ఏపీ, తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్ళకు గ్రీన్ సిగ్నల్
03-09-202003-09-2020 12:05:34 IST
Updated On 04-09-2020 11:15:42 ISTUpdated On 04-09-20202020-09-03T06:35:34.382Z03-09-2020 2020-09-03T06:35:30.840Z - 2020-09-04T05:45:42.215Z - 04-09-2020

కరోనా కారణంగా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. కరోనా అన్ లాక్ ప్రక్రియ ప్రారంభం అయ్యాక కొన్ని ప్రత్యేక రైళ్ళు నడుస్తున్నాయి. తాజాగా మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపేందుకు పచ్చా జెండా ఊపింది. దక్షిణ మధ్య రైల్వే ఈ ప్రత్యేక రైళ్లు నడిపేందుకు సిద్ధం అయింది. ప్రయాణికుల రద్దీ మేరకు త్వరలో మరిన్ని రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే కసరత్తు చేపట్టింది. అన్లాక్ 4.0 అమలు దృష్ట్యా ప్రత్యేక రైళ్లపై నిర్ణయం తీసుకొనే అధికారాన్ని రైల్వేబోర్డు జోన్లకే అప్పగించింది. వివిధ రూట్లలో ప్రయాణికుల డిమాండ్, రద్దీని దృష్టిలో ఉంచుకొని రైళ్లను నడపాలని సూచించింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడిపేందుకు సిద్ధమవుతోంది. దూరప్రాంతాలకు వెళ్లేవారికి ఈ రైళ్ళు ప్రయోజనకరంగా వుంటాయి. ప్రస్తుతం హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల నుంచి ప్రతిరోజు 22 రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా రద్దీ ఉన్న మార్గాల్లో మరో 15 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. కరోనా వైరస్ దృష్ట్యా రెగ్యులర్ రైళ్ల స్థానంలో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. వీటికి విపరీతమయిన డిమాండ్ వుంది. తెలుగు రాష్ట్రాల్లో అంతర్రాష్ట్ర సర్వీసులు ప్రారంభం అయితే ప్రయాణాలకు అవకాశం ఉండేది. కానీ ఆ అవకాశం లేకపోవడంతో విపరీతమయిన వత్తిడి ఏర్పడింది. వెయిటింగ్ లిస్ట్ కూడా లేకపోవడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. త్వరలో అందుబాటులోకి రాబోయే రిజర్వేషన్ బోగీలతోపాటు సాధారణ బోగీల్లోనూ ముందుగా బుకింగ్ చేసుకోవలసి ఉంటుంది. లాక్డౌన్ నిబంధనలను సడలించి తొలివిడత సికింద్రాబాద్–న్యూఢిల్లీ, బెంగళూర్–న్యూఢిల్లీల మధ్య ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టారు. సికింద్రాబాద్ నుంచి ముంబై, విశాఖ, హౌరా, దానాపూర్, విజయవాడ, తిరుపతి రూట్లలో కూడా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీకి ప్రయాణికుల డిమాండ్ బాగా ఉండటంతో ఈ రూట్లో మరో సర్వీసును ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నుంచి తిరుపతికి మరో ప్రత్యేక రైలు అందుబాటులోకి రానుంది. తిరుమలలో భక్తుల రద్దీ కూడా పెరగనుంది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి పట్నాకు, హౌరాకు ఒక్కో రైలు నడుస్తోంది. ఇపుడున్న రైళ్లలో 100కు పైనే వెయిటింగ్ లిస్టు నమోదవుతోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు రూట్లలోనూ ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించారు. సికింద్రాబాద్–చెన్నై మధ్య ప్రత్యేక రైళ్లు నడపడం కోసం దక్షిణమధ్య రైల్వే, దక్షిణ రైల్వేల మధ్య చర్చలు జరుగుతున్నాయి. కాచిగూడ నుంచి బెంగళూరుకు మరో సర్వీస్ నడిచే అవకాశం ఉంది. త్వరలో ఈ రైళ్ళకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యే అవకాశం వుంది.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
6 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
9 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
12 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
3 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
13 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
10 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
13 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
13 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
7 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
16 hours ago
ఇంకా