వరకు కలిగిన అనుభవాలను వారంతా పంచుకున్నారు. హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో దాదాపు 14 రోజుల క్వారంటైన్ను పూర్తి చేసుకున్న వీరు.. ఒంటరిగా గడిపిన రోజులను గుర్తుచేసుకున్నారు. వైద్యులు, కుటుంబసభ్యులు వెన్నుదన్నుగా నిలవడంతోనే కరోనాను జయించామని చెప్పారు. మొండి వైరస్ను గుండెధైర్యంతో ఎదుర్కొన్న వీరంతా.. ముఖ్యంగా గాంధీ ఆస్పత్రిలో నర్సుల నుంచి వైద్యుల వరకు అందించిన సేవలను, తమలో మానసిక స్థైర్యాన్ని కలిగించిన తీరును గుర్తుచేసుకున్నారు. వారి మాటల్లోనే వీరి అనుభవాలను వింటే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. గాంధీ ఆసుపత్రి వైద్యుల సేవలు ఎన్నటికీ మర్చిపోలేనని చెబుతున్నారు గచ్చిబోలికి చెందిన 25 సంవత్సరాల యువకుడు. నేను లండన్లో ఓ యూనివర్సిటీలో ‘ఎమర్జెన్సీ పారామెడికల్’ కోర్సు చదువుతున్నా. మార్చి 19న హైదరాబాద్ వచ్చాను. అప్పటికే ఇక్కడ వైరస్ విస్తరించడంతో ఆందోళన చెందాను. విమానంలో థర్మోస్కానింగ్ కూడా చేశారు. క్వారంటైన్కు తరలించారు. ఆ తర్వాత బాధ్యతగా ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నా. వైరస్ లక్షణాలు లేకున్నా పాజిటివ్ రావడంతో ఆశ్చర్యపోయా. నేను కరోనా బారినపడటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వైద్యం చేయించుకున్న తర్వాతే ఇంటికి వస్తానని చెప్పాను. 15 రోజుల చికిత్స తర్వాత పూర్తిగా కోలుకున్నా. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంటికి వచ్చాను. ప్రస్తుతం హోం క్వారంటైన్లోనే ఉన్నా. గాంధీ ఆస్పత్రి వైద్యుల సేవలు మరిచిపోలేను. కరోనా వైరస్ను మనోధైర్యంతోనే ఎదుర్కోవాలి. మందులు, సూదుల కంటే మన చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రోత్సాహమే బలాన్నిస్తుంది. దీంతోనే నేను కరోనాను జయించాను అంటున్నారు కోకాపోటకు చెందిన 49 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్. కంపెనీ పనిపై లండన్ వెళ్లి మార్చి మొదటి వారంలో ఇండియా వచ్చా. అప్పుడప్పుడే కరోనా వైరస్ వ్యాప్తి గురించి విన్నా.. కానీ ఆ వ్యాధిలో పేర్కొన్న లక్షణాలేవీ నాలో కనిపించలేదు. కానీ కాస్త జ్వరంగా అనిపించింది. మూడు రోజులైనా తగ్గకపోయేసరికి అమెరికాలో డాక్టర్గా పనిచేస్తున్న మా సిస్టర్ను సంప్రదించా. వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోమన్నారు. గాంధీలో చేయిస్తే పాజిటివ్ వచ్చింది. వెంటనే అందరికీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. గాంధీ ఆస్పత్రిలో పద్నాలుగు రోజులు స్నానం లేకుండా ఒంటరి జీవితం గడిపా. చేతిలో స్మార్ట్ఫోన్ ఉండటంతో ఆ వెలితి తెలియలేదు. ఇక వైద్యులు రోజుకు పలుమార్లు వచ్చి నా పరిస్థితిని సమీక్షించేవారు. పౌష్టికాహారం అందించారు. ముఖ్యంగా వారిచ్చిన మనోధైర్యం మరిచిపోలేనిది. నేను మళ్లీ ఈరోజు సాధారణస్థితికి రావడానికి నా సిస్టర్తో పాటు గాంధీ వైద్యులు పోషించిన