కేంద్ర విద్యుత్ సవరణ బిల్లుపై సీఎం కేసీయార్ గుస్సా
03-06-202003-06-2020 10:00:06 IST
Updated On 03-06-2020 11:25:49 ISTUpdated On 03-06-20202020-06-03T04:30:06.950Z03-06-2020 2020-06-03T04:29:57.391Z - 2020-06-03T05:55:49.441Z - 03-06-2020

ఈమధ్యకాలంలో కేంద్రం వైఖరిపై తెలంగాణ సీఎం కేసీయార్ విమర్శలు చేస్తూనే వున్నారు. సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా కేంద్రం వ్యవహరిస్తోందని దుయ్యబడుతున్నారు. తాజాగా మరో అంశంపై మోడీని దుయ్యబడుతున్నారు సీఎం కేసీయార్. కేంద్రం తాజాగా తీసుకువచ్చిన ముసాయిదా విద్యుత్ చట్ట సవరణ బిల్లు–2020పై రాష్ట్రాల నుంచి అభిప్రాయాలు/సూచనలు కోరగా.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా లేఖ రాశారు. ప్రజలు, రాష్ట్రాల విద్యుత్ సం స్థలు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ వినియోగదారులకు, ముఖ్యంగా వ్యవసాయం, గృహ వినియోగదారులకు అందించే విద్యుత్ రాయితీలను నగదు బదిలీ ద్వారా అందించాలన్న నిబంధనను బిల్లులో ప్రతిపాదించారు. ఈ నిబంధన రైతులు, పేద వినియోగదారుల ప్రయోజనాలకు విరుద్ధం అని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. రైతులకు 24 గంటలు నిరంతరంగా ఉచిత విద్యుత్ సరఫరా చేయడం తెలంగాణ విధానం. సబ్సిడీల చెల్లింపు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేయాలి. ప్రస్తుతం అమల్లో ఉన్న సబ్సిడీల విధానాన్ని సవరించేందుకు చేసే ఎలాంటి ప్రతిపాదనలు అయినా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. * రాష్ట్రాల ఈఆర్సీల నియామకం విషయంలో రాష్ట్రాల అధికారాన్ని ప్రతిపాదిత విద్యుత్ బిల్లు లాక్కుంటోంది. ఇది సమాఖ్య విధాన స్ఫూర్తికి విరుద్ధం. కాంట్రాక్టులకు సంబంధించిన అన్ని అంశాలను పర్యవేక్షించేందుకు కేంద్ర స్థాయిలో ‘ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ’పేరుతో సమాంతర వ్యవస్థ ఏర్పాటు చేయాలని బిల్లులో ప్రతిపాదించారు. ప్రస్తుతం కాంట్రాక్టుల వివాదాలు సివిల్ కోర్టుల పరిధిలో ఉండగా, ఈ వ్యవస్థ ఏర్పాటుతో రెండింటి పరిధిలో వివాదాలు రానున్నాయి. * సబ్సిడీ లేకుండానే అన్ని కేటగిరీల వినియోగదారుల విద్యుత్ టారీఫ్ను ఈఆర్సీ నిర్ణయించాలని బిల్లులో ప్రతిపాదించారు. కొన్ని రకాల వినియోగదారులు క్రాస్ సబ్సిడీ భరించేలా ప్రస్తుత టారీఫ్ విధానం ఉంది. విద్యుత్ చట్ట సవరణ బిల్లు అమల్లోకి వస్తే వ్యవసాయం సహా అన్ని కేటగిరీల వినియోగదారులకు వాస్తవ విద్యుత్ సరఫరా వ్యయం ఆధారంగా కరెంటు బిల్లులు జారీ చేయాల్సి వస్తుంది. ఈ నిబంధనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు కేసీయార్. కొన్ని కేటగిరీల వినియోగదారులపై క్రాస్ సబ్సిడీలు విధించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేయడం శ్రేయస్కరం. * రాష్ట్రాల సంపూర్ణ అంగీకారంతోనే ఏదైనా జాతీయ పునరుత్పాదక ఇంధన విధానానికి రూపకల్పన చేయాలి. జల, పవన విద్యుదుత్పత్తికి ఉన్న అవకాశాలు, భూముల లభ్యత వంటి అంశాల విషయంలో దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రం ప్రత్యేక పరిస్థితిని కలిగి ఉంది. ఈ నేపథ్యంలో పునరుత్పాదక ఇంధన విషయంలో జాతీయ విధానానికి లోబడి తమకు అనువైన నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలకు కల్పించేలా జాతీయ విధానం రూపకల్పన జరగాలి. పునరుత్పాదక ఇంధన లక్ష్యాలు అందుకోకపోతే రాష్ట్రాలకు జరిమానాలు విధించే నిబంధనలు ఉండరాదు. * ఈ బిల్లు