ఆందోళనకరంగా వరవరరావు ఆరోగ్యం... బెయిల్పై తేల్చాలని బాంబే హైకోర్ట్ ఆదేశం
21-07-202021-07-2020 12:59:06 IST
Updated On 21-07-2020 16:11:27 ISTUpdated On 21-07-20202020-07-21T07:29:06.886Z21-07-2020 2020-07-21T07:28:15.710Z - 2020-07-21T10:41:27.815Z - 21-07-2020

ప్రముఖ కవి, సామాజిక కార్యకర్త, విరసం సంస్థాపక సభ్యుడు వరవరరావు ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించిందని, తాను అంపశయ్యపై ఉన్నట్లేనని ఆయన లాయర్ బాంబే హైకోర్టుకు తెలిపారు. తన క్లయింట్ పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వీవీ లాయర్ సందీప్ పసుబోలా సోమవారం బాంబే హైకోర్టుకు తెలియజేశారు. ఒక్క కరోనా తోటే కాకుండా అనేక వ్యాదులు ఆయనను పట్టి పీడిస్తున్నాయని, ఆయన రోజులు లెక్కపెడుతున్న పరిస్థితి ఏర్పడిందని లాయర్ కోర్టుకు తెలిపారు. ఒకవేళ తన క్లయింటు చనిపోయేటట్లయితే చివరిరోజుల్లో ఆయన కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఉండేలా చూడాలని లాయర్ హైకోర్టును కోరారు. తక్షణం ఆయనకు బెయిల్ ఇప్పించాలని కూడా డిమాండ్ చేశారు. దీంతో వరవరరావును ఆయన కుటుంబ సభ్యులు చూడవచ్చా అనే అంశంపై మంగళవారంలోపు సమాధానం ఇవ్వాలని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకి హైకోర్టు దిశానిర్దేశం చేసింది. ‘‘విరసం నేత వరవరరావు అంపశయ్యపై ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. మరి కొన్ని రోజులు మాత్రమే ఆయన బతికే అవకాశం ఉంది. ఒకవేళ, ఆయన చనిపోతే, కనీసం కుటుంబ సభ్యుల సమక్షంలో మరణించేలా చూడండి. విచారణను ఏ విధంగానూ ప్రభావితం చేసే స్థితిలో లేని వరవరరావుకు బెయిల్ ఇప్పించండి’’ అని ఆయన తరపు న్యాయవాది సుదీప్ పస్బోలా బోంబే హైకోర్టుకు విన్నవించారు. విచారణను ప్రభావితం చేసే స్థితిలో ఆయన లేరన్న విషయంపై చివరికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు కూడా భిన్నాభిప్రాయాలు లేవని తెలిపారు. ఆయనకు అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయనీ, పైగా, ఇప్పుడు కరోనా కూడా సోకిందని లాయర్ వివరించారు. అయితే, కరోనా రోగుల్ని కలిసేందుకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) మార్గదర్శకాలు అంగీకరించవని కోర్టుకు ఎన్ఐఏ తరపున న్యాయవాది, అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ విన్నవించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కుటుంబ సభ్యులు వరవరరావును కలుసుకునేందుకు ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది దీపక్ థాకరే తెలిపారు. అయితే నిర్దిష్ట దూరం నుంచైనా ఆయనను కుటుంబ సభ్యులు చూసేందుకు వీలవుతుందా అంటూ పలు ప్రశ్నలు అడిగిన ధర్మాసనం.. బుధవారంలోగా తమకు సమాధానం చెప్పాలని ఆదేశించింది. కాగా, ఆయన ఆరోగ్య పరిస్థితిని తమకు పారదర్శకంగా తెలపాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన సహచరి హేమలత, కూతుర్లు సహజ, అనల, పవన డిమాండ్ చేశారు. ఆయనను జేజే, సెయింట్ జార్జ్, నానావతి ఆస్పత్రులకు తరలించడం కూడా తమకు తెలియదని పేర్కొన్నారు. ‘‘వరవరరావు తనకు తానుగా ఏ పనీ చేయలేకపోతున్నారు. ఆయనకు సహకరించడానికి కుటుంబ సభ్యుల్లో ఒకరిని తోడుగా ఉండేలా చూడండి. ఆరోగ్య పరిస్థితిని రెండు రోజులకోసారి అధికారికంగా తెలియజేయాలని జైలు అధికారులు, ఆస్పత్రి సిబ్బందిని ఆదేశించండి’’ అని డిమాండ్ చేశారు. ఆయన చికిత్సకు సంబంధించిన వైద్య నివేదికలన్నీ అందుబాటులో ఉంచాలన్నారు. బెయిల్ తీసుకోవడానికున్న అడ్డంకులన్నీ తొలగించాలని కోరారు. ఎల్గార్ పరిషద్ అల్లర్ల కేసులో నిందితుడై 2018 నుంచి మహారాష్ట్రలో నిర్బంధంలో ఉన్న వరవరరావు ఆరోగ్యం క్షీణించి ముంబైలోని జేజే హాస్పిటల్లో చేర్పించినప్పుడు ఆయనకు అప్పటికే కరోనా సోకిన విషయం తేలింది. జేజే హాస్పిటల్లో గత వారం ఉన్నప్పుడు ఆయన తల పడకకు కొట్టుకని తలకు గాయమైందని, గాయానికి కుట్లుకూడా వేశామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ ఘటనతో వీవీని నానావతి హాస్పిటల్కు తరలించారు. అయితే వరవరరావు నీళ్లుతాగేందుకు గ్లాసు అందుకనే ప్రయత్నంలో పడక మూలకు ఆయన తల కొట్టుకుందని, దాంతో గాయమైందని, వెంటనే ఆయనకు సపరిచర్యలు చేశామని జేజే ఆసుపత్రి డీన్ డాక్టర్ రంజిత్ మంకేశ్వర్ తెలిపారు. ఈ విషయంలో దాయవలిసందేమీ లేదని ఆసుపత్రి నుంచి ఆయనను తరలించేటప్పుడు బదిలీ రిపోర్టులో ఇవన్నీ పొందుపర్చామని తెలిపారు. కాగా వరవరరావు పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై గురువారం లోపు తనకు నివేదించాలని బాంబై హైకోర్టు ఎన్ఐఏని ఆదేశించింది.

ఏపీలో స్కూల్స్ బంద్
13 hours ago

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?
13 hours ago

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
17 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
19 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
14 hours ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
21 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
21 hours ago

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్పై ప్రమాణం చేయగలరా
14 hours ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
16 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
a day ago
ఇంకా