కేసీయార్ బాటలోనే జగన్.. ఫలితాలు క్లీన్ స్వీపేనా?
12-03-202012-03-2020 08:45:15 IST
Updated On 12-03-2020 11:24:51 ISTUpdated On 12-03-20202020-03-12T03:15:15.522Z12-03-2020 2020-03-12T03:14:37.847Z - 2020-03-12T05:54:51.557Z - 12-03-2020

రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలది రీల్ లైఫ్ లాంటి అన్నదమ్ముల అనుబంధానికి మించిన బంధం. ఒక్కోసారి అంతకుమించి అన్నట్టుగా వుంటుంది. జగన్ సీఎం అయ్యాక రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి రాజకీయ వైరుధ్యాలు లేవు. కేసీఆర్ జగన్ లది జిగిరీ దోస్త్ అంటారు. ఇద్దరూ ఒకరిని ఒకరు నమ్ముతున్నట్లే ఉంటారు. అలాగే పూర్తిగా కాదు, అలాగనీ వదిలేసి ఎక్కడికీ పోరు. ఇద్దరిదీ విచిత్రమైన స్నేహం. రాజకీయ అవసరాలు, అంతకు మించి వ్యక్తిగత అవసరాలూ అందులో ఉంటాయి. వయసులో కొడుకుతో సమానమైన జగన్ కేసీఆర్ రాజకీయాలతో ఎప్పటికపుడు పోటీ పడుతూ తెలంగాణా పెద్దాయనకు కొన్ని సార్లు ఎదురొస్తున్నాడు, మరికొన్నిసార్లు ఫాలో ఫాలో అంటున్నాడు. జగన్ పాలనా విధానాలు కొన్ని కేసీఆర్ మెచ్చేలా ఉంటే కేసీఆర్ రాజకీయ నైపుణ్యాలు జగన్ అనుసరించేలా ఉంటున్నాయట. తెలంగాణాలో కేసీఆర్ మొత్తానికి మొత్తం లోకల్ బాడీ ఎన్నికలను గెలుచుకున్నారు. లోక్ సభ ఎన్నికలు మినహా గులాబీ కారు జోరుకి అడ్డే లేకుండా పోయింది. సామ, దాన భేద దండోపాయాలు ఉపయోగించి మరీ వార్డు మెంబర్ నుంచి వదలకుండా బుట్టలో వేసుకున్నాడు. అందుకోసం అధికారాన్ని, రాజకీయాన్ని కలిపి మరీ వాడుకున్నాడు. ఇపుడు అదే జగన్ కి స్పూర్తిగా ఉందిట. ఎట్టిపరిస్థితుల్లో తొంబై శాతం ఫలితాలు మన సొంతం కావాలని జగన్ అందుకే అంటున్నాడు. అక్కడ కేసీఆర్ కి సాధ్యమైంది ఇక్కడ తానూ చేసి చూపించాలానుకుంటున్నాడు. ఇందుకోసం మంత్రులకు గట్టి టార్గెట్లు ఇచ్చాడు, అలాగే ఎమ్మెల్యేలకూ బిజీ పొలిటికల్ వర్క్ అప్పగించారు. ఏపీలో ఇపుడు విపక్షాలు చాలా గందరగోళంలో ఉన్నాయి. అవెంత బేలగా ఉన్నాయంటే ఎన్నికలు కొన్ని నెలలైనా వాయిదా పడితే బాగుండు అనుకుంటున్నాయి. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశమే ఇపుడు వీక్ గా ఉంది. జగన్ మాస్టర్ స్ట్రాటజీతో హఠాత్తుగా ఎన్నికలు జరిపించేస్తున్నాడు. కొత్త చట్టం పేరిట జగన్ తీసుకువచ్చిన విధానాలు పూర్తిగా వైసీపీకి ఫలితాలు అనుకూలం అని పచ్చ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. మరోవైపు అతి తక్కువ టైం మాత్రమే ఎన్నికలకు ఇచ్చి మొత్తం తంతు పదిహేను రోజుల్లో ముగించడం వెనక జగన్ రాజకీయ చాణక్యం అర్ధమై బీజేపీ సహా ఇతర పార్టీలు భోరుమంటున్నాయి. అభ్యర్ధులను ఎంపిక చేసుకోవడం, వైసీపీ నేతల బెదిరింపులను తట్టుకుని నామినేషన్లు వేయడం కష్టంగా మారింది ఇతర పార్టీలకు. కేసీఆర్ తెలంగాణాలో చాలా మటుకు ఏకగ్రీవాలే చేసుకున్నారు. పెద్ద ఎత్తున మంత్రులను దించేసి వారి ద్వారా సర్పంచుల నుంచి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు బహుమానాల పేరిట ఏకగ్రీవాలు చేయించుకున్నారు. అదే ఫార్ములాను జగన్ అనుసరిస్తున్నారు. మంత్రులు అపుడే రంగంలోకి దిగిపోయారు. మంత్రుల పనితీరుకి ఈ ఎన్నికలు రిఫరెండం అన్నట్టుగా వుంది సీన్. ఇవన్నీ చూసిన తరువాత అనంతపురం నుంచి జేసీ దివాకరరెడ్డి వంటి వారు మేము పోటీ చేసినా దండుగ అంటున్నారు. ఇపుడు తరువాత వంతు కర్నూలు జిల్లాది అట. ఆ విధంగా సీమ జిల్లాల నుంచి మొదలవుతున్నా ఏకగ్రీవాలు ఏపీలోని మెజారిటీ జిల్లాలకు పాకినా ఆశ్చర్యం లేదు. మొత్తానికి జగన్ టార్గెట్ రీచ్ కావాలను గట్టిగానే ఆలోచన చేస్తున్నాడు. ఇది చూసిన విపక్ష టీడీపీ దాదాపుగా చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది. చూడాలి మరి ఉనికి కోసమైనా పోరాడుతారో లేదో.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
11 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
7 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
9 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
12 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
14 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
16 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
17 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
18 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
19 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
20 hours ago
ఇంకా