ద్వారా దేశవ్యాప్తంగా పవర్ షెడ్యూలింగ్కు సంబంధించిన పూర్తి స్థాయి అధికారాలను జాతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎన్ఎల్డీసీ)కి కట్టబెట్టతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో తెలంగాణ లోడ్ డిస్పాచ్ సెంటర్ అత్యంత సంతృప్తికర రీతిలో మెరిట్ ఆర్డర్ను అమలు చేస్తోంది. గ్రిడ్ క్రమశిక్షణకు ఉన్న అత్యంత ప్రాధాన్యం దృష్ట్యా ఎన్ఎల్డీసీకి అదనపు బాధ్యతలు అప్పగించడం సముచితం కాదు. * రాష్ట్రాల థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాల బ్యాకింగ్ డౌన్ (ఉత్పత్తి తగ్గింపు/ పూర్తిగా నిలుపుదల)కు దారితీస్తుంది. కేంద్ర విద్యుదుత్పత్తి ప్లాంట్లతో రాష్ట్రాల విద్యుదుత్పత్తి ప్లాంట్లు పోటీ పడలేవు. ఎన్టీపీసీ, ఎన్హెచ్పీసీ వంటి కేంద్ర విద్యుత్ ప్లాంట్ల విద్యుదుత్పత్తి ధరలు తక్కువగా ఉండటంతో మెరిట్ ఆర్డర్ ప్రకారం విద్యుత్ కొనుగోళ్లలో వాటికి ప్రాధాన్యం లభించనుంది. దీంతో రాష్ట్రాల విద్యుదుత్పత్తి ప్లాంట్లు నష్టపోతాయి. * విద్యుదుత్పత్తి కేంద్రాలకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా పర్యవేక్షించే అధికారాన్ని ఎన్ఎల్డీసీకి అప్పగించేందుకు బిల్లులో ప్రతిపాదనలు చేశారు. ఇలాంటి వాణిజ్యపర అంశాలను ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం రాష్ట్రాల ఈఆర్సీలు, సివిల్ కోర్టులకే వదిలేయాలి. విద్యుత్ షెడ్యూలింగ్, గ్రిడ్ భద్రత వంటి సాంకేతికపరమైన బాధ్యతలకే ఎన్ఎల్డీసీ పరిమితం కావాలి. * డిస్కంల నుంచి కాకుండా వినియోగదారులు బహిరంగ మార్కెట్ నుంచి నేరుగా ఓపెన్ యాక్సెస్ విధానంలో స్వేచ్ఛగా విద్యుత్ కొనుగోలు చేసుకునేందుకు అనుమతించాలని బిల్లులో ప్రతిపాదించారు. ఈ అవకాశం కల్పిస్తే డిస్కంల ఆదాయానికి గండి పడనుంది. సాంకేతికంగా సాధ్యం కాకపోయినా, మెగావాట్కు పైగా విద్యుత్ అవసరమైన వినియోగదారులు పెద్ద సంఖ్యలో ఓపెన్ యాక్సెస్కు వెళ్లే ప్రమాదముంది. దీనికి తోడు సబ్ లైసెన్సీలు ఓపెన్ యాక్సెస్లో విద్యుత్ కొనుగోలు చేసి వినియోగదారులకు సరఫరా చేసే అవకాశం లభించనుంది. దీని ద్వారా కూడా డిస్కంలు ఆర్థికంగా కుంగిపోనున్నాయి. * విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా బిల్లు–2020పై తెలంగాణకు వున్న తీవ్ర అభ్యంతరాల్లో కొన్నింటిని పైన పేర్కొనడం జరిగింది. ఈ సవరణలు ఇటు ప్రజలకు, అటు రాష్ట్ర విద్యుత్ సంస్థలు/రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ మాత్రం ప్రయోజనం కలిగించేలా లేవు. పైన పేర్కొన్న అంశాల దృష్ట్యా ప్రజా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర విద్యుత్ శాఖ.. ఈ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం అని కేసీయార్ లేఖలో పేర్కొన్నారు.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
8 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
11 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
14 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
4 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
15 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
12 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
15 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
15 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
9 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
18 hours ago
ఇంకా