కరోనా రోగుల పాలిట జీవనదాయిని పోర్టబుల్ వెంటిలేటర్
04-04-202004-04-2020 17:04:53 IST
Updated On 04-04-2020 17:10:50 ISTUpdated On 04-04-20202020-04-04T11:34:53.071Z04-04-2020 2020-04-04T11:34:50.098Z - 2020-04-04T11:40:50.058Z - 04-04-2020

రోజురోజుకూ దేశంలోనూ, ఇటు తెలంగాణలోనూ కరోనా వైరస్ సోకిన రోగుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో వైద్యపరమైన మౌలిక అవసరాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం తలమునకలవుతోంది. కొన్ని వేలమంది రాబోయే రోజుల్లో వైరస్ బారిన పడితే రోగ నిర్ధారణ, చికిత్సకు కావలసిన సామగ్రి లేక ప్రభుత్వాలు అల్లాడి పోవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో అతి తక్కువ ఖర్చుతో పోర్టబుల్ వెంటిలేటర్ను హైదరాబాద్ ఐఐటీ రూపొందించింది. కేవలం లక్షరూపాయల ధరమాత్రమే పలికే ఈ వెంటిలేటర్లను ప్రస్తుతానికి రోజుకు 70 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేయనున్నారు. లిధియం అయాన్ బ్యాటరీతో 5 గంటలుపాటు పనిచేసేలా దీన్ని డిజైన్ చేశారు. పైగా ఐవోటీ సాంకేతికత ఆధారంగా ఫోన్ యాప్తోనూ పని చేసేలా రూపకల్పన చేశారు. కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స అందించేందుకు అవసరమైన మాస్క్లు, వెంటిలేటర్ల తయారీకి సం బంధించిన నమూనాలపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఇటీవల తక్కువ ఖర్చుతో తయారయ్యే ‘బ్యాగ్ వాల్వ్ మాస్క్’ను డిజైన్ చేసిన ఐఐటీ హైదరాబాద్.. తాజాగా అత్యవసర సమయాల్లో ఉపయోగించే వెంటిలేటర్ను తయారు చేసింది. ఐఐటీ అనుబంధ సెంటర్ ఫర్ హెల్త్కేర్ ఎంట్రప్రెన్యూర్షిప్ (సీఎఫ్హెచ్ఈ)కి చెందిన ఏరోబయోసిస్ ఇన్నోవేషన్స్ అనే స్టార్టప్ కంపెనీ ఈ వెంటిలేటర్ను రూపొందించింది. తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ ఎమర్జెన్సీ వెంటిలేటర్లో అనేక అత్యాధునిక ఫీచర్లు ఉన్నట్లు ఏరోబయోసిస్ చెబుతోంది. ‘జీవన్లైట్’గా పిలిచే ఈ వెంటిలేటర్.. ఇంట ర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఆధారంగా పనిచేస్తుంది. దీంతో విద్యుత్ సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల్లోనూ బ్యాటరీ ద్వారా వాడొచ్చు. కరోనా వైరస్కు శరవేగంగా వ్యాపించే లక్షణం ఉండటంతో ఈ జీవన్లైట్ ఎమర్జెన్సీ వెంటిలేటర్ వెద్యులు, రోగుల కుటుంబ సభ్యులకు రక్షణ కల్పిస్తుంది. ఇది లక్ష రూపాయలకే అందుబాటులోకి వస్తుందని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ మూర్తి వెల్లడించారు. ప్రస్తుతం ఏరోబయోసిస్కు రోజుకు 50 నుంచి 70 యూనిట్లు తయారు చేసే సామర్థ్యం ఉందన్నారు. వెంటిలేటర్లను పెద్ద ఎత్తున తయారు చేసేందుకు పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వం ముందుకు రావాలని బయో మెడికల్ ఇంజనీరింగ్ విభాగం అధిపతి ప్రొఫెసర్ రేణు జాన్ కోరారు. కాగా, రోగి శ్వాస తీసుకునే తీరును రికార్డు చేసి, వైద్యుడికి యాప్ ద్వారా సమాచారం అందజేసే ఫీచర్తో పాటు, ఆక్సిజన్ సిలిండర్ను కూడా జత చేసి జీవన్లైట్ను రూపొందించారు. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, డీఆర్డీవో, ఐసీఎంఆర్ తదితర సంస్థల ప్రామాణికాలకు అనుగుణంగా దీన్ని తయారుచేసినట్లు ఏరో బయోసిస్ వెల్లడించింది. హృద్రోగులు, టైప్–2 మధుమేహం ఉన్న వారు కరోనా వైరస్ బారిన పడితే శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇలాంటి వారికి అత్యవసర సమయాల్లో ఈ జీవన్ లైట్ రక్షణ కవచంలా పనిచేస్తుంది. కరోనా సోకిన వారికే కాకుండా ఇతర సందర్భాల్లో చిన్న పిల్లలు, వృద్ధులకు తలెత్తే శ్వాస సంబంధ సమస్యలకు కూడా ఈ ఎమర్జెన్సీ వెంటిలేటర్ను వాడొచ్చు. జీవన్లైట్లో ఉండే లిథియం అయాన్ బ్యాటరీని సెల్ఫోన్ తరహాలో రీచార్జి చేసుకోవచ్చు. ఇందులో ఉండే బ్యాటరీని ఒకసారి చార్జ్ చేస్తే 5 గంటలపాటు ఏకబిగిన పనిచేస్తుందని దీన్ని డిజైన్ చేసిన ఏరోబయోసిస్ ఇన్నోవేషన్ చెబుతోంది. ఈ పరికరానికి వైర్లెస్ కనెక్టివిటీ ఫీచర్ ఉండటంతో రిమోట్ మానిటరింగ్ విధానంలో రోగులను తాకకుండానే వాడే వీలుంది.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
12 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
7 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
10 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
12 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
15 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
16 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
17 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
19 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
19 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
20 hours ago
ఇంకా