కేసీయార్ స్ట్రాటజీ మారిందా... ఇక జాతీయంపై ఫోకస్?
20-02-202020-02-2020 09:47:18 IST
Updated On 21-02-2020 18:48:51 ISTUpdated On 21-02-20202020-02-20T04:17:18.241Z20-02-2020 2020-02-20T04:17:10.447Z - 2020-02-21T13:18:51.195Z - 21-02-2020

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ దృష్టి మారుతోందా? తెలంగాణనుంచి ఆయన జాతీయం వైపు మళ్ళుతున్నారా? కేటీయార్ కు కీలక బాధ్యతలు అప్పగించనున్నారా? మళ్ళీ తెరమీదకు ఫెడరల్ ఫ్రంట్ కేటీయార్ చేతికి ప్రభుత్వ పగ్గాలు కాంగ్రెస్, బీజేపీయేతర పక్షాలను తాటిపైకి తేనున్నారా? అవుననే అంటున్నాయి గులాబీ వర్గాలు. తెలంగాణ సీఎం కేసీయార్ ఎప్పటినుంచో ఆశిస్తున్న జాతీయ రాజకీయాలపై ఆయన చూపు సారిస్తున్నారనే వాదన వినబడుతోంది. ఇప్పటినుంచే ఆయన అందుకు తగ్గ ప్రణాళికలు రచిస్తున్నారని సమాచారం. ఇటీవల ఆయన అడుగులన్నీ ముందస్తు వ్యూహంతోనే ఉన్నాయనిపిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ సారి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ఆయన కచ్చితమైన ప్లాన్ వేస్తున్నారని అందుకు ముందుగా పార్లమెంటుకు వెళ్ళాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందుకు ఆయనకు బాగా అచ్చి వచ్చిన కరీంనగర్ నుంచి పోటీ చేసి ఢిల్లీలో అడుగు పెట్టాలని భావిస్తున్నారట. అందుకే ఆయన ఎక్కువగా కరీంనగర్ అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నారు. టీఆర్ఎస్ నేతలు కూడా కరీంనగర్ వైపు వెళుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సమీక్ష సహా.. ఇతర అంశాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు .. ఆయనే స్వయంగా జిల్లాలో పర్యటించారు. కరీంనగర్ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. అయితే కేవలం నెలల వ్యవధిలోనే ఇలా కరీంనగర్పై ఇంత స్పెషల్ ఫోకస్ చేయడం వెనుక అసలు కారణం వేరే ఉందనే ప్రచారం జోరందుకుంది. ఈ నేపధ్యంలోనే ముఖ్యమంత్రి పదవిని కేటీఆర్ కు కట్టబెట్టి తాను జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని భావిస్తున్నారంటున్నారు. గత కొంతకాలంగా మంత్రులు ఒకరి తర్వాత మరొకరు కేటీయార్ ని హైలైట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది జరిగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత కేసీయార్ కీలక నిర్ఱయం తీసుకోనున్నారు. ఇందుకు ముహుర్తం కూడా ఖరారు చేయాలనుకుంటున్నారట. రాబోయే ఎన్నికల నాటికి కరీంనగర్ లో టీఆర్ఎస్ కు ఎదురు లేకుండా ఉండేలా ఇప్పటినుంచే తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారంటున్నారు. తాను కరీంనగర్ లో పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచి ఉత్తర తెలంగాణలో బీజేపీ ని దెబ్బ కొట్టాలని కూడా కేసీఆర్ వ్యూహాల్లో భాగమని తెలుస్తోంది. తాను ప్రాతినిధ్యం వహించే గజ్వేల్ నియోజకవర్గంలో తన కూతురు కవితను నిలబెట్టి ఆమెకు ప్రభుత్వం లో అవకాశం ఇవ్వనున్నారు. మొత్తం మీద కేసీయార్ వ్యూహాలు ఎవరికీ అర్థం కావు.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
11 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
7 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
10 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
12 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
14 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
16 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
17 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
19 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
19 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
20 hours ago
ఇంకా