ఒకవైపు కోవిడ్.. మరోవైపు ఎంసెట్.. విద్యార్ధులకు ‘పరీక్షే’
07-09-202007-09-2020 07:34:03 IST
Updated On 07-09-2020 07:46:47 ISTUpdated On 07-09-20202020-09-07T02:04:03.193Z07-09-2020 2020-09-07T02:03:50.922Z - 2020-09-07T02:16:47.354Z - 07-09-2020

దేశవ్యాప్తంగా కరోనా కేసులు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. దేశంలో 41 లక్షలు కేసులు దాటిపోయాయి. కరోనా వైరస్ ఎప్పుడు అదుపులోకి వస్తుందో ఎవరికీ తెలీదు. తాజాగా వివిధ కామన్ ఎంట్రన్స్ పరీక్షలు జరుగుతున్నాయి. ఎంసెట్ పరీక్షలకు రంగం సిద్ధం అయింది. కరోనా వైరస్ కారణంగా కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న ఎంసెట్ పరీక్షలు ఎట్టకేలకు ఈ నెల అంటే సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. మరో మూడు రోజుల్లోనే పరీక్షలు ప్రారంభం అవుతుండడంతో విద్యార్ధులు ఇప్పటికే ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ రాయడానికి సన్నద్దం అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 102 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు.పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమకు దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస సంబంధ సమస్యలు లేవని ప్రతి విద్యార్ధి సెల్ఫ్ డిక్లరేషన్ తప్పనిసరి. గంటన్నర ముందే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారుజ. నిబంధనలు పాటించకపోతే ఫలితాలు విత్హెల్డ్ చేసే యోచనలో వుంది ప్రభుత్వం. అయితే పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్ధులు తప్పనిసరిగా మాస్క్లు తెచ్చుకోవాలని ఎంసెట్ కమిటీ సూచించింది. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ఇంజనీరింగ్ ఎంసెట్ పరీక్ష ప్రారంభం కాబోతుంది. కరోనా నేపథ్యంలో తగిన నిర్వహణా ఏర్పాట్లకు ఎంసెట్ కమిటీ సమాయత్తమవుతోంది. సెప్టెంబర్ 9, 10, 11, 14 తేదీల్లో ఈ పరీక్షల నిర్వహణకు 102 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. అందులో తెలంగాణలో 89, ఆంధ్రప్రదేశ్లో 23 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరోనా లక్షణాలు లేని విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించేలా చర్యలు చేపట్టింది. థర్మల్ స్క్రీనింగ్ ద్వారా వారిని గుర్తించాలని నిర్ణయించింది. కరోనా సంబంధ లక్షణాలున్న వారిని వెనక్కి పంపించి వేయాలని భావిస్తోంది. వీలైతే ఆ సెషన్లో ప్రత్యేక గదుల్లో పరీక్షలు రాయించే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది.అదే విధంగా వాటర్ బాటిల్, 50ఎంఎల్ శానిటైజర్ బాటిల్ ను పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని పేర్కొంది. వేలి ముద్రలు తీసుకోవడం వల్ల కరోనా వ్యాప్తి జరిగే అవకాశం ఉన్నందున ఫేస్ రికగ్నేషన్ సిస్టం విధానాన్ని ఫాలో కానుంది.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
21 minutes ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
an hour ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
2 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
3 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
4 hours ago

కేటీఆర్ కి అంత సీన్ లేదులే
6 hours ago

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!
6 hours ago

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ
21 hours ago

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!
21 hours ago

ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!
a day ago
ఇంకా