కోమటిరెడ్డి కోరిక నెరవేరుతుందా? ఆ పీఠం దక్కుతుందా?
04-03-202004-03-2020 08:31:12 IST
Updated On 04-03-2020 12:54:25 ISTUpdated On 04-03-20202020-03-04T03:01:12.114Z04-03-2020 2020-03-04T02:59:47.961Z - 2020-03-04T07:24:25.199Z - 04-03-2020

కాంగ్రెస్ పార్టీలో కేరాఫ్ కాంట్రవర్శీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అధికార పార్టీ పైనే కాదు..సొంత పార్టీ నేతలపైనా విరుచుకుపడటం ఆయన నైజం. అంతర్గత ప్రజాస్వామయ్యం అధికంగా ఉన్న ఆపార్టీలో ఆ స్వాతంత్య్రాన్ని ఆసాంతం వాడుకునేది ఆయనొక్కడే అని టాక్. ఎమ్మెల్యేగా ప్రజలు తిరస్కరించినా ఎంపీగా ఓటర్లు ఆదరించడంతో మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. పెద్దగా గాంధీ భవన్ మెట్లు ఎక్కకున్నా గాంధీ భవన్ కుర్చీపై కన్నేశారు. ఆయన కోరిక నెరవేరుతుందా? కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పీసీసీ పీఠంపై కూర్చునేందుకు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. పార్టీలో తాను మాత్రమే సీనియర్ అంటూ కామెంట్స్ చేయడం.... ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లడానికి సిద్ధమని చెప్పుకొస్తున్నారు. 2018 శాసనసభ ఎన్నికల్లో నల్లగొండ నుండి 5వ సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడంతో రాజకీయంగా తొలిసారిఎదురుదెబ్బ తగిలింది. ఆ వెంటనే వచ్చిన పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భువనగిరి యంపీగా పోటీచేసి భారీ మెజారీటితో విజయం సాధించి పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్ లో అడుగుపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల తగిలిన ఎదురుదెబ్బో... లేక ఢిల్లీ గాలో గాని యంపీగా గెలిచిన తర్వాత నుంచి రాజకీయంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలకు ఉత్తమ్ బాధ్యత వహించాలని, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ మార్క్ రాజకీయాలను మరోసారి రుచి చూపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సీనియర్ నేతలపైగా సందర్భం వచ్చిన ప్రతీసారి ఎదురుదాడి చేయడం కోమటిరెడ్డి బ్రదర్స్ కు మాత్రమే సాధ్యమైంది. ఎన్నివివాదాలకు కారణమైనా కోమటిరెడ్డి బ్రదర్స్ పై అధిష్టానం చర్యలు తీసుకొకపొవడం.. ఏదిచేసినా పార్టీకోసమే అంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ చెప్పుకురావడం కామన్ అయిపోయింది. ఇదంతా సొంత పార్టీ వ్యవహారం.సొంత పార్టీకి చెందిన సీనియర్ నేతలపై తీవ్రస్దాయిలో విరుచుకుపడే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికార పార్టీపై కూడా ఆయన విమర్శల పరంపర, దూషణల పర్వం ఆగలేదు తగ్గలేదు. ఏకంగా టీఆర్ఎస్ అధినేతే లక్ష్యంగా విమర్శల దాడి తీవ్రతరం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి నుండి పార్లమెంట్ కు ఎన్నికై ఢిల్లీ కేంద్రంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర, జిల్లా సమస్య పరిష్కారానికి కేంద్ర మంత్రుల కార్యాలయాల గడపలు తొక్కుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో ఘర్షణ వైఖరి అవలంభిస్తుండటంతో వివిధ సమస్యలపై అధికార పార్టీ నుండి ప్రశ్నించేవారు కరువయ్యారు. ఈ అంశాన్ని కోమటిరెడ్డి వెకంట్ రెడ్డి అడ్వాంటేజ్ గా తీసుకున్నారు. అధికార పార్టీ చేయాల్సీన పనిని, విపక్ష పార్టీలు చేయాల్సిన పనులను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిల్లీ కేంద్రంగా భుజానవేసుకొవడం... ఢిల్లీ కేంద్రంగా అధికార టీఆర్ఎస్ వైఖరిని ఎండగడుతుండటంతో కొంత మైలేజ్ సంపాదించడంలో సక్సెస్ అయ్యారు. ఇదే అదునుగా అధిష్టానం దృష్టిలో పడేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాపై ఘటుగా స్పందిస్తూనే. తాను మాత్రమే పోరాటం చేయగలను... చేస్తున్నా అన్న సంకేతాలు అదిష్టానానికి ఇస్తున్నారు. మొత్తానికి పీసీసీ పీఠం దక్కితే రాష్ట్రం మొత్తం తిరగడానికి అవకాశం ఉంటుందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వం ఒత్తిడి తేవడానికి అవకాశం ఉంటుందని అయన ఇప్పటికే సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. పీసీసీ మార్పు ఉంటుందా... ఉంటే పీసీసీ ఎంపికలో మరి సీనియర్లు ఏమేరకు సహకరిస్తారొన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేం. ఏది ఏమైనా పీసీసీ పీఠం దక్కుతుందా లేదా అనేది ఉత్కంఠ నెలకొంది.

ఏపీలో స్కూల్స్ బంద్
43 minutes ago

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?
24 minutes ago

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
5 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
6 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
2 hours ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
9 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
9 hours ago

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్పై ప్రమాణం చేయగలరా
an hour ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
3 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
9 hours ago
ఇంకా