కలెక్టర్లకు కేసీఆర్ దిశానిర్దేశం
12-02-202012-02-2020 08:21:55 IST
2020-02-12T02:51:55.139Z12-02-2020 2020-02-12T02:50:17.463Z - - 16-04-2021

సీఎం కేసీయార్ పాలనపై ఫోకస్ పెట్టారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చేందుకు కలెక్టర్లు కృషిచేయాలని కేసీయార్ సూచించారు. కలెక్టర్ల సదస్సులో అనేక పాలనా పరమయిన అంశాలను కూలంకషంగా చర్చించారు. గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనతోపాటు రాష్ట్రాన్ని హరితమయంచేయడానికి పక్కా ప్రణాళిక రూపొందించారు. కలెక్టర్లు ఎవరి ప్రాధాన్యాలను వారు ఎంచుకోకుండా అధికార యంత్రాంగం అంతా ఒకే ప్రాధాన్యంతో జట్టుగా పనిచేయాలని కోరారు. మంగళవారం ప్రగతిభవన్లో పదకొండు గంటలకుపైగా సుదీర్ఘంగా జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం కేసీఆర్.. సుపరిపాలన, ప్రభుత్వ ప్రాధాన్యాలపై కలెక్టర్లకు స్పష్టతనిచ్చారు. జిల్లాస్థాయిలో ప్రభుత్వమంటే కలెక్టరేనన్నారు. కొత్త పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకొనే అధికారం కలెక్టర్లకు అప్పగించినట్లు తెలిపారు. అత్యంత ప్రాధాన్యం కలిగిన పనులను వెంటనే చేపట్టడానికి వీలుగా జిల్లాకు కోటి రూపాయల చొప్పున నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు 33 కోట్లు విడుదలచేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. గ్రామాల్లో రెవెన్యూ అజమాయిషీ అంతా కలెక్టర్ల చేతిలోనే ఉంటుందని, భూరికార్డులను సరిదిద్దే బాధ్యత కలెక్టర్లదేనని సీఎం కేసీఆర్ అన్నారు. కొత్తగా తీసుకువచ్చిన అదనపు కలెక్టర్ల విధివిధానాలను కేసీయార్ వివరించారు. రాబోయే 25 రోజుల్లో గ్రామాల్లో మార్పులు రావాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అనుకొన్న ఫలితాలు రాకపోతే చర్యలు తప్పవన్నారు. హైదరాబాద్ ను కాలుష్యం బారిన పడకుండా కాపాడాలన్నారు. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలను అధికార యంత్రాంగం అమలుచేయాలన్నారు. ప్రభుత్వం తెచ్చిన చట్టాలు, విధానాలు, పథకాలు, కార్యక్రమాల అమలే కలెక్టర్ల ప్రాధాన్యం కావాలని పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో మంత్రులు, సీనియ ర్ అధికారులు పాల్గొన్నారు. పరిపాలన, పచ్చదనం, అక్షరాస్యత, భూవివాదాలకు అవకాశం లేకుండా చూడాలన్నారు. సీఎం కేసీయార్ ప్రధానంగా రెవిన్యూ శాఖ ప్రక్షాళన గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ కార్యక్రమాలు, పథకాలు ప్రజల అవసరాలకు అనుగుణంగా రూపొందాలి. కలెక్టర్ల వ్యవస్థను బలోపేతంచేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గ్రామాల్లో పచ్చదనంతో పాటు పరిశుభ్రత పెరగాలి. రాష్ట్రంలో అడవుల శాతం పెంచాల్సిన ఆవశ్యకతను కేసీయార్ పునరుద్ఘాటించారు. హైదరాబాద్, గద్వాల, కరీంనగర్, జనగామ, వరంగల్ అర్బన్, యాదాద్రి, సూర్యాపేట, నారాయణపేట, సంగారెడ్డి జిల్లాల్లో అడవులశాతం చాలా తక్కువగా ఉన్నది. అక్కడి కలెక్టర్లు సామాజిక అడవులు పెంచడానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలన్నారు. మొత్తం మీద చాలాకాలం తర్వాత సుదీర్ఘంగా సాగింది కలెక్టర్ల సమావేశం.

తిరుపతిలో ఇవాళ అమ్మవారి కటాక్షమే పార్టీలకు ఇంపార్టెంట్
10 minutes ago

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
an hour ago

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
15 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
10 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
13 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
15 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
18 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
19 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
20 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
a day ago
ఇంకా