పాత్ర జీవితాంతం మరిచిపోను. ఒత్తిడికి గురైనప్పటికీ గాంధీ ఆసుపత్రి వైద్యసిబ్బంది ధైర్యం చెప్పారంతో జీవితంపై ఆశల్ని నిల్పుకున్నానని గుంటూరు జిల్లాకు చెందిన పాతికేళ్ల యువతి చెప్పారు. ఎన్నో ఆశలతో లండన్ వెళ్లాను. అక్కడ ఎంబీఏ చదువుతున్నా. కరోనా వైరస్ లండన్లో వ్యాపిస్తోందన్న భయంతో మార్చి 16న స్నేహితురాళ్లతో కలిసి లండన్ నుంచి బయల్దేరి 19న హైదరాబాద్ వచ్చాం. నాతో పాటు వచ్చిన ఇద్దరు ఏపీకి వెళ్లారు. అక్కడే చికిత్స చేయించుకుంటున్నారు. నన్ను రాజేంద్రనగర్ క్వారంటైన్లో ఉంచారు. మార్చి 20న గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. పరీక్షల్లో కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆందోళనపడ్డా. ఈ సమయంలో గాంధీ ఆస్పత్రి వైద్య సిబ్బంది అండగా నిలిచారు. ఏమీ కాదని, త్వరగా కోలుకుని ఇంటికి వెళ్తారంటూ కౌన్సెలింగ్ చేసి ధైర్యాన్నిచ్చారు. దీనికి కుటుంబసభ్యుల ప్రోత్సాహమూ తోడైంది. ఆ బలంతోనే వైరస్ను జయించగలిగాను. మొండి ధైర్యంతో, వైద్యుల సపోర్ట్తో 14 రోజులు గాంధీలో గడిపి కరోనా నుంచి బయటపడ్డానని బేగంపేట పాటిగడ్డకు చెందిన 61 ఏళ్ల మహిళ చెబుతున్నారు. ఉమ్రా యాత్రకు వెళ్లొచ్చాక దగ్గు, జ్వరం వస్తే సాధారణమే అనుకున్నా. స్థానిక డాక్టర్కు చూపించుకుంటే మందులిచ్చి పంపారు. కానీ ఎంతకూ తగ్గలేదు. మార్చి 23న గాంధీ ఆస్పత్రికి వెళ్లి పరీక్ష చేయించుకుంటే కరోనా పాజిటివ్ వచ్చింది. అందులోనూ బీపీ, షుగర్ ఉన్న వారికి హైరిస్క్ ఉంటుందని చెప్పారు. కానీ మొండి ధైర్యంతో, వైద్యుల సపోర్ట్తో 14 రోజులు గాంధీలో గడిపేయడంతో కరోనా నన్నేమీ చేయలేకపోయింది. చివరకు నెగెటివ్గా రావటంతో శనివారం నన్ను డిశ్చార్జి చేశారు. గాంధీలో మధ్యాహ్న భోజనం ఆలస్యమయ్యేది. షుగర్ ఉండటంతో గాబరా అయ్యేది. అయితే వైద్యుల ప్రోత్సాహం నన్ను మళ్లీ సాధారణ మనిషిని చేసింది. వేలు, లక్షల రూపాయలు ఫీజులు, చికిత్స ఖర్చులు కూడా దొబ్బుతూ రోగులను సరిగా ట్రీట్ చేయని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులతో పోలిస్తే విపత్తులు ఎదురైన సమయాల్లో మన ప్రభుత్వ ఆసుపత్రులు అందించే వైద్యసేవలు ఎంత విలువైనవో వీరిందరి అభిప్రాయాలు చెబుతున్నాయి.

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
4 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
5 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
5 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
9 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
10 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
8 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
11 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
11 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
6 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
13 hours ago
ఇంకా