ఇసుక రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. వరంగల్లో ఘోర ప్రమాదం
03-09-202003-09-2020 11:54:18 IST
Updated On 03-09-2020 13:29:42 ISTUpdated On 03-09-20202020-09-03T06:24:18.587Z03-09-2020 2020-09-03T06:20:46.832Z - 2020-09-03T07:59:42.422Z - 03-09-2020

రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతాయో మృత్యువుని రాసే యముడికే అర్థంకాదు. ఇసుక లారీ అతి వేగం ఐదుగురు యువకులను బలితీసుకుంది. అప్పటి వరకు ఆనందంగా గడిపిన యువకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. స్నేహితుడి సోదరుడు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న వారు అంతలోనే విగతజీవులుగా మారారు. దీంతో ఆ కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం పసరగొండ క్రాస్ వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులు అక్కడికక్కడే మృతిచెందడం చూపరులను కలిచి వేసింది. కాళేశ్వరం నుంచి వరంగల్ వైపు వేగంగా వస్తున్న ఇసుక లారీ ఈ యువకులు ప్రయాణిస్తున్న కారును ఢీకొంది. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో వరంగల్ అర్బన్ జిల్లా పెద్దమ్మగడ్డకు చెందిన కండె జయప్రకాశ్(23), పోచమ్మమైదాన్కు చెందిన మేకల రాకేశ్(23), హసన్పర్తికి చెందిన గజవెల్లి రోహిత్(20), ములుగుకు చెందిన కొండబోయిన నరేశ్(23), వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటకు చెందిన షేక్ సాబీర్(19) ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు ప్రమాద సమాచారం తెలియగానే పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. అక్కడ లభించిన ఆధారాలతో వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. పెద్దమ్మగడ్డకు చెందిన కండె జయప్రకాశ్ డిగ్రీ చదువుతున్నాడు, నర్సంపేటకు చెందిన షేక్ సాబీర్ ఆటోనగర్లో ఉంటూ బేకరీలో పని చేస్తున్నాడు. హసన్పర్తికి చెందిన గజవెల్లి రోహిత్, ములుగుకు చెందిన కొండబోయిన నరేశ్, పోచమ్మమైదాన్కు చెందిన మేకల రాకేశ్ కూలి పని చేస్తున్నారు. రాకేశ్ సోదరుడు ప్రవీణ్ పుట్టిరోజు సందర్భంగా కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. వేడుకల్లో ఆరుగురు కలసి పార్టీ చేసుకున్నారు. అర్ధరాత్రి కావడంతో ములుగుకు బస్సులు వుండవని భావించి నరేశ్ను ఇంటి దగ్గర దింపేందుకు హన్మకొండలోని ఓ స్నేహితుని దగ్గర నుంచి కారును తీసుకొచ్చారు. ఆ ఐదుగురు యువకులు కారులో బయలుదేరారు. తెల్లవారు జామున పసరగొండ క్రాస్ వద్దకు రాగానే కారు మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తున్న సమయంలో లారీ వేగంగా వచ్చి కారును ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద స్థలాన్ని ఇన్చార్జి డీసీపీ వెంకటలక్ష్మి బుధవారం పరిశీలించారు. మృతదేహాలను ఎంజీఎంకు తరలించారు. ఇదిలా వుంటే పుట్టినరోజు జరుపుకున్న ప్రవీణ్ సోదరుడు రాకేశ్కు ఇటీవల వివాహం అయింది. 3 నెలల కూతురు ఉంది. ఈ ప్రాంతంలో లారీలు అతివేగంగా వెళతాయని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని స్థానికులు అంటున్నారు. ఒక్క ప్రమాదం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
13 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
10 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
12 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
16 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
19 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
20 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా